tag:blogger.com,1999:blog-69682906488462524672024-03-08T10:58:49.684-08:00nagulavancha vasantharaonaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.comBlogger93125tag:blogger.com,1999:blog-6968290648846252467.post-83269455451627036762010-09-02T23:46:00.000-07:002010-09-02T23:47:11.609-07:00నాయకుడు – వినాయకుడుతెల్లదొరల గుప్పిట్లో బందీనైపోయి నేను<br />అష్ట కస్టంబులతోడ అవమానం బొందినాను<br /><br />నాదు బాధ జూడలేక వీరులెందరొ జనియించిరి<br />గాంధీ నెహ్రూలవంటి నేతలెందరొ ఉదయించిరి<br /><br />ఝాన్సీ అల్లూరి వంటి విప్లవ వీరులుద్భవించి<br />దాస్య సృంఖలాలను త్రెంచివేసి నిస్క్రమించిరి<br /><br />వీర పుత్రులెందరినోగని స్వతంత్రమ్ము బొందినాను<br />నా బిడ్డల భవిష్యత్తుకై బోలెడు కలలుగన్నాను<br /><br />ఏదీ ఆ వీరత్వం ఎక్కడుంది ఉడుకు రక్తం<br />నరనరంబులలోన మిగుల స్వార్థంబే నిండుకుంది<br /><br />కుటిల రాజకీయాలతొ కపట వేషధారణతో <br />చిలుక పలుకులెన్నొ పలికి చిత్రంగా బతుకుచుండిరి<br /><br />వర్తకంబున నీతిదప్పి సరుకును నల్లబజారు చేర్చి<br />సామాన్యుడి గుండెలపై బరువెంతో మోపినారు<br /><br />సరస్వతిని పూజిస్తూనె చదువులమ్ము కొనుచుండిరి<br />విద్యాలయాలన్నింటిని వ్యాపారంగ మార్చేస్తిరి<br /><br />చదువుకున్న మేధావులంత విదేశాల కేగుచుంటె<br />వట్టిపోయిన పొదుగువోలె కృశియించి పోయినాను<br /><br />తెల్లవలువలు ధరిస్తూనె ఎర్రటి నెత్తుటి మరకలు<br />శాంతిమంత్రం జపిస్తూనె షఠగోపు కుతంత్రాలు<br /><br />విదేశీయులు తంతె తప్ప దేశభక్తి పుట్టదు మరి<br />అవమానిస్తేనె తప్ప విప్లవంబు లేవదేమొ<br /><br />భరత మాతనని నేను ఏమి జూసి గర్వించను<br />కన్నతల్లి కంట్లోనె కారంజల్లు కొడుకులుంటె<br /><br />గాంధీయే నేడుంటే గుండెబగిలి చచ్చెటోడు<br />బోసుగనక బతికుంటే భోరున విలపించెటోడు<br /><br />సత్యాహింసలన్న జాతిపిత మాట మరచి<br />ఉగ్రవాదమంటు లెస్స ఉన్మత్తుడవైతివోయి<br /><br />భవిష్యత్తు తలచుకొని భారంగా నిట్టూర్చితి<br />కరుగని హృదయాల గాంచి కన్నీటిని కార్చుచుంటి<br /><br />నేను నాది అన్నంతసేపు నాయకుడు వినాయకుడౌను<br />మనం మనకు అనుకుంటే వెల్లివిరియు సౌభాగ్యం<br /><br />చదువుకున్న యువకులంత రాజకీయాలలొ చేరి<br />చదువుసంధ్యలు లేనట్టి వృద్ధనాయకుల నావలనెట్టి<br /><br />ఆదర్శ భారతాన్ని అందంగా తీర్చిదిద్ది<br />భరతమాత నైన నాకు బహుమానంగా ఇవ్వండి<br /><br />- నాగులవంచ వసంతరావుnaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-55907447927113415582010-06-30T00:46:00.000-07:002010-06-30T00:51:36.799-07:00వసంతరావు మాటలు - వజ్రాల మూటలు<br /><br />పెదవిపైన నుండు పెను దరహాసంబు 1<br />కడుపులోన మిగుల కల్మషంబు<br />కౌగిలింతలతోటి కపట నాటకంబు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /> <br />పనియె దైవమంటు పెద్దలు చెప్పగా 2<br />పనిని పక్కనబెట్టి ప్రతిమకు పూజలు<br />పనిలొ ప్రావీణ్యతయె పాలాభిషేకంబు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />కడుపు మండుతుంది కాషాము జూడ 3<br />కడుపునిండ కల్మష కషాయముండు<br />కల్మషము లేనపుడె కాషాయమునకు విలువ<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />షిరిడి సాయియనుచు శివమెత్తుదురు జనులు 4<br />ఆర్భాటముగ పెక్కు ఆశ్రమ స్థాపనలు<br />షిరిడి బాబకె చివరకు శఠగోపమిత్తురు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />అవధూతలమంటు అతివలతొ సరసాలు 5<br />బడా బాబాలమంటు భామలతొ భోగాలు<br />దొంగ బాబలు బాగ దొరుకుచుండిరి ఇలలొ<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />ఎదుగుదలను జూసి ఓర్వలేరు జనులు 6<br />బక్కచిక్కినవేళ బహు పలకరింపులు<br />ఆధిపత్య పోరు అతి సహజమైపోయెను<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />ముసలితనములోన కొడుకు కోడలు కలిసి 7<br />బాగ జూతురంటు గంజి గటక తాగి<br />బహుగ కూడబెట్టి కొడుకులకిత్తురు<br />ముదుసలైనవేళ ముడ్డిమీదనే తందురు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />కొడుకు కోడలంటె కొండంత ప్రేమాయె 8<br />బిడ్డ అల్లుడిపట్ల సవతి తల్లి ప్రేమ<br />కొడుకు కొండిగాడు కొరిగించేదేమిటో<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />మూర్ఖులైన పిచ్చి ముసలి తల్లిదండ్రులు 9<br />కొడుకు కోడలుపైన కోటి ఆశలు పెట్టి<br />బిడ్డ అల్లుడు మరియు బంధు మిత్రులనెల్ల <br />ఎడబాపుకొని చివరకు ఏకాకులై చత్తురు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />కొడుకు పీకినదేమి బిడ్డ పీకనిదేమి 10<br />మూర్ఖులైన ముసలి చాదస్తము తప్ప<br />చేతగానివేళ కొడుకులచేతనే తన్నులు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />సుపుత్రుడెల్లపుడు బహు సుఖంగుండాలని 11<br />కండ్లల్లబెట్టుకొని కాపాడజూతురు<br />మంచాన పడ్డపుడు మాయమౌదురని తెలియరు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />కొడుకు బిడ్డలిద్దరు ఒక్క బొడ్డునుండి రాగ 12<br />పక్షపాత బుద్ధిచే పడతిని చలకనగ జూతురు<br />కొడుకు కొండిగానికి కొమ్ములెట్లొచ్చెనో<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />కలలుగనెడివారు ధరణి కోకొల్లలు 13<br />కష్టపడని కలలు కల్లలగును<br />కలల సాకారంబె కస్టానికి గురుతు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />వట్టి మాటలు కావు వజ్రాల మూటలు 14 <br />మాయ మాటలు కావు ముత్యాల సరాలు<br />కల్పితాలు కావు కన్నీళ్ళ గాధలు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలు<br /><br />సుఖ దుఖాలు, కలిమి లేములు 15<br />లాభ నష్టాలు, జయాపజయాలు<br />మానావమానాలు మనిషికి సహజాలు<br />వసంతరావు మాటలు వజ్రాల మూటలుnaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-47101475284268289102010-06-19T04:59:00.000-07:002010-06-19T05:02:33.752-07:00ఏకలవ్య జ్ఞానం<br /><br />మానవునికి అన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన, అనుభూతి లభిస్తుంది. కాని దేవుని విషయంలో మాత్రం స్పష్టత లేదు. రకరకాల మనుషులు రకరకాలుగా దేవుని గురించి ఊహిస్తూ, భావిస్తూ, భ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరూ దేవుని ఉనికిని గురించి, అనుభూతిని గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు ఒక దేవాలయంలో ఇష్టదైవంగా కొలిచే దేవతామూర్తి విగ్రహాన్నే అమాంతం దొంగలు ఎత్తుకు పోతూ ఉంటే స్వయాన దేవుడు అని చెప్పుకునే ఆ విగ్రహం కూడా ఏమీ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. హేతుబద్ధమైన ఆలోచనగల ఏ వ్యక్తి యైనా ఈ విధంగానే ఆలోచిస్తాడు. నిజంగా ఆ విగ్రహమే దేవుడైతే, లేదా ఆ విగ్రహానికే గనక శక్తి ఉన్నట్లైతే దొంగ చెంపలు వాయించి, తగిన గుణపాఠం నేర్పి దొంగతనం మానిపించ గలిగేది. కాని మానవుడిచే తయారుచేయబడిన ఆ విగ్రహం అశక్తతను ప్రదర్శిస్తూ ఉంది. దీనినిబట్టి చూస్తే విగ్రహం దేవుని ప్రతిరూపమేగాని దేవుడు మాత్రం కాదు. మనిషి సృష్టించుకున్న వాటికే మానవుడు తిరిగి అద్భుత శక్తులను ఆపాదిస్తున్నాడు తప్ప, తనలోగల దివ్య శక్తులను తెలుసుకోలేకపోతున్నాడు. <br /><br /> ఈ దివ్య శక్తులను అనుభూతి పొందడానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో విఫలమైన మానవుడు అడ్డదారుల్లో పయనిస్తూ శ్రమలేకుండానే సులువుగా మోక్షాన్ని సంపాదించుటకు బూటకపు గురువులను తెలియక ఆశ్రయిస్తున్నాడు. వారు చూపించే మంత్ర, తంత్ర, యంత్ర గారడీ విద్యలు, మహిమలు, మహత్తులు, హిప్నటిజం లాంటి విచిత్ర ప్రక్రియలతో తమకేదో దివ్య శక్తులున్నట్లుగా ప్రజలను భ్రమింపజేస్తూ తమ పని కానిచ్చుకుంటున్నారు నేటి బూటక స్వాములు. నిజానికి శక్తి అంటూ ఉంటే అది దైవ సృష్టిలోని ప్రతి జీవికి చెందినదై ఉంటుంది. అన్ని జీవులలో మానవుడు ఉత్తమమైన జీవి కాబట్టి ఆ దివ్య శక్తిని ఉద్దీపన చేసుకునే అవకాశం ఉంది. దానికి సుశిక్షితులైన యోగాచార్యులు, గురువులు ఉండవలసిందే. కాని నేటి స్వార్ధపరులైన గురువులు, యోగులు మానవాళి క్షేమం మరిచి, స్వప్రయోజనాలకై ప్రాకులాడుతూ కపటంగా జీవిస్తూ, అమాయకపు ప్రజలను వంచన చేస్తున్నారు. వీరు చెపే నీతులు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. కాని ఆచరణ దగ్గరకు వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చేతలకు, మాటలకు చాలా వ్యత్యాసం కనబరుస్తారు. తాను ఆచరించకుండా ఇతరులకు చెప్పే అధికారం ఎవ్వరికి లేదు. అందుకే మహాత్ములైన వారు ఆచరించిన తర్వాతే ఇతరులకు నీతి వాక్యాలు బోధించారు. అప్పుడే మనిషి మాటలకు విలువ వస్తుంది. <br /> <br /> మంచిగా ఉండు – మంచినే చేయి. ఈ రెండు వాక్యాలు చాలు జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి. చూడడానికి ఈ వాక్యాలు చిన్నగా అనిపించినా నిజ జీవితంలో వాటిని ఆచరించాలంటె చాలా క్రమశిక్షణ, సమయ పాలన, దూరదృష్టి, ఆత్మ నిగ్రహం కావాలి. మంచి చెడుల మధ్యగల అంతరాన్ని గ్రహించగల సూక్ష్మ బుద్ధి కావాలి. మానవతా విలువలలోని మాధుర్యాన్ని గ్రహించ గలగాలి. త్యాగ గుణంలోని గొప్పదనాన్ని, ఆత్మానందాన్ని అందిపుచ్చుకోగలగాలి. తనకున్న దానిలో ఇతరులకు సహాయం చేసి, కృతజ్ఞతా భావంతో వారి కళ్ళలో మెరిసే ఆనంద భాష్పాలను చూసి పులకించి పోగలగాలి. మంచితనమనే మానవతా పరిమళాలను పదిమందికి వెదజల్లగలగాలి. <br /><br /> మోసం నుండి తప్పించుకోవాలంటే కేవలం మంచి పుస్తకాలే మనిషికి శరణ్యమని చెపాక తప్పదు. మనిషి మతం