Wednesday, January 9, 2008

2. ధ్యానం

ఇంతవరకు మనం మనస్సు స్వభావం, దానిని ఎలా నియంత్రించుకోవాలో చర్చించుకున్నాం. ఐతే మనస్సును అదుపులో ఉంచుకోవడానికి, సంపూర్ణ సారీరక ఆరోగ్యంతో ప్రశాంత జీవితం గడపడానికి అనువైన ఎన్నో ధ్యాన పద్ధతులు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు తెలిసిన ధ్యాన మార్గాలలో అతి సులువైన,అందరూ ఆచరించదగ్గ ధ్యాన పద్ధతే “ఆనాపాన
సతి”. అనగా “శ్వాసమీద ధ్యాస”. దీనిని అచరించే విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పద్మాసనంగాని లేదా సుఖాసనం గాని వేసుకొని కూర్చుని, రెండుచేతులు జోడించి, ఒకవేళ కుర్చీలో కూర్చున్నట్లైతే రెండుకాళ్ళు క్రాస్ చేసుకొని, వెన్నెముకను నిటారుగా ఉంచి, కళ్ళు మూసుకుని, మనస్సును ఉచ్చ్వాస నిశ్వాసలపై కేంద్రీకరిచడమే ఈ ధ్యాన పద్దతి. అలా చేసినప్పుడు మన శ్వాస తనంతట తాను చిన్నదిగా ఐపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమద్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్ధానంలో అంటే సుదర్శన చక్ర స్ధానంలో తనంతట తాను సుఖముగా, స్ధితం ఐపోతుంది. అప్పుడు ఆ స్ధీతి లో తదేకమై వుంటే, తన్మయులమై వుంటే, మూడవ కన్ను యొక్క విస్పోట నం మొదలవుతుంది. ఈ మూడవకన్ను విస్పోటనాన్ని గమనించడాన్నే “విపస్సన” అంటారు. మన శరీరానికి ఎంతయితే వయస్సుందో అన్ని నిముషాలు ఈ ధ్యానం చేయడం ఉత్తమం. ప్రారంభ దశలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఈ ఆనాపానసతికి ఉపక్రమించే ముంచు ఒక అర్ధ గ్లాసు నీళ్ళు త్రాగి, ఇంకొక అర్ధగ్లాసు నీళ్ళను ప్రక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పూర్తయిన తర్వాత, మెల్లిగా కళ్ళు తెరచిన తర్వాత మిగిలిన అర్ధగ్లాసు నీళ్ళు త్రాగాలి. ధ్యానం చేసేటప్పుడు మనస్సు అనేక విషయాలపైకి పరుగెడుతూ వుంటుంది. అలాంటి మనస్సును సాక్షీభూతంగా గమనిస్తూ, మరల దానిని శ్వాసమీద ధ్యాస వద్దకు అనగా భ్రూమధ్యానికి పట్టుకురావడానికి ప్రయత్నించాలి. ఈవిధముగా క్రమాభ్యాసము చేస్తూవుంటే మనస్సు అనేది మన ఆధీనం లోకి వచ్చి మనం చెప్పినట్లుగా వింటుంది. దీనిని నిండు పౌర్ణమి రోజున చేసినచో అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఇది చాలా మహత్తర మైనటువంటి ధ్యాన మార్గం. ఈ ధ్యానపద్ధతిని ఆచరించి, ప్రజలకోసం ప్రవేశ పెట్టినవారు గౌతమ బుద్ధుడు. ఐతే ఈ ధ్యాన పద్ధతిని ప్రస్తుత తరుణంలో ఆచరిస్తూ, ప్రజాబాహుళ్యం లోకి విరివిగా చొచ్చుకొపోయేటట్లు చేసినవారు బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిగారు. వీరు దీనిని మన రాష్ట్రంలోనేగాక, ప్రపంచ పరిధిలో కొన్ని లక్షల మందిచేత ఆచరింప జేస్తు న్నారు. మానవుని మానసిక వికాసంలో అపూర్వమైన మార్పులు సాధిస్తూ, అనేకమంది ఆనందంగా జీవించడానికి రాచబాటలు వేస్తున్నారు. “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటి” అను పేరుతో అధ్యాత్మిక సంస్ధను స్ధాపించి, “ధ్యానాంధ్ర ప్రదేశ్” అనే మాసపత్రికను నడిపిస్తూ యావత్ ప్రపంచ ప్రజానీకానికి ధ్యాన, భక్తి, జ్ఞాన రంగాలలో శిక్షణనిస్తూ అపారమైన సేవ చేస్తున్నారు. ఈ ధ్యాన పద్ధతి ప్రతి ఒక్కరు ఆచరించదగ్గ సులువైన మార్గం. ప్రపంచములో ఎంతోమంది దీనిని ఆచరించి సత్ఫలితాలను సాధించి, వారి జీవితాలను అందంగా, ఆదర్శవంతంగా మలచుకొని, ఆనందామృతాన్ని గ్రోలుతున్నారు. కాబట్టి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. తద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధిద్ధాం. ఆనందంగా జీవిద్దం.

- నేతి విజయదేవ్

1 Comments:

At January 9, 2008 at 7:57 PM , Blogger Naga said...

బాగా ఉపయోగపడే టపా. కృతజ్ఞతలు.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home