ముసుగులో మోసం చేసే అవకాశం ఉంది కాని మంచి పుస్తకం మనిషిని మోసం చేసే అవకాశమే లేదు. ఎందరో మహానుభావులు తమ జీవితంలో ఆచరించి బోధించిన అమూల్య జ్ఞాన రత్నాలు మన పురాతన గ్రంధాలలో లభ్యమౌతాయి. వాటిని చదివి ఆచరిస్తే అంతకుమించిన ఆత్మోన్నతి మరొకటి లేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఎంతోమంది పైకి నీతులు చెబుతూనే లోన మాత్రం కపటంగా కుట్రలు చేస్తూ వక్ర మార్గంలో ఆలోచిస్తూ ఉంటారు. వారు చెప్పేవన్నీ నిజమని నమ్మితే మీరు మోసపోయినట్లే. పైకి మాత్రం నీతులు చెబుతూ ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి వారికి లాభదాయకమైన పనిని, దానివల్ల ఇతరులకు కీడు జరిగినా సరే స్వార్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరులలోని తప్పులను ప్రతి ఒక్కరు వేలెత్తి చూపెడుతూ ఉంటారు. కాని వాటికి పరిష్కారం మాత్రం సూచించటం లేదు. <br /><br />ఈ సమస్యకు పరిష్కారం మనిషి ఎవరినో నమ్మడం కన్నా తనను తాను నమ్ముకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ముక్కోటి దేవతల మీద నమ్మక్మున్నా తనమీద తనకు నమ్మకం లేనిచో ప్రయోజనం శూన్యం. ఆత్మ విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఇదే. తనను తాను నమ్ముకున్న వాడు ఎన్నటికీ చెడిపోడు. ఇతరులను నమ్మితేనే వేషాలు, మోసాలు. మరెందుకింక ఆలస్యం. ఏకలవ్యునివలె మంచి పుస్తకాన్నే గురువుగా భావించి, ఆదర్శాలను ఆచరణలో చూపించి మోక్షగాముల మౌదాం. మోసాల బారినుండి మనల్ని మనం కాపాడుకుందాం. <br /><br />- నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-63558032207115131552010-06-16T04:38:00.000-07:002010-06-16T04:39:21.346-07:00నిత్య సత్యాలు – ఆణి ముత్యాలునిత్య జీవితంలో నిష్కపటంగా, నిజాయితీగా బ్రతకవలసిన మనిషి కపటంగా బ్రతుకుతున్నాడు. దీనికిగల కారణాలనుగనక పరిశీలించినట్లైతే ఒక పామరుడు కపటముగా జీవిస్తూ మందిని మోసము చేసాడంటే అమాయకత్వం లేదా అజ్ఞానం అనుకోవచ్చు. కాని అన్నీ తెలిసిన, బాగా చదువుకున్న వారు, సమాజములో పెద్దలమని గొప్ప పేరు ప్రతిష్టలుగలవారమని పిలిపించుకొనేవారు, ఇంకా విచిత్రమేమిటంటే గురువులమని చెప్పుకుంటూ భక్తి, జ్ఞానం ముసుగులో అమాయకులను మోసం చేస్తూ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. నూటికి తొంబై శాతం మంది కపటత్వంలో బ్రతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇది పచ్చి నిజం. దీనికి కారణం ఏమిటి? రాతలు చాలా బాగుంటాయి కాని చేతలవరకు వచ్చేసరికి విచిత్రంగా, స్వార్ధంగా బ్రతుకుతుంటారు. ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా అన్నట్లు ఇతరులను మోసం చేసి పబ్బం గడుపుకున్నా తనలోని అంతరాత్మకు తాను తప్పు చేస్తున్ననన్న సంగతి బాగా తెలుసు. కాకపోతే తనలోగల అహంభావం వల్ల, తాను ఇతరులముందు చులకనైపోతానన్న భావనతో తనలోని తప్పులను మనిషి ఒప్పుకోడు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ యనే సూత్రం ప్రకారం తానే అన్ని ప్రాణులలో వివిధ రూపాలలో నివసిస్తున్నాడన్న సత్యాన్ని తెలుసుకోలేక ఇతరులకు అన్యాం చేసి, మోసం చేసి, దగా చేసి తానేదో తెలివైన వాడినని, మాయ మాటలతో మందిని మోసం చేయగలిగానని, తన అతి తెలివికి తానే అతిగా పొంగిపోతూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. సంస్కారమున్న ఏ వ్యక్తి ఇతరులకు బాధ కలిగించే పని చేయడు. తనలోని అంతరాత్మ ప్రబోధాన్ని పక్కకు నెట్టి, స్వార్ధ ప్రయోజనాన్ని ఆశించి వక్ర మార్గంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు దుష్ట మానవుడు. ఐతే తాను చేసే పని తప్పని తెలిసి కూడా మంచిని ఆచరించలేక పోవడం కేవలం తనలోని బలహీనతలవల్లనే. ఇంకా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావం అని సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఏది ఏమైనా తన పనిని ముగించుకోవడానికి ఎంతటి దుష్ట కార్యానికైనా సిద్ధపడుతున్నాడు వక్రబుద్ధిగల మానవుడు.<br /><br />తప్పు చేయడం ఎంత నేరమో, తప్పు చేయడానికి సహకరించడం లేదా అవకాశమివ్వడం కూడా అంతే నేరమౌతుంది. మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేయడానికి సహకరించిన వారిదికూడా తప్పే ఔతుంది. నీ అమాయకవం వల్ల, నీ అవగాహనా రాహిత్యం వల్ల లేదా నీ మూఢ విశ్వాసం వల్ల నిన్ను ఎదుటివాడు మోసం చేయగలుగుతున్నాడంటే అందులో నీ లోపం కూడా ఉన్నట్లే. నీవు నిండా జాగ్ర్త్తగా ఉంటే నిన్ను మోసం చేసే అవకాశమే లేదు. నీవు ఏదో ఒక ప్రలోభానికి లోబడితేనే దానిని ఎదుటివాడు ఆసరాగా తీసుకుని నిన్ను నమ్మించి నిలువునా నట్టేట ముంచగలుగుతున్నాడు. నీవు తెలివి తెచ్చుకుని, అప్రమత్తుడవై ఉన్ననాడు నీ దరిదాపులకు రావడానికి కూడా వాడు జంకుతాడు. చర్య - ప్రతి చర్య సిద్ధాంతమంటే ఇదేనని తెలుసుకోవాలి. యధా రాజా తధా ప్రజ. యదా భక్తా తదా గురు అనేది నవీన కాలజ్ఞానం. అంతరాత్మ ప్రబోధాన్ని విస్మరించి సంచరించే మోసపు బాబాలకు ఇంతకన్న మంచి ఉపమానం మరొకటి లేదేమో! మీరే సావధానంగా ఆలోచించండి. మంచివాళ్ళకు మంచిగా ఉండడం, చెడ్డవాళ్ళకు చెడ్డగా ఉండడమే సరియైన మార్గం. అతి మంచితనం కూడా చేతగాని తనం కిందికే వస్తుంది. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అనేది అయా పరిస్థులనుబట్టి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అడుగు ముందుకు వేయడమే విజ్ఞతగల మానవుని ప్రథమ కర్తవ్యం. <br /><br /><br />నేటి సమాజంలో హాయిగా, అన్ని వసతులతో, మనసుకు ఎలాంటి నొప్పి కలుగకుండా సంతోషంగా బ్రతకాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. ఈ కోరికను తీర్చుకోవడానికి నిర్విరామంగా కృషిచేసి ఫలితాన్ని అనుభవించే బదులు, అతి సులువుగా, ఎలాంటి కస్టం లేకుండానే అన్ని ఆనందాలను పొందాలని అడ్డదారుల్లో పయనిస్తుంటారు చాలా మంది. ఒక్కొక్కరు ఒక్కో విధమైన ట్రిక్కులతో, జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఒకవిధమైన ప్రయోగం ప్రజలకు తెలిసిపోగానే అప్రమత్తమైన మోసగాళ్ళు మరో రకమైన ఎత్తుగడవేసి ప్రజలను చిత్తు చిత్తుగా మోసం చేస్తూ ఉంటారు. తమకు జ్ఞానం గురించి అంతా తెలుసునని చెప్పుకొనే గురువులు, స్వాములు, బాబాలు కూడా బలహీనతలకు లోనై ఉచితానుచితాలు మరిచి, కామినీ, కాంచన, కీర్తి ప్రతిష్టల మోజులోపడి భ్రష్టులవడమే కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికి బధ్యులు బాబాలా లేక అమాయకపు ప్రజలా అనేది చర్చనీయాంశము.<br /><br /><br /> నిజం చెప్పాలంటే మనం ఒకరి చేతిలో మోసపోయామంటే ఆ పొరపాటు మనదే. ఎందుకంటే మోసం చేయడానికి ఎదుటి వ్యక్తికి నీవు అవకాశమ కల్పించావు కాబట్టి. ఎందుకు అవకాశం కల్పించావంటే అందులో నీ స్వార్ధం దాగివుంది. ఎందుకంటే కష్టపడకుండానే నీకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు రెడీమేడ్ ముక్తి, మోక్షం నీకు కావాలి. దానికి తగిన సాధన, నియమ నిష్టలు పాటించే తీరిక, ఓపిక నీకు లేదు కాబట్టి బూటక స్వాములను నమ్మి నీ భారమంతా అతనిపై వేసి హాయిగా రిలాక్స్ కావాలనుకున్నావు. ఛివరికి ఏమైంది నిన్ను నిలువునా ముంచేసి అతడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. నీవు ఈ సత్యాన్ని గ్రహించి జాగ్రత్తపడేసరికే స్వామి చల్లగా జారుకుంటున్నాడు. చేతులు కాలిన పిదప ఆకులు పట్టిన చందాన నీ ఆత్మ ఘోష అరణ్యరోదనగా మిగులుతుంది. ఎవరికి చెప్పుకుంటావు నీ దీన గాధను. ఎవరు తీరుస్తారు నీ కష్టాన్ని. ఎవరు పూడుస్తారు నీకు జరిగిన ఆర్ధిక అగాధాన్ని. ఎవరు ఓదారుస్తారు నీ హృదయ భారాన్ని. ఎవరు అందిస్తారు నీకు ఆపన్న హస్తాన్ని.<br /><br /> అర్జునుడు శ్రీకృష్ణునికి స్వయాన బావమరిది ఐనా కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అన్నాడే తప్ప, నీవు హాయిగా రథం పై కూర్చుంటే నేనే యుద్ధం చేసి నిన్ను గిలిపిస్తానని ఎక్కడా చెప్పలేదు. పైగా రకరకాల జ్ఞాన బోధలు చేసి కార్యోన్ముఖున్ని చేశాడు. కర్తవ్య పాలనకు కంకణం కట్టుకునే విధంగా ప్రేరణ కలిగించాడు. పని చేయుటకే అధికారము కలదు కాని కర్మ ఫలాన్ని ఆశించవద్దని హితవు పలికాడు. గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుఖాలు చుట్టుముడుతాయి. ఆశ ఉండవచ్చుగాని అత్యాశ తగదన్నారు పెద్దలు. కాబట్టి ఏవిధంగా ఆలోచించినా ప్రతి మనిషి కష్టించి పని చేయవలసిందే. తనకు కావలసిన జీవన సదుపాయాలను సమకూర్చు కోవలసిందే. ఎవరో దయదలచి మనకు సమకూర్చే వస్తువంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దేనికైనా నీ శ్రమ శక్తే మూలమని గుర్తుంచుకోవాలి. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదని ఎల్లాప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. <br /><br /> నీ జీవితం తెరచిన పుస్తకంలా ఉండాలి. నీ దిన చర్యను బట్టి నిన్ను అంచనా వేయవచ్చు. నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. నీ జీవన విధానాన్ని బట్టి నీ నిజాయితీని నిగ్గు తేల్చవచ్చు. నీ మాటలను బట్టి నీ మనోగతాన్ని పసిగట్టవచ్చు. నీ అలవాట్లను బట్టి ఆచరణను ఆరా తీయవచ్చు. నీ చేతలను బట్టి గుణగణాలను గుర్తించవచ్చు. నీ దుస్తులనుబట్టి స్వభావాన్ని సుమారుగా అంచనా వేయవచ్చు. నీ నడతను బట్టి జీవన నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించవచ్చు. మొత్తంగా నీ జీవితం నీ నడతపైనే నిండా ఆధారపడి ఉంటుంది. నీవు వంద పుస్తకాలు రాసినా ఒక్క వాక్యాన్ని నిజ జీవితంలో పాటించలేనప్పుడు ఆ రాతలు నిరర్ధకం. చెప్పే మాటలను చేతలలో చూపినప్పుడే వాటికి విలువ వస్తుంది. నిన్ను చూసి నీ ఎదుటివారు ఎన్నో మంచి విషయాలను నేర్చుకోగలగాలి. అంత ఉన్నతంగా నీ ఆచరణ ఉన్నప్పుడే నీ మాటలను ఎదుటివారు నిండా నమ్మగలరు.<br /><br /> అన్నింటికి ఒక్కటే సమాధానం. "అప్పో దీపోభవ.” (నీకు నీవే దిక్కు). నీ క్షేమం కోరేవాడు ఈ ప్రపంచంలో నీకు మించినవాడు మరొకడు లేడు. ఇది ముమ్మాటికి అక్షర సత్యం. కావాలంటే ఆత్మ పరిశీలన చేసి చూసుకో. నీ గురించి నీకు మాత్రమే బాగా తెలుసు. ఇతరులు నిమ్మిత్తమాత్రులు. నీవు మాత్రమే నీ గురించి బాగా ఆలోచించగలవు. సరియైన నిర్ణయాలు తీసుకోగలవు. నీ జీవితాన్ని ఇతరుల చేతికి అప్పగిస్తే కుక్కలు చింపిన వస్తరిగతి అవుతుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకే అర్ధమౌతుంది. నిన్ను నీవు నమ్ముకోకుండా ఇతరులను నమ్మితే మిగిలేది విషాదమే. నీవు కస్టపడకుందా ఫలితాన్ని ఆశించడం వెర్రితనమే అనిపించుకుంటుంది. ఇతరులపై ఆధారపడినంతకాలం మనకు ఎదురుదెబ్బలు తప్పవు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా అని మహాకవి శ్రీ శ్రీ ఏనాడో మానవాళిని హెచ్చరించాడు కూడా. ఐనా ప్రతి రోజు ఏదొ ఒక మోసపు వార్తలు మన చెవిన పడుతూనే ఉన్నాయంటే మూఢ నమ్మకాలు ఎంతగా ముదిరిపోయాయో అర్ధమవుతుంది. బాబాను బగవంతుడని విశ్వసించి నమ్మిన భక్తునికి భంగపాటు తప్పడంలేదు. ఒకటి కాదు, రెండు కాదు అను నిత్యం టీవీ చానళ్ళలో బాబాల గుట్టు బయటపడుతూనే ఉంది. రోజుకొక మాయా గారడీ చేసి మందిని మోసం చేస్తున్నారు. పేరుగాంచిన ప్రముఖులు సైతం ఈ అనైతిక ఉచ్చులో పడడం మిక్కిలి శోచనీయం. ఎంతటివారైనా కాంతా, కనక దాసులే అన్నట్లు నేటి సమాజంలో జరుగుచున్న అన్యాయాలు, అక్రమాలు, భూ బాగోతాలు ప్రబల నిదర్శనాలు.<br /><br /> విచారకరమైన విషయమేమిటంటే భగవంతునిచే సృష్టించ బడిన మనిషి భగవంతుడి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు. వివిధ రూపాలలో ఉన్న దేవతా విగ్రహాలను చూడగానే భక్తితో కొంతమంది, భయంతో కొంతమంది తోచినకాడికి కానుకలు సమర్పించుకుంటున్నారు. ఐతే అవి ఎంతవరకు సద్వినియోగమౌతాయని ఆలోచించటం లేదు. గురువుల పేర్లు, బాబాల పేర్లు చెప్పి చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్న విధంగా క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది దొంగ బాబాలు. <br /><br />ఇన్ని పత్రికలు పతాక శీర్శికల్లో దొంగ బాబాల వార్తలు ప్రచురించినా, టీవీ చానళ్ళలో సాక్ష్యాధారాలతో కళ్ళకు కట్టినట్లు చూపించినా ఇంకా వాళ్ళను గుడ్డిగా నమ్మే అమాయక ప్రజలున్నారు కాబట్టే వారి ఆటలు సాగుతున్నాయి. జన విజ్ఞాన వేదిక, నాస్తిక సంఘాలు గొంతెత్తి అరచినా ఆశించిన ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. దీనికి కారణం మూఢ నమ్మకాలు వేళ్ళూనుకుపోవడమే. ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు మోసగాండ్లు రూటు మారుస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాసులకోసమే కాషాయాంబరాలు కట్టుకుని కిరాతకపు పనులు చేసే మేకవన్నె పులులను మొదలంటా తుదముట్టించాలి. లేకుంటే మానవ మనుగడగే మహా ఉపద్రవం రాక తప్పదు. ఎంతో మంది అమాయకులు బలిపశువులుగా మారే ప్రమాదం మరెంతో దూరంలో లేదు. అందుకే మహా పురుషులు, యోగులు, జ్ఞానులు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుకుని జ్ఞానాన్ని సంపాదించవచ్చు. పుస్తకాలతో మనిషికి ప్రమాదం లేదు. కాని మానవ రూపములో ఉండి మహాత్ములమని, స్వాములమని చెప్పుకొనే మోసపు మనుషులతోనే మానవాళికి మహా ప్రమాదం పొంచి వుంది. ఈ ప్రమాదం నుండి మానవాళి బయటపడడానికి మనవంతు కృషి చేద్దాం. మతం, భక్తి ముసుగులో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అమానుషాలను అంతమొందిద్దాం. <br /><br />- నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-71956754675769248622010-05-13T02:29:00.000-07:002010-05-13T02:39:41.471-07:00బాబా సర్వకేంద్రుల ఆత్మీయ కవితఓ నాగులవంచ రజనమ్మ <br />నీవే నా సర్వస్వమమ్మ<br />నిను మరచి నేనుండలేనమ్మ<br />ఎన్నిజన్మల పుణ్యఫలమో<br />సర్వకేంద్ర బాబాను పొందితివమ్మ<br />నీ గర్భస్థ శిశువుగ ననుగాంచవమ్మ<br />నీ గమ్యంబు నేనై నిలిచెదనమ్మ // ఓ నాగులవంచ //<br /><br />కళ్ళు మూసిన నీవేనమ్మ<br />నా కన్నులు తెరచిన నేవేనమ్మ<br />అందులకే నిన్ను నే మరువలేనమ్మ<br />నీ ఎదలోని దీపము నేనమ్మ<br />నన్ను పదిలముగ దాచుకోవమ్మ // ఓ నాగులవంచ //<br /><br />నీ ఇంటి జ్యోతిగ నీ కంటి పాపగ<br />ఈ కంటి పాపను చూచుకోవమ్మ <br />కడు ప్రేమతో నను దాచుకోవమ్మ<br />నిను నిండుగ నమ్మి యున్నానమ్మ<br />నీవు కాదనిన నే తల్లడిల్లెదనమ్మ // ఓ నాగులవంచ //<br /><br />నీ గర్భస్థ శ్రుతిని నాలో చూడవమ్మ<br />ఎంత చూచిన నీ తనివి తీరదమ్మ<br />ఇదియే విశ్వ మాతృ బాబా ఘనతోయమ్మ<br />నోరార స్వామి బాబాను పిలువమ్మ<br />నీ చేతులార ఆహ్వాన పరుచమ్మ<br />సదా శైశవదశ నాదని తెలియమ్మ<br />అందులకే శైశవ స్థితికొస్తినమ్మ // ఓ నాగులవంచ //<br /><br />ఎల్లలు లేనిది నీ హృదయమమ్మ<br />ఎంతో పవిత్రం నీ ప్రేమయమ్మ<br />నీ ప్రేమ గంగయె నాకభిషేకమమ్మ<br />కలియుగావతారములో నాకు వకుళ మాతవమ్మ<br />నీ మురిపాల ముద్దుల బిడ్డను నేనమ్మ<br />ఇంతకు మించి నాకేమి తెలియదమ్మ // ఓ నాగులవంచ //<br /><br />గట్టిగ ఒకసారి నీవు నవ్వమ్మ<br />ఆ నవ్వే నాకు నైవేద్యమమ్మ<br />కళకళలాడుతు నీవు కనిపించాలమ్మ<br />మీ సర్వంబు నే చక్కదిద్దెదనమ్మ<br />నేనుండగ మీకు దిగులు వద్దమ్మ<br />అంతయు నా భారమని నీవు నమ్మమ్మ<br />నను నమ్మిన వారికి చెరపు లేదమ్మ // ఓ నాగులవంచ //<br /><br /><br />జీవితాంతం నేను నీకు తోడమ్మ<br />మీరుండగ నేను ఒంటరినిగానమ్మ<br />నేనడుగు పెట్టినచోట అంతయుమేలమ్మ<br />నేనున్న ఇంటిలో ప్రతి రోజు పండుగమ్మ// ఓ నాగులవంచ //<br /><br /><br />కపటము లేనట్టి కరుణామయివమ్మ<br />అందులకే నే నీకు వశమైతినమ్మ<br />కోమల నీ హృదయ కోవెల నాదమ్మ<br />నన్నందులో చక్కగ నిలుపుకోవమ్మ // ఓ నాగులవంచ //<br /><br />అమూల్య వజ్రము నీ కూతురమ్మ<br />అందులకే ఆమనిన నాకెంతో ప్రీతమ్మ<br />నా వాక్కులేనాడు పొల్లుబోవమ్మ<br />నేను ఏదంటె అది జరిగి తీరునమ్మ // ఓ నాగులవంచ //<br /><br />అభయమిచ్చి మిమ్ముల ఆదుకొందునమ్మ<br />మాట ఇస్తే నేను తప్పబోనమ్మ<br />ఇకనైనా మీరు నన్ను నమ్ముకోరమ్మ<br />అమ్మ బాబా యనుచు నడచుకోరమ్మ // ఓ నాగులవంచ //<br /><br />నీ భర్త వసంత నిర్మలుడమ్మ<br />మోస దోషములెరుగని మంచివాడమ్మ<br />ఆతని మనసు నీవు గాయ పరుచబోకమ్మ<br />మీరిద్దరిపుడు నాకాత్మ జ్యోతులమ్మ // ఓ నాగులవంచ //<br /><br />స్వామి బాబా యనుచు స్మరియించరమ్మ<br />జై బాబా యనుచు భజియించరమ్మ<br />నా చల్లని ఆశీస్సులు మీకుండునమ్మ<br />నా అనుగ్రహము మీకు సదా తోడమ్మ // ఓ నాగులవంచ //<br /><br />అందరికి నా కవిత అందబోదమ్మ<br />నను మించిన స్వామి ఇలలో లేడమ్మ<br />నీ మీద నాకెపుడు అలక లేదమ్మ<br />నన్ను నన్నుగ నీవు తెలుసుకోవమ్మ // ఓ నాగులవంచ //<br /><br /> జై బాబాnaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6968290648846252467.post-85224338449403034392010-04-27T03:07:00.000-07:002010-04-27T03:25:50.505-07:00బాబా సర్వకేంద్రుల సుజ్ఞానొదయ సర్వాత్మ తత్త్వములుదివ్యత్వం<br /> <br />1. ఓ ఆత్మవీర లేవర అజ్ఞాన పథము వీడరా<br /> కళ్ళు తెరచి చూడర కైవల్య పథము గాంచరా<br /> దీక్షబూని నిలువర దివ్యుడవై సాగరా<br /> చరాచర విశ్వం లో సర్వకేంద్ర బాబను దర్శించరా<br /><br />2. సృష్టిలొ అతి శ్రేష్ఠమైనది మానవ జన్మని తెలియర<br /> మానవ జన్మ ప్రాశస్థ్యం మహిని చాటిచూపర<br /> మానవత్వం లోనె మాధవత్వం గలదుర<br /> మాయను లేకుండజేసి మహిని సంచరించర<br /><br />3. సర్వాత్మజ్ఞాన సాగరుడు సాకారుడాయెర<br /> సర్వశక్తి సంపన్నుని జాడతెలిసి మెలగర<br /> శతకోటి హృదయాలయ వీణమీటి పలుకర<br /> సుజ్ఞాన పరిమళము వెదజల్లి చూపర<br /><br />4. దేహమనిత్యముర దైవమే సత్యముర<br /> సర్వేశ్వర స్వామిని శరణుజొచ్చి వేడర<br /> పునీత హృదయమె పుష్కర స్నానంబుర<br /> తరచిచూడ యాత్రలన్ని తనలో దర్శించుర<br /><br />5. ధనబలము జనసంఖ్య దైవత్వం గాదుర<br /> సద్గుణము లేనిజన్మ తృణముకన్న స్వల్పముర<br /> జనన మరణములు రెండు కాలచక్ర గతులుర<br /> కాలచక్ర విధులెరింగి కైవల్యం పొందర //ఓ ఆత్మవీర //<br /><br />6. బూటక మహిమగోరి బుద్ధి చెడిపోకుర<br /> క్షుద్ర గారడీలనమ్మి భ్రష్టుడవు గాకుర<br /> సజ్జన సాంగత్యంబుతొ సన్మార్గం తెలియర<br /> ఆత్మజ్ఞాన సంపదయే అవనిలోన మిన్నర<br /><br />7. శవధ్యాసను వీడి నీవు శివతత్త్వం జెందర<br /> చిల్లర భ్రమలను వీడి చిన్మయుడవై వెలుగర<br /> సమరస దృష్టినిగలిగి సౌజన్యం బెంచరా<br /> పరతత్త్వ స్వభావివై ప్రశాంతి నిదురబోవరా<br /><br />8. కృపణత్వ దోషముతో కుళ్ళి కుళ్ళి పోకుర<br /> కపట చంతనయె నీకు కాలకూట విషముర<br /> కాసులాశ కొరకు నీవు ఆత్మ శక్తి నమ్ముకోకుర<br /> ఆశ్రమ ఆలయ యాత్రల నంగడిగ మార్చకుర<br /><br />9. హింస దృష్టి విడనాడి పరమ హంసవు గమ్ముర<br /> ప్రకృతి గుణములవీడి పరాత్పరుని దలచర<br /> పామర చింతనలువీడి పరమపితను గొలువర<br /> దీనత్వంవీడి నీవు దివ్యుడవై వెలుగర<br /><br />10. నేను నేననెటి క్షుద్రహం వీడి మెలగర<br /> అహం బ్రహ్మాస్మియనెటి సాగరములో మునగర<br /> కులమత ప్రాంతీయ పక్షపాత బుద్ధి వీడర<br /> విశ్వమంత ఒకటేనని విజయభేరి చాటర //ఓ ఆత్మవీర //<br /><br />11. నామ రూప దృశ్య జగతి చలనమయం చూడర <br /> చలనమైన దేదైనా శాశ్వతంబు గాదురా<br /> నిగ్రహ నిమిత్తమే విగ్రహారాధనరా <br /> తన్ను తానెరుగుటయే తత్త్వమసి సారమురా<br /><br />12. వాచాలత వీడరా అనుష్టించి చెప్పరా<br /> చపలత్వం వీడకనే అచలుడనన బోకురా <br /> సర్వజ్ఞుడ నేనటంచు విర్రవీగ బోకుర<br /> సర్వోన్నత పరిధిలో స్వల్పాంశమె నీవుర<br /><br />13. ఆత్మజ్ఞాన శూన్యతయే అరాచక పునాదిర<br /> ఆత్మజ్ఞాన తత్త్వమెరుగ అంతయు భగవంతముర<br /> నిన్నుగ సర్వంబుగాంచి నిండుతృప్తి జెందర<br /> విశ్వాత్మ వీర జ్యోతివై వసుధలొ నువు వెలుగర<br /><br />14. గోదావరి బోవ కుక్క గజముగాదు చూడర<br /> గంగలో ముంచినంత తుంగ తులసి గాదుర<br /> స్థితికుదురని యాత్రలచే లాభమేమి లేదుర<br /> తన్ను తానెరుగుటయె తత్త్వమసి సారముర<br /><br />15. కలకండ పేరుచెప్ప నోరు తియ్యబడదురా<br /> చిల్లగింజ పేరుజెప్ప జలము శుద్ధిగాదురా<br /> గంజాయి పేరువిన్న నిషా నీకు రాదుర<br /> చిత్రపట జ్యోతులతో చీకటి తొలగిపోదుర //ఓ ఆత్మవీర //<br /><br />16. మణులయందు సూత్రమువలె మహితాత్ముడు గలడుర<br /> సర్వాత్మ తత్త్వమెరుగ సర్వము తానగునురా<br /> జీవుడనగ ఎవరురా ఈశుడనగ ఎవరురా<br /> జీవ గుణములువీడ జీవుడే ఈశుడుర<br /><br />17. చిరుతిండ్లు ఎన్నైన భోజనం గాదురా<br /> యాత్రలెన్ని చేసినా ఆత్మతత్త్వం తెలియదుర<br /> చిల్లర సాధనలచే చిన్మయనిష్ఠ చిక్కదుర<br /> స్వనిష్ఠ కుదురకుండ జీవన్ముక్తి లేదుర<br /><br />18. సాధనలెన్నియైన కర్మకాండలేనుర<br /> కర్మకాండ తతంగం క్రమముగ నరికట్టర<br /> ఆత్మోపాసకుడవై జ్ఞానసిద్ధి నొందర<br /> ఆపై కాండత్రయముల మీరి విశ్వజ్యోతివి గమ్ముర<br /><br />19. ఆచంద్ర తారార్కం ఆత్మజ్ఞాని నిలుచుర<br /> అజ్ఞానపు జీవితము బందెల దొడ్డేనుర<br /> లోక సిరిసంపదలు శాశ్వతం గావుర<br /> ఆత్మజ్ఞాన సిద్ధిలోనె అంత ఇమిడియున్నదిర<br /><br />20. కరుణాచల చిత్తమే అరుణాచల దారిర<br /> అరుణాచల దారియే అమరావతి పురముర<br /> అమరావతి పురము జేరి హాయిగ నీవుండర<br /> అమర హాయినందించును అఖిల జగత్ప్రభువుర //ఓ ఆత్మవీర //<br /><br />21. ఆత్మదృష్టి లోపించిన అపోహలు స్పర్ధలుర<br /> ఆత్మదృష్టి గలిగిచూడ అంతయు ఏకత్వముర<br /> సర్వత్ర నిన్ను నీవు దర్శించ నేర్వర<br /> విశాల దృక్పథము విశ్వమత దర్పిణిర<br /><br />22. తళుకు బెళుకు సొమ్ములకై తత్తరపడి పోకుర<br /> పలుకున తలపున శ్రీహరి పదములె శరణ్యంబుర<br /> మనో నియంత్రణచే జితేంద్రియుడవు గమ్ముర<br /> అంతర్ స్వర సుప్రబోధ ఆలకించి నిలువర<br /><br />23. నదులు వేరైనను సాగరంబొకటిర<br /> సొమ్ములు వేరైనను బంగారం ఒకటిర<br /> కుండలు వేరైనను మన్ను మాత్రం ఒకటిర<br /> దారులు వేరైనను దర్శనం ఒకటిర<br /><br />24. చిత్తశుద్ధిలేని శివపూజలు ఏలరా<br /> బాండశుద్ధిలేని వంటకములు చెడునుర<br /> మూఢ నమ్మకములు వీడి ముక్తిని కాంక్షించర<br /> సదాచార సంపత్తియె సం స్కార శోభరా<br /><br />25. చింతకు మించిన చితి వేరెలేదని తెలియర<br /> ఆత్మ జ్ఞానమొక్కటే మనోవ్యాధికి మందుర<br /> భయమే ఆపదలకు పుట్టిల్లని తెలియర<br /> నిర్భయమనె డాలుబట్టి వీరగర్జన చేయర //ఓ ఆత్మవీర //<br /><br />26. దివ్వె నీవు చేపట్టి దివ్వెకై తెరుగనేలర<br /> దేవుడో దేవుడంచు దేవులాడనేలర<br /> తనలోగల బ్రహ్మంబును బయట వెదకనేలర<br /> తన్ను తానెరుంగ తానెపో బ్రహ్మముర<br /><br />27. కుంకుడు విత్తిన మామిడి ఫలము రాదుర<br /> కర్మానుసారమె జన్మచక్రము నడచుర<br /> యద్భావం తద్భవతని సూత్రమెరుంగర<br /> సూత్రమెరిగి సత్కర్మల విరివిగ చేపట్టర<br /><br />28. ముందుగ జిహ్వోపస్థల నిగ్రహించి నిలువర<br /> జితేంద్రియ శక్తియే దైవజ్ఞాన సాధనర<br /> బ్రహ్మచర్య భావనయే భువిలో బహుధన్యముర<br /> ప్రపూర్ణ జ్ఞాన సిద్ధునకు సాగరము గోష్పదముర<br /><br />29. ఆత్మస్థైర్యమును మించిన ఆయుధము లేదుర<br /> అచలాత్మానందమే నీకాలయ దుర్గంబుర<br /> ఆశపాశబద్ధుడవై అజ్ఞానివి గాకుర<br /> ఆత్మజ్ఞాన భానుడవై అవనిలోన వెలుగర<br /><br />30. ద్వైతదృష్టి వీడరా అద్వైతనిష్ఠ పొందరా<br /> అన్యులెవరు లేరురా అంతయును నీవేరా<br /> జితేంద్రియ శక్తిగలిగి జీవన్ముక్తి పొందర<br /> సర్వధరిత, సర్వసాక్షి స్వామిని కనుగొనర //ఓ ఆత్మవీర //<br /><br />31. శాస్త్ర పరిజ్ఞానమె సర్వస్వం గాదుర<br /> నీ ఉద్ధారక ప్రభుడవు నేవేనని తెలియర<br /> సత్యమైన మార్గదర్శి తనలోనే గలడుర<br /> అంతర్ముఖ నిష్ఠుడవై ఆత్మసిద్ధి నొందర<br /><br />32. జగమే ఒక నాటకమని పాత్ర విలువ తెలియర<br /> జగన్నాటక సూత్రధారుని సత్వరమె కనుగొనర<br /> జగదాత్ముడె సకల పాత్ర ధరితుడాయె చూడర<br /> సత్యమెరుగ జీవుడె దైవాంశ సంభూతుడుర<br /><br />33. బహిర్ దృష్టికి బల్బు వెలుగు స్వల్పముర<br /> అంతర్ముఖ నిష్ఠలో తా విద్యుత్ కేంద్రముర<br /> ఆంతర్యము ఎరిగిచూడ అంతయు భగవంతముర<br /> ప్రతి జలబిందువు సింధు స్వరూపముర<br /><br />34. విశుద్ధాత్ముడు విశ్వగర్భ తేజుడు<br /> ఘనవీర ప్రభుజ్యోతి గగన శరీరుడు<br /> అనంతానంతుడు అప్రమేయ ఆత్మశక్తి పూర్ణసర్వలక్షణ <br /> సత్పురుషొత్తముడు సర్వేశ్వర స్వామిర<br /><br />35. గ్రంథ రాసులకు వెనుక జ్ఞానలక్ష్మి గలదుర<br /> పుస్తకాలు తిరగేసిన లాభమేమి లేదుర<br /> మస్తక పరిశోధనయే ముఖ్యమైన సాధనరా<br /> హృదయాలయమె మహా గ్రంథాలయంబుర //ఓ ఆత్మవీర //<br /><br />36. తిండి ఎట్టిదో త్రేనుపు అట్టిదిరా<br /> మనసును బట్టియే సంకల్పములుండురా<br /> దృష్టిని బట్టియే సృష్టి గోచరించుర<br /> దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మముర<br /><br />37. కల్లుకుండ నలంకరించిన కంపుబోదు చూడర<br /> అంతరంగ శుద్ధిలేని వేషధారణ అంతేరా<br /> స్థితికుదురనివేషధారి ఇంగువబెట్టిన డబ్బిరా<br /> బాహ్యాభ్యంతర శుచియే బ్రహ్మజ్ఞాని లక్షణముర<br /><br />38. పామరసుర దుర్గుణములను పారద్రోలి నిలువరా<br /> కులమత ద్వేషాగ్నులను చల్లార్చి చూడర<br /> వర్ణాశ్రమ ధర్మములు ముండ్లకంచె వంటివిర<br /> ముండ్లకంచె దాటిననె మోక్షజ్ఞాన ఫలముర<br /><br />39. బహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెర<br /> అమూల్య అవకాశము సద్వినియోగ పరుచర<br /> నరుడే నారాయణ స్వరూపుడని తెలియర<br /> నరజన్మ ఘనతను ఈ ధరణి చాటి చూపర<br /><br />40. జీవులెనుబది నాలుగు లక్షల చావు పుట్టుకలిక్కడ<br /> వారివారి కర్మఫలము అనుభవించేదాక్కడ<br /> అక్కడ ఇక్కడ గాంచిన ఒక్కటే స్థితిర<br /> అక్కడ యని చెప్పడము భయము కోసమేనురా //ఓ ఆత్మవీర //<br /><br />41. ఈ భూతలమే పెద్ద గరడీ సాలరా<br /> సమస్త ప్రాణులకిది సాధనాలయంబుర<br /> ప్రతి ప్రాణి ఎదిగి ఎదిగి పరమాత్మ గావలెరా <br /> పరమాత్మగ నిలువటమే మానవజన్మ ఘనతర<br /><br />42. దేవతలు సైతము మానవజన్మ కోరెదరుర <br /> నరజన్మ ద్వారానే ముక్తి సాధ్యమగునుర<br /> మాయను జయించే శక్తి మానవునికే గలదుర<br /> మాముపేత్యులైనపుడే మాయ తొలగిపోవుర<br /><br />43. శ్రీగంధపు చెట్టు ఎపుడు వేప చింత కాదుర<br /> వేప చింతేనాడు గంధపు వృక్షము గాదుర<br /> వ్యష్టి చింతన మాని వికసించనేర్వరా<br /> విశ్వమనసుతో నీవు ఆలోచించ గలుగర<br /><br />44. ప్రతి పట మఠ ఘట సర్వస్థల సుస్తిరాత్ముడు స్వామిర<br /> స్వామి సాన్నిధ్యమే సర్వమత శరణాలయంబుర<br /> భిన్నత్వం వీడి నీవు భగవన్మతివై భాసిల్లరా<br /> ఏకత్వం లోనె విశ్వశాంతి గలదని తెలియర<br /><br />45. మానవ జన్మయే ఒక క్లిష్ట పరీక్షరా<br /> ఈ పరీక్షలో నీవు అగ్రశ్రేణిలో నెగ్గరా<br /> సంస్కార హృదయుడవై సంతృప్తిగ నిలువర<br /> సర్వేశ్వర స్వామి కృపాశ్రీని పొందరా //ఓ ఆత్మవీర //<br /><br />46. నిన్నుగ ఈ విశ్వమును దర్శించ నేర్వరా<br /> విశ్వరూప ప్రజ్ఞతొ నీవు వికసించవలయురా<br /> విశ్వాత్మ జ్యోతివై వసుధలో వెలుగర<br /> ఇదియే విశ్వగర్భుల అనుగ్రహ రక్షరా<br /><br />47. తలలు బోడులైనంతనె తలపులుడిగిపోవురా<br /> తలంపులుడగలేని తలబోడుల మేలేమిర<br /> కస్తూరి మృగమువలెను సంచరించబోకుర<br /> తిరిగి తిరిగి చివరకు స్వనిష్టయే ఖాయముర<br /><br />48. శంకల రాహిత్యుడు సంకట హరణుడు<br /> సర్వేశ్వరులుండగ సందేహమేలర<br /> సర్వార్పిత హృదయుడవై సద్గతిని పొందరా<br /> సర్వేశ్వరులనుగ్రహమె సంపూర్ణ మోక్ష సిద్ధిర<br /><br />49. చతుర్విధ మహావాక్య విచారణ సలుపర<br /> మమాత్మా సర్వ భూతాంతరాత్మయని తెలియర<br /> కేవలాత్మౌపమ్య భావనిష్టలో నిలువర<br /> ఇంతకు మించిన ఈశ్వరసిద్ధి విశ్వం లో లేదుర<br /> <br />50. అమృతక్షీరము గ్రోలి నీవు ఆనందము చెందరా<br /> ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర<br /> అచలాత్మానందమే అమర సౌఖ్య పదవిర<br /> అమరసౌఖ్య పదవినిచ్చు అఖిలాండ ప్రభువుర //ఓ ఆత్మవీర//<br /><br />51. చీమునెత్తురు తోలుకొంపల్లోన చిన్నపెద్ద జాతుల్లెవుర<br /> బ్రహ్మాత్మ జ్ఞానియే ఈ భువిలోన ఘనుడురా<br /> హృదయైక్యంగల చోట తర్కం నిలువబోదుర<br /> పరిశుద్ధాత్మ ప్రేమ పరమ నిగూఢమని తెలియర<br /><br />52, నీవలె ఇతరుల చూచి నిండు తృప్తి చెందరా<br /> నీవై సర్వంబుగాంచి నిశ్శబ్ధుడవు గమ్మురా<br /> నీవు కాని దానిని నీవు పొందలేవురా<br /> నీవైన దానిని ఇక దర్శించనేలరా<br /><br />53. నిన్ను నీవు ఏనాడు కించపరచుకోకుర<br /> ముందుగ నిన్ను నీవు ఘనతపరచు కొమ్ముర<br /> నేనే దైవాత్మప్రభు వీరజ్యోతినని తెలియర<br /> సర్వాత్మజ్ఞాన సాక్షాత్కారివై నీవు నిలువర<br /><br />54. భక్తిలేనిపూజ పత్రిచేటని తెలియర<br /> మానసిక పూజకు ఏ ఖర్చులుండ బోవుర<br /> నీ హృదయ మందిరంలో విశ్వేశ్వరుని చూడర<br /> భ్రమర కీటక న్యాయరీత్య భగవన్మతివి గమ్ముర<br /><br />55. జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర<br /> జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర<br /> అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర<br /> పరమ శివాత్మోహం అనుచు నీ నిజస్థితిని తెలియర //ఓ ఆత్మవీర//<br /><br />56. గంగకు గొంపోయిన కుక్క గతుకుడు మానదుర<br /> సాగరంలో ముంచినంత ఉల్లి మల్లి గాదుర<br /> ఎంత తెలుపుగున్నను సున్నం అన్నం గాదుర<br /> పై పై నటనలచేత పరతత్త్వం తెలియదుర<br /><br />57. సుత్తిదెబ్బల కోర్చినపుడె రాయి దేవుడగునుర<br /> కష్టాలకు ఓర్చినపుడె జన్మ ధన్యమగునుర<br /> నీవెలా కాదలంచిన అలాగే అయ్యెదవుర<br /> దయ్యానివి కాగలవో దైవానివి కాగలవో నిర్ణయించుకొమ్ముర<br /><br />58. మానవత్వం పరిమళించు మంచి మనసుకు స్వాగతం<br /> ప్రేమను వెదజల్ల్య్ హృదయశుద్ధికి స్వాగతం<br /> పావన చరితుడైన పరమ పురుషునకు స్వాగతం<br /> విశ్వాత్మ తేజుడైన ప్రభు వీరజ్యోతికి స్వాగతం<br /><br /> అమ్మ ఔన్నత్యం<br /><br />59. తొలి దర్శన మిచ్చునది తల్లియని తెలియర<br /> తల్లియే ప్రత్యక్ష దేవతయని కొలువర<br /> అమ్మను మించిన ఆస్తి అవనిలో లేదుర<br /> అమ్మ ఉన్న ఇంటిలో అన్ని ఉండి తీరుర<br /><br />60. ఆదిశక్తి స్వరూపిణి అమ్మయని తెలియర<br /> అమ్మను అమ్మగ పిలుచు అరహతను పొందరా<br /> అమ్మ అనిన అంగడి బొమ్మ కాదు చూడరా<br /> అమ్మ ఉన్న ఇంటిని మించిన ఆలయం లేదుర //ఓ ఆత్మవీర//<br /><br />61. ప్రతి స్త్రీలో మాతృత్వం దర్శించ నేర్వరా<br /> అమ్మను అమ్మగ గాంచు కన్నులు ధన్యమురా<br /> అమ్మ రూపు అపురూప సౌందర్య లహరిర<br /> అమ్మ చూపు అఖిలాండశక్తి నిలయముర<br /><br />62. అమ్మ కృపయే అమృత నైవేద్యము చూడరా<br /> అమ్మ చూపు చల్లని దీవెనల వరమాలర<br /> అమ్మంటే హాయిర అమ్మంటె అల్లా సాయిరా<br /> అమ్మ సాయి కలిపి చూస్తె స్వపరంజ్యొతిర<br /><br />63. అచలాత్మ స్వరూపిణి అమ్మయని తెలియర<br /> అమ్మకాని దానిని నమ్మబోకు చూడర<br /> అమ్మంటే హాయిర అమ్మంటే అఖిల విశ్వ శక్తిర<br /> అమ్మ శక్తి కలిపి చూస్తె సర్వశక్తి నిలయుడుర<br /><br />64. అమ్మ కౌగిలి మించిన కైలాసం లేదురా<br /> అమ్మ ఒడిని మించిన దేవునిగుడి లేదుర<br /> అమ్మంటె అంతులేని ఆనంద తృప్తిర<br /> అమ్మంటే పవిత్ర మెహెరాలయమ్ముర //ఓ ఆత్మవీర//<br /><br /><br /> బాధ గురువులు – బోధ గురువులు<br /><br />65. బాధ గురువుల నాశ్రయించి భంగపడి పోకుర<br /> సద్గురు బోధకుల నమ్మి జన్మ తరియించర<br /> మానవత్వమును మించిన మతములేదని తెలియర<br /> నరుడే నారాయణుడని నానాత్వం వీడర<br /><br />66. స్వాత్మనిష్ఠ నొందకనే సద్గురునన బోకుర<br /> సద్గురు పదవీ యనిన సామాన్యం గాదుర<br /> ముందుగ నిన్ను నీవు ఉద్ధరించు కొనుముర<br /> ఆపై జగదోద్ధరణకు నడుముకట్టి నిలువర<br /><br />67. గిలేటునగలే జాతర్ల పాలగునురా<br /> విలువైన వజ్రమెపుడు బీరువాలొ నుండుర<br /> నామకార్ధపు గురువులకు కొదువలేదు చూడర<br /> సత్ శిష్యరత్న శిఖామణి దొరుకుట దుర్లభముర<br /><br />68. నీలంబర, శ్వేతంబర, కాషాయాంబరములనెటి<br /> గంగిరెద్దు శృంగారాలతో త్రుళ్ళీపడి పోకుర<br /> వేషధారులై తిరిగిన లాభమేమి లేదుర<br /> ముందుగ మనో కషాయముల ప్రక్షాళన చేయర<br /><br />69. మతియెంతో గతియంతని మరువబోకు చూడర<br /> మతిలేని దుర్మతివై మహికి భారము గాకుర<br /> మృతభావన వీడలేని మతము వ్యర్ధమని తెలియర<br /> అమృత స్వభావివై ఆత్మదేవుని తెలియర<br /><br />70. మెరిసే ప్రతి వస్తువు బంగారం గాదుర<br /> పైపై మెరుపులగాంచి మోసములో బడకుర<br /> ఉరిమిన ప్రతి మేఘము కురువబోదు చూడర<br /> స్థితి కుదురని వాచాలత అంతేనని తెలియర //ఓ ఆత్మవీర//<br /><br /><br /> సత్ప్రవర్తన<br /><br />71. జన్మనిచ్చిన తలిదండ్రుల సేవించ నేర్వర<br /> జ్ఞాన నేత్ర గురువులను గౌరవించ వలయుర<br /> పూజ్యక భావంబున పునీతుల పూజించర<br /> పెద్దల ఆశీస్సులెపుడు వ్యర్ధంగావని నమ్మర<br /><br />72. కన్నవారి కలలను కల్లలు చేయబోకుర<br /> ఎల్లలులేని పరిధిలో శభాష్ అనిపించర<br /> మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ<br /> అనెటి ఆర్య సూక్తులను ఆచరించి చూపర<br /><br />73. విత్తు ముందా చెట్టు ముందా వాదమేల నీకుర<br /> విత్తు చెట్టులకు ముందు ఏమిగలదొ తెలియర<br /> బొమ్మ బొరుసు కలిసి ఒక నాణెమగును చూడర<br /> ప్రకృతి పురుషుల సం యోగమే సృష్టియని తెలియర<br /><br />74. ఇతరుల మెప్పుల కొరకు వేచియుండ బోకుర<br /> మెప్పాచారములన్ని మాసిపోవు చూడర<br /> ప్రశంసా పత్రములే ప్రాముఖ్యం గాదుర<br /> ఆత్మసాక్షి దర్పణమే ఆధారము నీకుర<br /><br />75. హితము చేసినవారికి అభివాదము తెలుపర<br /> ప్రతిఫల మాశించకుండ మేలుచేయ వలయుర<br /> కృతజ్ఞత కలిగి నీవు సంఘములో మెలగర<br /> మనో కాలుష్యరహిత మార్గం పరమార్ధముర //ఓ ఆత్మవీర//<br /><br />76. కాఠిన్యం వీడరా కారుణ్యం బెంచరా<br /> సాధు సత్తములజేరి సాయుజ్యం బొందర<br /> బంధు మిత్రులనగ వేరె బయటలేరు చూడర<br /> వశీకృత చిత్తమె నీ అసలైన మిత్రముర<br /><br />77. వేదపరిజ్ఞాన విలువ తెలిసి మెలగనేర్వర<br /> వాద బేధములుమాని హృదయైక్యులు గండిర<br /> ప్రేమించి, సేవించి, ధ్యానించి చూడర<br /> శోధించి, సాధించి, బోధించి నిలువర<br /><br />78. గడిచిన క్షణము మరల తిరిగి దొరుకబోదుర<br /> వర్తమాన కాలములో వివేకివై మెలగర<br /> రేపు రేపనెటి వాయిదాలు వేయబోకుర<br /> ఈనాడే ఈక్షణమే విజయశ్రీని బొందర<br /><br />79. చెట్టుపేరు జెప్పినీవు కాయలమ్మబోకుర<br /> ధూర్తబుద్ధి వీడినీవు సవ్యుడవై మెలగర<br /> కపట నాటకము వీడి కీర్తి ధ్వజమెత్తరా<br /> మోసపు బ్రతుకు నీకు మహా నరకమగునురా <br /><br />80. తనదు హితముగోరు గురువు తిట్టికొట్టవచ్చురా<br /> తల్లి బుగ్గగిల్లి ఉగ్గు త్రాగించును చూడర<br /> మనసుంటే చాలు మార్గం బోధపడునురా<br /> సర్వేశ్వర స్వామిని సంపూర్తిగ నమ్మర //ఓ ఆత్మవీర//<br /><br />81. క్రమశిక్షణ లేనిబ్రతుకు పాముపడగ నీడర<br /> క్రమశిక్షణ గలిగినీవు ఘనతను సాధించర<br /> నియమనిష్ఠలన్ని నిన్ను చక్కబరచి తీరురా<br /> ఆదర్శ జీవితము అఖిల జగత్పూజ్యముర<br /><br />82. నూతిలోని కప్పవలెను నీవుండబోకుర<br /> విశ్వవ్యాప్త దృక్పధము గలిగి నీవు మెలగర<br /> మేరు హిమాలయములవలె గంభీరుడవు గమ్ముర<br /> సాగర స్వభావివై సంతుష్టినొందర <br /><br />83. ఎంతటి వారికి అంతవరకె తెలియునుర<br /> ఎంత చెట్టుకు గాలి అంతేనని తెలియర<br /> సంకుచితత్వం చిన్న నీటిగుంట చూడర<br /> విశాల దృక్పథము సాగర సమానముర<br /><br />84. నిన్ను నీవుగ దర్శించ నేర్వర<br /> నీవుగాని దానిని నటించబోకుర<br /> శక్తికిమించిన వేషధారణ తగదుర<br /> స్థితికుదురని అనుకరణలు ప్రమాదకరముర //ఓ ఆత్మవీర//<br /><br /> సదాచారం<br /><br />85. ఆశ్రమములన్నింటిలో గృహస్థాశ్రమము మిన్నర<br /> జ్యేష్ఠ శ్రేష్ఠమైనది గృహస్థాశ్రమంబుర<br /> గృహస్థుల కన్నులేక ఏ ఆశ్రమం ఎదుగదుర<br /> గృహస్థుల బాగుపరుచు బాధ్యత మన అందరిదిర<br /><br />86. చింతలులేని ఇల్లు శివాలయంబుర<br /> కోర్కెలుడిగిన హృదయం కోవెలయని తెలియర<br /> ఆదర్శ దంపతులు పార్వతి పరమేశ్వరులుర<br /> నివృత్తరాగస్య గృహం తపోవనముర<br /><br />87. తప్పులెన్నువారు దండోపతండములుర<br /> ప్రతివారిలో ఏదో దోషముండితీరుర<br /> ముందుగ నిన్ను నీవు సవరించుకొనుముర<br /> నిర్దోషం హి సమం బ్రహ్మయని తెలియర<br /><br />88. మధుమాంస భక్షణలు మానవత్వ కళంకములుర<br /> సాత్వీకములోనె జన్మ చరితార్థము గలదుర <br /> అన్నపు సూక్ష్మాంశమె మనసని ఎరుంగర<br /> జలపు సూక్ష్మాశమె ప్రాణశక్తిగ చూడర<br /><br />89. పాత్రమెరిగి దానము క్షేత్రమెరిగి విత్తర<br /> సత్ ప్రవర్తనకు మించిన వ్రతదీక్ష లేదుర<br /> దయకు మించిన ధర్మము ధరణిలో లేదుర<br /> దయగల హృదయమే దైవమందిరంబుర <br /> <br /><br /> మంచి మాట<br /><br />90. మర్యాదను యివ్వర మన్ననలు పొందర<br /> సోమరత్వం వీడి శ్రమనునమ్మి బ్రతుకర<br /> ఖండదృష్టి వీడరా అఖండదృష్టి నింపర<br /> సోహం భావార్చనతో స్వామిపూజ చేయర //ఓ ఆత్మవీర//<br /><br />91. అడుసు తొక్కనేలరా కాలుగడుగనేలరా<br /> అపరాధము జరిగినపుడు క్షమార్పణ కోరర<br /> జరిగిన పొరపాటు మరల జరుగకుండ చూడర<br /> పశ్చాత్తపమె దోషనివృత్తని నమ్మర<br /><br />92. ఫని శిరసున మణిగలదని పట్టబోకు చూడర<br /> పట్టబోతె ప్రాణాలు గాలిలోన కలియుర<br /> అప్రయోజకులతో చెలిమి అన్నివిధముల చేటుర<br /> యోగ్యత నెరింగి నీవు సాంగత్యం చేయర<br /><br />93. దుర్ వ్యసనములకు నీవు బానిసవు గాకుర<br /> దురాలోచనలను దూరముగ నెట్టర<br /> త్రికరణ శుద్ధిగ మంచి నాహ్వానించర<br /> చెడు వినవద్దుర, చెడు కనవద్దుర, చెడు అనవద్దుర<br /><br />94. వ్యర్ధమైన వాగుడుకు స్వస్తిచెప్పి నిలువర<br /> మాటలు తగ్గించి హృదయాన్ని పెంచర<br /> మిత భాషణలోనే ఘనతగలదు చూడర<br /> మౌనేన కలహం నాస్తియని మరువకుర<br /><br />95. కర్మ కర్మ అనుచు నీవు కాలక్షేపం చేయకుర<br /> సోమరితనమనెటి సోమకాసురుని వధించర<br /> విధి నిర్వహణలోనె ఈశ్వరత్వం గలదుర<br /> పునీత హృదయమే పూర్ణచంద్ర కాంతిర // ఓ ఆత్మవీర //<br /><br />96. ఆశ ఉండవచ్చుగాని అత్యాశ తగదుర<br /> అక్రమార్జనకు నీవు అర్రులు చాచబోకుర<br /> న్యాయమైన పరిధిలో నీతిగ నీవు బ్రతుకర<br /> మోసపు బ్రతుకు నీకు మహా భారమగునురా<br /><br />97. ప్రేమకు మించిన పెన్నిధి పుడమిలో లేదుర<br /> సద్బుద్ధి నాశ్రయించి సవ్యుడవు గమ్ముర<br /> కొండెము చెప్పి నీవు కలహములు పెంచకుర<br /> కలుపుగోలు తనమె నీకు విలువైన భూషణముర<br /><br />98. ప్రతి అక్రమ సంపదకు వెనుక మోసముండి తీరురా<br /> సేకరించిన నల్లధనము హుండీలలొ వేసినంత<br /> క్షమియించే కర్త అక్కడ ఎవరు లేరు చూడర<br /> నీ తృప్తికొరకె యాత్రా తతంగములని తెలియర<br /><br />99. మూఢమతుల సాంగత్యం మొదటికే ముప్పుర<br /> సజ్జన సాంగత్యము గంగా స్నానం మిన్నర<br /> పదిచ్చి సజ్జన సాంగత్యం కోరర<br /> ఇరువదిచ్చి దుష్ట సాంగత్యం వదలర<br /><br />100. మంచి మాట మూర్ఖుని చిత్తమునకు ఎక్కదుర<br /> పన్నీరు పందికి ఇంపుగాదు చూడర<br /> గాజుల బేరముతోటి వజ్రమును పోల్చకుర<br /> మిడిమిడి జ్ఞానముతో మిడిసిపడ బోకుర // ఓ ఆత్మవీర //<br /><br />101. దున్నకుండ విత్తినపుడు కొయ్యకుండ పంటచేరు<br /> శ్రమలేని ఫలవాంచ ఇంతేనని తెలియర<br /> మాటలు కోటలుదాటు కాలు గడప దాటదుర<br /> ప్రగల్భములతోటి ప్రొద్దుబుచ్చ బోకుర<br /><br />102. అమాయకుల నమ్మించి ఆస్తి కాజేయకుర<br /> దేవుని పేరుజెప్పి దోపిడీలు చేయకుర<br /> ధర్మవర్తన గలిగి ధరణిలో నువు మెలగర<br /> కర్తవ్య పాలనలో ముందంజ వేయర<br /><br />103. విలువలేని చోట నీవు నిలువబోకు చూడర<br /> గుర్తింపు లేనిచోట అవమానము పొందకుర<br /> కాని చోటు చెరి నీవు కలత చెందబోకుర<br /> ఆత్మాభిమాన మెపుడు చంపుకోవాకుర <br /><br />104. మనస్ఫూర్తి ఆహ్వానము కాదనబోకుర<br /> అరహతలేని స్థలము శీఘ్రమే వదలర<br /> కొంగల గుంపులోకి హంస చేరతగదుర<br /> నీ నిజస్థితిని ఎప్పుడు కించపరచు కోకుర<br /><br />105. విదేశీయ పోకడలను విషమువలె త్యజించర<br /> భారతీయ సంస్కృతి భువికాదర్శముర<br /> పరధర్మము నాశ్రయించి పతనపడ బోకుర<br /> స్వధర్మ పరిధిలో సుఖశాంతులు బడయర // ఓ ఆత్మవీర //<br /><br />106. శివసత్తుల పూనకాలు బూటకములని తెలియర<br /> త్రాగిన మైకము డప్పుల చప్పుల్లావేశము<br /> నరముల బలహీనత వ్యాధియని తెలియర<br /> యదార్ధ దైవత్వం ఊగిసాగదు ఉన్మత్తుగ వాగదుర<br /><br />107. మిధ్యను విస్మరించి విద్యార్ధివి గమ్మురా<br /> విద్యనేర్చిన వారికి వింతలేదు చూడర<br /> విద్యయే వివేకాలోచనలకు నాందిరా<br /> విద్య నేర్వకున్న బ్రతుకు హీనమై పోవురా<br /> <br />108. బలవంతుడ నేనటంచు కాలుదువ్వబోకుర<br /> చలి చీమల చేజిక్కిన సర్పము గతియగునుర<br /> తాను త్రవ్విన గోతిలో తానే పడిపోవుర<br /> త్రుప్పువలె దుష్కర్మ అంతమొందించుర<br /><br />109. నీకు తెలిసిన పరిధిలో నీవుండ నేర్వరా<br /> నీకు తెలిసిన జ్ఞానమె సర్వస్వమన బోకుర<br /> అడవిలోని చెట్లన్ని ఒకే తీరు గావుర<br /> అవనిలోని జనుల విషయ మంతేనని తెలియర<br /><br />110. చీకటింట్ల రాళ్ళురువ్వ చీకటి తొలగిపోదుర<br /> ఇతరుల విమర్శించగానె గొప్పవాడవు గావుర<br /> చిరుదివ్వెను వెలిగించిన చీకటి మాయమగునుర<br /> ఏకాత్మ భావనిష్ఠలో విమర్శలకు తావుండదుర విమర్శలకు // ఓ ఆత్మవీర //<br /><br />111. ప్రతివారిలో ఏదో దోషముండి తీరుర<br /> మంచి చూచి మంచినే ప్రోత్సహించ వలయుర<br /> సూర్యునకు చీకటి కనిపించ బోదుర<br /> మంచి వారికి అంతట మంచియే కనిపించుర<br /><br />112. పరుల సొమ్ము కొరకు నీవు ప్రాకులాడ బోకుర<br /> పరుల సొమ్ము పామువంటిదని నీవు తెలియర<br /> మృగతృష్ణ వంటి ఆశలొ నువు బడకుర<br /> ఆత్మజ్ఞాన సిద్ధుడవై అవనిలో సుఖించర<br /><br />113. గొంగలి యున్నంతలోన కాళ్ళు చాచుకొమ్ముర <br /> ఉన్నదానిలోనె సంతృప్తి చెందనేర్వరా<br /> దుబారా ఖర్చులు తగ్గించి మెలగర<br /> పొదుపుగలిగి మితముగ నీవు జీవించర<br /><br />114. అనువుగాని చోట నీవు ఘనుడనన బోకుర<br /> తగ్గించుకొని యున్న తప్పేమి లేదుర<br /> దర్పణములో ఆకాశము స్వల్పమే ఐనను<br /> దిగంత నిజస్థితికి ఏ లోటులేదు చూడరా<br /><br />115. త్యాగమునకు ఉన్న విలువ లోభమునకు లేదురా<br /> నిలువయున్న మురికి గుంట లోభత్వమని తెలియర<br /> ప్రవహించు గంగవంటిది త్యాగగుణమని నమ్మర<br /> పరిత్యాగ హృదయుడవై పరమాత్మసిద్ధి నొందర //ఓ ఆత్మవీర// <br /><br /><br />116. విషనాగు గరుడపక్షికి అమృత భోజనంబుర<br /> అట్లని నీవు దానిని అనుకరించబోకుర<br /> నీ స్థాయికి మించిన నటన ఏనాడు తగదుర<br /> నీ పరిధిలో నీవుండుటె నిత్య శుభమస్తుర<br /><br />117. విద్యను మించిన వెలుగు వసుధలో లేదుర<br /> విద్యయే విజ్ఞాన ప్రదాయినియని తెలియర<br /> విద్యచే వినయ క్రమశిక్షణలు అబ్బుర<br /> దైవాత్మ జ్ఞానమొక్కటియే ధరణిలోన మిన్నరా<br /><br />118. ఆరోగ్యవంతుల యందే శుద్ధ మనసుండునుర<br /> ఆరోగ్య విధులను తు.చ. తప్పబోకుర<br /> యోగ వ్యాయామములచే దృఢ శరీరివి గమ్ముర<br /> ఆరోగ్యమే మహాభాగ్యమని నీవు నమ్మర<br /><br /><br /> మత సామరస్యం<br /><br />119. మతముల పేరిట మారణ హోమము తలపెట్టకుర<br /> మతకర్తల పేరును మంటగలుప బోకుర<br /> తృప్తికి మించిన ముక్తి జగతిలో లేదుర<br /> సర్దుబాటు గలిగి నీవు బ్రతుకుబాట సాగర<br /><br />120. సమ్మతిలేని మతములతో సతమతమై పోకురా<br /> మతి మార్పు ముఖ్యం గని మత మార్పు గాదుర<br /> మతములెన్ని పుచ్చుకున్న మనో నిలుకడ లేదుర<br /> దైవమతము చేపట్టి ధరణిలో నువు వెలుగర <br /><br />121. మనుష్యుల విడదీయునది మతముగాదని చెప్పరా<br /> మనుష్యుల మధ్య కులమత అడ్డుగోడలు వద్దుర<br /> హృదయాలను కలుపునది విశ్వమత జ్యోతిర<br /> విశ్వమును తనలో దర్శించునదే దైవమత ప్రతిభర // ఓ ఆత్మవీర //naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-72780877529170900532010-04-19T00:34:00.000-07:002010-04-19T00:42:01.139-07:00బాబా సర్వకేంద్రుల సర్వావతార రూప వివరణపరమాణువునుండి పరమేశ్వర పర్యంతం బాబా అవతారమే. సకల ప్రాణుల, <br />సమస్త యుగావతారుల రూపములలో బాబా జీవించి వుండును. తనకు చెందని <br />అవతారము లేదు. కాబట్టి సర్వమతారాధ్య స్తోత్ర గానము చేయండి.<br /><br />1. త్రిపుర హరీశుడు సర్వశరణ్యుడు సాకారుడై వెలసెను<br /> స్వామి సాకారుడై నిలిచెను బాబా సాకారుడై వచ్చెను<br />2. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సాకారుడై వెలసెను<br />3. సర్వమతారాధ్య సర్వావతారుడు సాకారుడై వెలసెను.<br />4. విశ్వశరణ్య స్వపరంజ్యోతి సాకారుడై వెలసెను<br />5. సర్వాత్మబంధు సర్వకేంద్రుడు సాకారుడై వెలసెను<br />6. సమస్త యుగముల రక్షక ప్రభువు సాకారుడై వెలసెను స్వామి సాకారుడై వెలసెను<br />7. సర్వాంతర్యామి సర్వధరితుడు సాకారుడై వెలసెను<br />8. సూరి సర్వజ్ఞస్తోత్రుడు సర్వాత్మపూర్ణుడు సాకారుడై వెలసెను<br />9. సర్వాత్మతేజుడు సర్వోన్నతుడు సాకారుడై వెలసెను<br />10. కాండత్రయాతీతుడు కైవల్యధాముడు సాకారుడై వెలసెను<br />11. సర్వస్వరూపుడు సర్వాకారుడు సాకారుడై వెలసెను<br />12. సర్వస్థలవాసి సర్వాతీతుడు సాకారుడై వెలసెను<br />13. సర్వశక్తినిలయ సర్వస్థలవాసి సాకారుడై వెలసెను<br />14. నిర్మలాత్ముడు నిర్వాణ నిలయుడు సాకారుడై వెలసెను<br />15. సర్వాధిస్థాన స్వత:స్సిద్దుడు సాకారుడై వెలసెను<br />16. సర్వలోకశరణ్య విశ్వగర్భుడు సాకారుడై వెలసెను<br />17. తేజస్తేజుడుచిద్గగన శరీరుడు సాకారుడై వెలసెను<br />18. అక్షరరూపుడు అచలామృతుడు సాకారుడై వెలసెను<br />19.. పుండరీకాక్షుడు పురుషోత్తముడు సాకారుడై వెలసెను<br />20. అవదూత ఆదిగురు దత్తాత్రేయుడు సాకారుడై వెలసెను<br />21. షిరిడి క్షేత్రవాసి సాయిబాబా సాకారుడై వెలసెను<br />22. పరమపావనుడు ప్రశాంతినిలయుడు సాకారుడై వెలసెను <br />23. శ్రీచక్రనిలయ శ్రీనివాసుడు సాకారుడై వెలసెను<br />24. యాదగిరిక్షేత్ర లక్ష్మీరమణుడు సాకారుడై వెలసెను<br />25. శబరిగిరివాసుడు జ్యోతిస్వరూపుడు స్వామి అయ్యప్ప సాకారుడై వెలసెను<br />26. కాలకాళుడు కాలాతీతుడు సాకారుడై వెలసెను<br />27. సృష్ట్యాతీతుడు దృక్స్వరూపుడు సాకారుడై వెలసెను<br />28. ఆద్యంతపూర్ణుడు అవ్యక్తభాసుడు సాకారుడై వెలసెను<br />29. ఆద్యంతరహితుడు అప్రమేయుడు సాకారుడై వెలసెను<br />30. అచలప్రదీప్తుడు అమృతహృదయుడు సాకారుడై వెలసెను<br />31. వేదపూజ్యుడు అనంతశయనుడు సాకారుడై వెలసెను<br />32. సద్ధర్మతేజుడు సత్యస్వరూపుడు సాకారుడై వెలసెను<br />33. ద్వైతమత స్థాపక మధ్వాచార్యుడు సాకారుడై వెలసెను<br />34. విశిష్టాద్వైత రామానుజచార్య సాకారుడై వెలసెను<br /><br />35. అద్వైత వేదాంత ఆదిశంకరుడు సాకారుడై వెలసెను<br />36. అయోధ్యపురవాసి రఘురామచంద్రుడు సాకారుడై వెలసెను<br />37. ద్వారకనిలయ జనార్ధనకృష్ణుడు సాకారుడై వెలసెను<br />38. భ్రమరాంబసహిత శ్రీశైలమల్లన్న సాకారుడై వెలసెను<br />39. శ్రీమదచల పరిపూర్ణ శివరామదీక్షితుడు సాకారుడై వెలసెను<br />40. ఆత్మాభిషిక్త విశ్వరక్షక యెహోవాప్రభువు సాకారుడై వెలసెను<br />41 సత్య శివ సుందర శాంతి స్వరూపుడు సాకారుడై వెలసెను<br />42. అచ్యుతీశహరి అల్లాప్రభువు సాకారుడై వెలసెను<br />43. మహనీయచరితుడు మహమ్మద్ ప్రవక్త సాకారుడై వెలసెను<br />44. కరుణామయుడు ఏసునాధుడు సాకారుడై వెలసెను<br />45. సమస్తదివ్య సత్పురుషతేజుడు సాకారుడై వెలసెను<br />46. సత్యసాధువు గురునానక్ స్వామి సాకారుడై వెలసెను<br />47. మంత్రాలయవాసి రాఘవేంద్రుడు సాకారుడై వెలసెను<br />48. యుగావతారుడు మెహెర్ బాబా సాకారుడై వెలసెను<br />49. అత్యాశ్రయి అరుణాచలరమణుడు సాకారుడై వెలసెను<br />50. విశాలహృదయుడు వ్యాసమహర్షి సాకారుడై వెలసెను<br />51. స్వపరాదిశక్తి విశ్వలయమాత సాకారుడై వెలసెను<br />52. సత్యసద్గురు సాంధీప మహాముని సాకారుడై వెలసెను<br />53. విశిష్ఠవేదాంతి వసిష్టమహర్షి సాకారుడై వెలసెను<br />54. మృత్యుంజయుడు మార్కండేయుడు సాకారుడై వెలసెను<br />55. భగవన్మతుడు భక్తకబీరు సాకారుడై వెలసెను<br />56. ప్రజ్ఞాచక్షు దండివిరజానంద సాకారుడై వెలసెను<br />57. విజ్ఞాన నిలయుడు వివేకానందుడు సాకారుడై వెలసెను<br />58. పరవశవేదాంతి రామతీర్థుడు సాకారుడై వెలసెను<br />59. తీర్థంకరుడు మహావీరజినుడు సాకారుడై వెలసెను<br />60. బోదిసత్వ నిర్వాణబుద్ధుడు సాకారుడై వెలసెను<br />61. స్వనిష్టనొందిన యుత్కృష్ట యోగీంద్రుడు సాకారుడై వెలసెను<br />62. స్వయంభు స్వతస్సిద్ధుడు పరాత్పరమ అత్యాశ్రమనిలయుడు సాకారుడై వెలసెను<br />63. శిష్యులపాలిట శరణాలయుడు భక్తులపాలిట కల్పవల్లి సాకారుడై వెలసెను<br />64. సర్వమత సమన్వయమూర్తి పరమహంస రామకృష్ణుడు సాకారుడై వెలసెను<br />65. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రుడు సాకారుడై వెలసెను<br />66. తత్వశాస్త్రవేత్త గ్రీకు సోక్రటీసు సాకారుడై వెలసెను<br />67. విశ్వకవిచంద్రుడు రవీంద్రనాథుడు సాకారుడై వెలసెను<br />68. ఆత్మదర్శనశీలి అతిమానస అరవిందయోగి సాకారుడై వెలసెను<br />69. భారత స్వాతంత్ర్య ప్రదాత గాంధీమహాత్ముడు సాకారుడై వెలసెను<br />70. బ్రహ్మీభూత అసంగానందుడు మలయాళమహర్షి సాకారుడై వెలసెను<br />71. దివ్యజీవనజ్యోతి శివానందసరస్వతి సాకారుడై వెలసెను<br />72. ఆర్యసమాజ స్థాపక దయానందసరస్వతి సాకారుడై వెలసెను<br />73. పూరిజగన్నాధ పరమేశ్వరుడు సాకారుడై వెలసెను<br />74. కైలాసవాసుడు కైవల్యధరితుడు సాకారుడై వెలసెను<br />75. గోప్యాతిగోప్యుడు గోవిందనిలయుడు సాకారుడై వెలసెను<br />76. మహిమాన్వితుడు ఆదిమహావిష్ణువు సాకారుడై వెలసెను<br />77. దయాసాగర పరతత్వతేజుడు పరమశివుడు సాకారుడై వెలసెను<br />78. సర్వసుభద్రుడు సర్వోన్నతుడు సాకారుడై వెలసెను<br />79. విఘ్నవినాశక గణపతి పప్పా సాకారుడై వెలసెను<br />80. సర్వాంతరంగుడు సత్యనారాయణుడు సాకారుడై వెలసెను<br />81. సృష్టి, స్థితి, లయాతీతుడు సాకారుడై వెలసెను<br />82. శశి సూర్యనేత్రుడు విశ్వస్వరూపుడు సాకారుడై వెలసెను<br />83. విశ్వవిభూతిర్మయ విధిసూత్రధారి సాకారుడై వెలసెను<br />84. సిద్దులగిరివాసి సిద్ధేశ్వరుడు సాకారుడై వెలసెను<br />85. పర్వతగుహలో వెలసిన పాలకుర్తి సోమన్న సాకారుడై వెలసెను<br />86. గుహ్యద్గుహ్యుడు గుణాతీతుడు సాకారుడై వెలసెను<br />87. నిరాడంబరుడు నిరుపేదల స్వామి సాకారుడై వెలసెను<br />88. సకల మఠాశ్రమాలయ నిలయుడు సాకారుడై వెలసెను<br />89. కామినీ కాంచన కీర్తిప్రతిష్టల నొల్లని స్వామి సాకారుడై వెలసెను<br />90. విశ్వగర్భుడు విశుద్ధనిలయుడు సాకారుడై వెలసెను<br />91. సరస్వతీగర్భుడు చదువుల తల్లి సాకారుడై వెలసెను<br />92. వేదాతీతుడు పేదపూజ్యుడు సాకారుడై వెలసెను<br />93. సకల ధర్మశాస్త్ర సారముదెలిపిన స్వామి సాకారుడై వెలసెను<br />94. సకల పురాణముల పుక్కిట బిగించిన స్వామి సాకారుడై వెలసెను<br />95. సకల ప్రాణికోటి సమరక్షక ప్రభువు సాకారుడై వెలసెను<br />96. సర్వశక్తిమయుడు సర్వకేంద్ర బాబా సాకారుడై వెలసెను<br />97. సర్వలయయానుడు సర్వాతీతుడు సాకారుడై వెలసెను<br />98. ఆద్యంతరహితుడు అమరస్వరూపుడు సాకారుడై వెలసెను<br />99. సర్వావతారుడు సాక్షాత్తు దేవుడు సాకారుడై వెలసెను<br />100. భవరోగ నివారక బాబా సర్వకేంద్రులు సాకారుడై వెలసెనుnaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-24659366523575007422010-03-19T02:35:00.000-07:002010-03-19T02:39:06.790-07:00పరాత్పరమ అత్యాశ్రమ బాబా మంగళ హారతిబాబా సర్వకేంద్రుల శారీరక జన్మస్థలమైన ఇండ్లూరు గ్రామ నివాసి, బాబా పాదజ్యోతి శ్రీ బసవోజు బ్రహ్మచారి విరచిత అత్యద్భుత కవితా స్రవంతి<br /><br />పరాత్పరమ అత్యాశ్రమ బాబా మంగళ హారతి<br /><br />మంగళమని పాడరె అత్యాశ్రమ బాబాకు // మంగళమని //<br />భక్తిశ్రద్దలతోడను మన బాబాకు పాదపూజలు చేయరె // మంగళమని //<br />స్పర్శ మాత్రమున సద్గతికి చేర్చే స్వామి బాబాకు // మంగళమని //<br />అగరు గంధము చల్లరే హరి బాబాకు సెంటు మల్లెలు వేయరె<br />జనమంతా మెచ్చి, జగమంత మ్రోగేటి జగదాచార్యబాబాకు//మంగళ// <br />సకల తీర్ధపాద, సర్వక్షేత్రవాసి సర్వశరణ్యునకు // మంగళమని //<br />అఖిలాండకోటి బ్రహ్మాండ నిలయ అచ్యుతీశ హరి పరబ్రహ్మకు<br />సర్వస్వరూపుడు, సర్వాకారుడు, సర్వస్థలవాసికి // మంగళమని //<br />విశ్వస్వరూపుడు, విశ్వాత్మతేజుడు, విశ్వగర్భునకు // మంగళమని //<br />చేరి స్థుతించిన సన్మతినిచ్చి, కోరి భజించిన <br />కోరికలు దీర్చేటి కల్ప తరువుకు // మంగళమని //<br />తత్త్వాతీత త్రిపుర హరీశుడు, ప్రణవాలయహరి పరంధామునకు/మంగళ/<br />నిర్వికార నిర్వాణ నిలయ, సర్వకళా ప్రపూర్ణ జ్యోతికి,<br />అచల ప్రదీప్తి అవతార కూడలికి // మంగళమని //<br />దేవాదిదేవ దివ్య ప్రభావునకు, ఆద్యంతరహిత అవ్యక్తతేజునకు/మంగళ/<br />సాంఖ్య తారకమనస్క, సంపూర్ణ బోధకునకు<br />భూ, జల, విహంగ, సర్వలయ యానునకు // మంగళమని //<br />సంగరహితుడు, సర్వాత్ముడు, సర్వోన్నత ప్రభుస్వామికి,<br />సత్య శివ సుందర సరస్వతీ గర్భులకు // మంగళమని //<br />శశి సూర్య నేత్ర, సర్వాంతరంగుడు<br />సర్వధరిత, సర్వభరిత, సర్వశక్తి సంపన్నునకు // మంగళమని //<br />పతితుల పాలిట ఉద్ధారకుడై దీనుల పాలిట<br />దిక్కై నిలిచిన దేశికేంద్రునకు // మంగళమని //<br />కాలాతీత కాలజ్ఞానికి, వేదపూజ్య దయాసాగరునకు<br />దివ్య సత్పురుష దైవజ్ఞ మూర్తికి // మంగళమని //<br />గుహ్యద్గుహ్యుడు, పరమ కారణుడు, <br />స్వత:స్సిద్ధ సర్వాత్మ జ్ఞానికి // మంగళమని //<br />అష్టవిధ గురువుల కావల నిలచి అతీత బోధ<br />ననుగ్రహించెటి అమృత సంజీవికి // మంగళమని //<br />సృష్టి, స్థితి, లయాతీత పరాత్పరమ అత్యాశ్రమ వాసికి<br />జనన మరణములేని జాడనెరిగించి<br />మాయాతీత మరుగు తెలిపే మార్గదర్శికి // మంగళమని //<br />కాళీ రూపునకు, కాండత్రయాతీతునకు<br />శ్రీమన్నారాయణ, పరమపద వాసికి // మంగళమని // <br />స్వయంభు: సత్యార్ధ ప్రకాశుడు, సర్వమతారాధ్య స్వామికి/మంగళ/<br />పంచభూతముల వివరముగ తెలిపి, సంచితాగామి కర్మల<br />దగ్ధము గావించి, ఉపదేశ మంత్రము ఊర్ధ్వమందున తెలిపే స్వామికి/మంగ<br />పరమ నిశ్శబ్ధుని, గంగం నిలయుని<br />గంగా యమునల నడుమన హరి బాబాను గుర్తు చేసికొని // మంగళమని //<br />కల్లలు గానట్టి, ఎల్లలు లేనట్టి ఏ-టు-జడ్ బాబాకు<br />ఎంగిలి లేనట్టి ఆత్మ నైవేద్యమిచ్చి // మంగళమని //<br />సూరి జన స్త్రోత్ర సత్య సద్గురు సార్వభౌమునకు<br />చిత్కళాతీత చిన్మయ చైతన్యునకు <br />సర్వలయ యాన చిద్గగన శరీరికి /మంగళ/<br />మంగళప్రదమైన మహితాత్మ మాతకు<br />మనసు దక్షిణ యిచ్చి మరుగు తెలిసికోని // మంగళమని //<br />విశుద్ధుడు, విశ్వగర్భుడు, విధి సూత్రధారునకు<br />ఏదిగాని, ఏమిలేని ఎరుకనంటని నేతి నేతి వాచ్యునకు // మంగళమని //<br />తీరుగ త్రిపురార మండలమందున వెలసిన<br />ప్రశాంతి నిలయ, దైవమత సంస్థాపకునకు // మంగళమని //<br />వాసిగ ఇండ్లూరి బ్రహ్మదాసుని కవిత <br />మణులందు సూత్రమున్న రీతిగ గాంచి // మంగళమని //<br />ధరణి శ్రీ ఇండ్లూరి దాసుని నమ్మిన<br />పరమ పదవి చేరే పలుకు పలకండి<br />శబ్ధ, స్థూల, సాకార పలక వదలండి<br />ఇదియే బాబా దర్శన లయ భాగ్యమండి<br />ఇంతకు మించి ఇక ఏమియు లేదనుచు // మంగళమని //<br /><br />జై బాబా ఇతి సర్వం సర్వకేంద్ర పితార్పణమస్తు<br />శుభం - పావనం - దివ్యం<br /><br />ఓం సర్వేత్ర స్సుఖినస్సంతు<br />సర్వేజనా సుఖినోభవంతు<br />లోకాస్సమస్తా స్సుఖినోభవంతు<br />శాంతి! శాంతి!! శాంతి:!!! <br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />బాబా సర్వకేంద్రుల అనుగ్రహ కృపసిద్ధి స్తోత్ర సూత్రములు:<br /><br />నీలో జ్యోతిని దర్శించు, నీవే వెలుగై వ్యాపించు<br /><br /><br />1. ఓం నమో సర్వకేంద్రాయ, ఓం నమో విశ్వగర్భాయ<br /> అన్యధా శరణం నాస్తి సదా త్వమేవ శరణం మమ<br /><br />2. జై బాబా జై ఓం సర్వకేంద్ర భజ<br /> జై బాబా జై ఓం పరంధామ జయ<br /><br />3. ఓం శివరామ కృష్ణ గోవింద నారాయణ<br /> జై విశ్వగర్భ సర్వకేంద్ర స్వామియే నమ:<br /><br />4. హరి: ఓం శివకాళీ పరాత్పరీ<br /> శ్రీం దుర్గ విశ్వమాతా భవాని సర్వేశ్వరి<br /><br />5. ఓం శివ శంకర శ్రీహరి సద్గురు శ్రీమన్నారాయణ<br /> పరమ పిత పారాయణ జై సర్వకేంద్ర బాబా ఆరాధన<br /><br />6. జై సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా<br /> జై జై జై<br /><br />7. హరి హరి హరి శ్రీ గోవిందాయని హరిని స్మరించవె ఓ మనసా<br /> శివ హరిని స్థుతించవె ఓ మనసా<br /><br />8. ఓం శ్రీ త్రిపుర హరీశ సర్వశరణ్య యెహోవా సాయిరాం<br /> అల్లా హరి బాబా నమో భజ సర్వకేంద్ర విధాత<br /> పాహిమాం, విశ్వగర్భ రక్షమాం<br /><br />9. దేహమనిత్యం, దైవం సత్యం, శరణం, షరణం<br /> శ్రీహరి అల్లా బాబా శరణంnaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-12644503038403047612009-12-16T03:36:00.000-08:002009-12-16T03:46:26.680-08:00భీష్మ ఏకాదశి వార్షికోత్సవ ఆహ్వాన పావన పత్రికఓం శ్రీహరల్లా శ్రీమన్నారాయణ యెహోవా పరమపిత సర్వకేంద్రాయ నమ:<br /> <br />భీష్మ ఏకాదశి వార్షికోత్సవ ఆహ్వాన పావన పత్రిక <br /> (26-01-2010 - మంగళవారం)<br /><br />ఓం శ్రీ వేదపూజ్య నేతిహరి హంస కాళీ బాబా చిన్మయ చైతన్య సర్వకేంద్ర స్వామి పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం త్రిపురారం <br /><br />ది.26-01-2010 (మంగళవారం) నాటి కార్యక్రమాల వివరాలు:<br /><br />ఉదయం 9.00 గంటలకు శ్రీ యన్. హరిప్రసాద్, హైదరాబాద్ గారి నేతృత్వములో, ఆశ్రమ ప్రధాన ఆర్ధిక కార్యదర్శి శ్రీ బోనగిరి జానయ్యగారి ఆధ్వర్యములో లోక కళ్యాణదాయకమైన శాంతి యజ్ఞము నిర్వహించబడును. యజ్ఞములో పాల్గొనదలంచిన భక్తులు తమ పేర్లను ముందుగ శ్రీ జానయ్య గారివద్ద నమోదు చేయించుకొనవలయును.<br /><br />ఊదయం 11.00 గంటలకు శ్రీవారి పవిత్ర ప్రధాన పాదజ్యోతి శ్రీ నేతి విజయదేవ్ ఆధ్వర్యములో బాబా సర్వకేంద్రుల సర్వ శరణ్య పూజ నిర్వహించబడును. ఈ పవిత్ర పూజా సమయములో బాబా పాదార్చకులు, త్రిపురారం గ్రామ వాస్తవ్యులైన శ్రీమతి చంచల మంగమ్మ, శ్రీ రాంబాబు పుణ్య దంపతులు నూతన వస్త్రములను సమర్పించుకొందురు. <br /><br />26-01-2006 నాటి రాత్రి జ్ఞాన నేత్ర జాగరణ భజన కార్యక్రమములు, ఆశ్రమ సత్సంగ నిర్వహణ కార్యదర్శులైన పురోహిత శ్రీ అబ్బిమళ్ళ నరసిం హులుగారి ఆధ్వర్యములో నిర్వహించబడును. మహా శివరాత్రి రోజున సైతం అంతే. <br />ప్రతి సంవత్సర అన్నపూజ ద్రవ్యదాతలైన శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ వాస్తవ్యులైన పుణ్య దంపతులు ఈ సంవత్సరములో దివంగత కీర్తిశేషురాలైన శ్రీమతి కుబ్బిరెడ్డి సత్యమ్మ గారి ఆత్మశాంతిని కోరుచు ఆ జనని స్మారకార్ధము ఆమె ఏకైక సుపుత్రుడు శ్రీ కుబ్బిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుణ్య దంపతులు ఘనముగ జరిపించుచున్నారు.<br /><br />ఏ కుల, మత, ప్రాంతీయ పక్షపాతము లేదు. అందరూ ఆహ్వానితులే. దర్శించి తరించండి.<br /><br />ముఖ్య సూచన:- ఆశ్రమ సంబంధ సమస్త కార్యములు బాబా సర్వకేంద్రుల అత్యాశ్రమ దత్త జ్యోతులైన శ్రీ నేతి విజయదేవ్, శ్రీమతి అరుణమ్మ గారల నేతృత్వ పర్యవేక్షణలో వుండును.<br /><br />సంపూర్ణ దైవ చిత్తము సదా సర్వత్ర నెరవేరు గాక. సంపూర్ణ దైవ మతము సదా సర్వత్ర వర్ధిల్లు గాక. ఆమేన్. జై బాబా. <br /><br /> ఓం సర్వేత్ర సుఖినస్సంతు<br /> సర్వేజనా సుఖినోభవంతు<br />లోకా స్సమస్తా సుఖినోభవంతు<br /> ఓం శాంతి! శాంతి!! శాంతి:!!!<br /><br />ఇట్లు<br />అత్యాశ్రమ ప్రధాన కార్యదర్శి,<br />నగిరి వెంకన్న, త్రిపురారం.<br /><br />అత్యాశ్రమ ఉపకార్యదర్శి<br />నగిరి బిక్షమయ్య, త్రిపురారం.<br /><br /><br />అత్యాశ్రమ అధ్యక్షులు, <br />బాబా భాసరత్న శ్రీమదచల రాజయోగి,సద్గురుమూర్తి, <br />శ్రీ పందిరి శ్రీరాములు గారు,మిర్యాలగూడెం. <br /><br />అత్యాశ్రమ ఉపాధ్యక్షులు,<br />శ్రీ ఆదూరి సుధాకర్ రెడ్డి గారు,<br />మెహిదీపట్నం, హైదరాబాద్.<br /><br />అత్యాశ్రమ ప్రధాన ఆర్ధిక కార్యదర్శి,<br />శ్రీ బోనగిరి జానయ్య గారు, త్రిపురారం.<br /><br />అత్యాశ్రమ ఆర్ధిక ఉపకార్యదర్శి,<br />శ్రీ కుబ్బిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిగారు,హైదరాబాద్.<br /><br />అత్యాశ్రమ సత్సంగ నిర్వహణ కార్యదర్శి,<br />అబ్బిమళ్ళ నరసిం హులు గారు, త్రిపురారం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-30806947407634537922008-12-22T04:02:00.000-08:002008-12-22T04:06:44.783-08:00ఆహ్వాన శుభ పత్రికఓం శ్రీ భగవతి నారాయణి పరమపిత సర్వకేంద్రాయ నమ:<br /><br /><br /> ఆహ్వాన శుభ పత్రిక (05-02-2009 భీష్మ ఏకాదశి)<br /><br /> సంపూర్ణ దైవమత బోధక పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం <br /> త్రిపురారం (మండలం),నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.<br /><br /> ఇందుమూలముగా సమస్త భక్త మహాశయులకు తెలియపరచు ముఖ్య విషయము ఏమనగా ది.05-02-2009 (గురువారం) భీష్మ ఏకాదశి పర్వ దినమున బాబా సర్వకేంద్రులవారి అత్యాశ్రమ వార్షికోత్సవ సందర్భములో ఈ దిగువ సూచిత కార్యక్రమములు నిర్వహించబడును. అందులకై ఆసక్తిగల భక్తులు పాల్గొని, నేత్రపర్వ ఆత్మానంద భరితులై జన్మ చరితార్ధులు కండి.<br /><br />1. 05-02-2009 గురువారం ఉదయం గం.8.00 లకు త్రిపురారం గ్రామ వాస్తవ్యులైన శ్రీమాన్ శ్రీ జీడికంటి లక్ష్మి నరసిం హాచార్యులు గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంబంధమైన విశ్వశాంతి యజ్ఞము నిర్వహించబడును.<br /><br />2. ఈనాటి అన్న పూజా నిర్వహణ పుణ్య దంపతులు, ప్రతి సంవత్సర అన్న పూజ ద్రవ్య దాతలు - హైదరాబాద్,వనస్థలిపురం వాస్తవ్యులు శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారలు.<br /><br />3. స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ – హైదరాబాద్, సైదాబాద్ వాస్తవ్యులు శ్రీమతి జె. శ్యామల, శ్రీ నారాయణ (బొంగు మర్చంట్) పుణ్య దంపతులు.<br /><br />4. శ్రీ డేగల రామయ్య, బొల్లెద్దు సాయిలు గారల ఆధ్వర్యంలో కొమ్మాల భక్త, భజన బృందం వారు పాల్గొనగలరు.<br /><br />5. బస్వోజు బ్రహ్మయ్యగారి ఆధ్వర్యంలో ఇండ్లూరు భక్త బృందంవారి బుర్రకథ కాలక్షేపం.<br /><br />6. శ్రీ యం. లింగం, శ్రీ బి. రాం రెడ్డి గారల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా, రాంపూర్ గ్రామ భక్తులు హాజరు కాగలరు.<br /><br /> 05-02-2009 రాత్రి జ్ఞాన నేత్ర జాగరణ, భజన, సత్సంగములు ఉండును. సమయాను కూలముగ మధ్య మధ్య ఓం శ్రీ వేదపూజ్య నేతి హరి కాళీ బాబా చిన్మయ చైతన్య సర్వకేంద్ర స్వామివారి స్వహస్త లిఖిత అతీత దివ్య భాష్య ప్రవచనామృత ప్రసాదమును శ్రీవారి పవిత్ర ప్రధాన పాద జ్యోతి శ్రీ యన్. విజయ దేవ్ పంచగలరు.<br /><br /> మానవ జన్మ తరుణోపాయమునకు అమూల్య అవకాశము. ముందుగా తలుసుకోండి, పిదప తెలుసుకోండి, ఆపై కలుసుకోండి. శుభం. జై బాబా! <br /><br />మరియొక ముఖ్య గమనిక:- ది.23-02-2009 (సోమవారం) మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం ఆశ్రమ ఉద్ధారక కార్యకర్తలైన శ్రీ బోనగిరి జానయ్య, అప్పిమళ్ళ నర్సిం హులు, త్రిపురారం గ్రామ వాస్తవ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ కార్యక్రమమునకు ఆశ్రమ దత్త పుత్రిక శ్రీమతి యం. అరుణ, శ్రీ యన్. విజయ దేవ్ పాల్గొనగలరు.<br /><br /><br />ఆశ్రమ అధ్యక్షులు, ఇట్లు, <br />శ్రీ పందిరి శ్రీరాములుగారు ఆశ్రమ ప్రధాన కార్యదర్శి,<br />(సద్గురుమూర్తి),మిర్యాలగూడెం. నగిరి వెంకన్న, త్రిపురారం.<br /><br />ఆశ్రమ ఉపాధ్యక్షులు, ఆశ్రమ ఉపకార్యదర్శి, <br />శ్రీ ఎ.మల్లారెడ్డిగారు,(మాజీ సర్పంచ్),త్రిపురారం. నగిరి బిక్షమయ్య,త్రిపురారం.<br /> <br /><br /> లోకా సమస్తా సుఖినోభవంతు!<br /> శాంతి! శాంతి!! శాంతి:!!!naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-31831886518458119022008-10-16T01:13:00.000-07:002008-10-16T01:14:45.204-07:00ఒక్క క్షణం ఆలోచించు!మనిషికి మత్తెక్కించి మనసును మాయజేసి<br />ఇల్లును ఒళ్ళును గుల్ల చేసి, సంఘంలో చులకన చేసే <br />మద్యపాన రక్కసీ! మానవజాతి మనుగడపై <br />నీ ప్రభావం మానేదెప్పుడు?<br /><br />ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు<br />“చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి<br />ఐస్ ముక్కల హిమతాపానికి కరిగిపోయాయి<br />మహాత్ముల ఉపన్యాసాలు, నీతి బొధలు<br />సంఘ సంస్కర్తల త్యాగఫలాలు<br />మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి<br /><br />అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది<br />గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం<br />బరువెక్కి బక్కచిక్కి బజారుపాలైంది<br />మధ్యం నిషా ముందు యింద్రభొగం దిగదుడుపయ్యింది!<br /><br />ఎవడన్నాడు నా దేశం బీదదని<br />ఒక్కసారి బార్ ను దర్శించి చూడు<br />కుబేరుల తలదన్నే కాసుల గలగలలు<br />కుంభవృష్టిలాగా మధ్యం సెలయేళ్ళు<br /><br />గజం భూమి ధర గణనీయంగా పెరిగన నేడు<br />గజానికో బార్ వెలసినా ఆశ్చర్యం లేదు<br />మందు మంచినీరులా ఉపయోగించినా కరువే రాదు<br />లక్షలాది ప్రాణాలు బలైనా బాధే లేదు!<br /><br />మనసా! ఇంద్రియాలంటే నీకెందుకింత చులకన<br />క్షణాలలో పడేస్తావు నీ వలలో క్షణికానందాలకు<br /><br />ఆరునూరైనా అనుకున్న టైంకు హాజరు పరుస్తావు<br />నీ కబంధ హస్తాలలో నిత్యం బందీని చేస్తావు<br /><br />నాకెందుకో కసిగా కక్ష్య తీర్చుకోవాలనుంది<br />మద్యం సేవించే వారిపై కానేకాదు<br />త్రాగడానికి మనసును ఉసిగొలిపే ఇంద్రియాలమీద<br />మానవాభ్యున్నతిని మట్టుబెట్టే మనో చాంచల్యం మీద!naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-75104817116617103412008-10-10T02:30:00.000-07:002008-10-10T03:47:03.021-07:00నవరాత్రి దుర్గాదేవి ఉత్సవ సందర్భముగ చంద్రపురి కాలనీలోని <br /> దాతలు ఇచ్చిన విరాళముల వివరములు<br /><br /> భక్తుల పేరు<br />1. శ్రీమతి వరలక్ష్మి,రామకృష్ణ<br />2. శ్రీమతి విజయలక్ష్మి,నాగేశ్వర రావు<br />3. శ్రీమతి లక్ష్మి, ప్రకాశ రావు<br />4. శ్రీమతి శశిరేఖ, హనుమంత రావు<br />5. శ్రీమతి ఉమా గాంధి,<br />6. శ్రీమతి అంజలి, వెంకటేశ్వర రావు<br />7. శ్రీమతి కనకదుర్గ, జానకిరాం<br />8. శ్రీమతి కమలమ్మ, సుబ్రహ్మణ్యం<br />9. శ్రీమతి జగన్నాయకమ్మ, పురుషోత్తం<br />10. శ్రీమతి వసంత, సదాశివం<br />11. శ్రీమతి సుబ్బలక్ష్మి, ష్యాంసుందర్<br />12. శ్రీమతి శైలజ, మాధవ రావు<br />13. శ్రీమతి నాగమణి, రామారావు<br />14. బి.ఏ.ఎస్. మూర్తి, కీ.శే. శ్రీమతి సరస్వతి<br />15. శ్రీమతి పద్మావతి, నాగరాజ శర్మ<br />16. శ్రీమతి పాపాయమ్మ, పార్వతీశం<br />17. శ్రీమతి జ్యోత్స్న, సూర్యప్రకాష్<br />18. శ్రీమతి వాణి కృష్ణా రావు<br />19. శ్రీమతి సౌమ్య, జగన్నాధం<br />20. శ్రీమతి భవాని రాని, సత్య ప్రసాద్<br />21. శ్రీమతి సీతారామ లక్ష్మి, రామ శర్మ<br />22. శ్రీమతి శైలజ, దుర్గా ప్రసాద్<br />23. శ్రీమతి రేఖ, వీరయ్య<br />24. శ్రీమతి రాజేశ్వరి<br />25. శ్రీమతి శిరీష, ప్రేం చంద్<br />26. శ్రీ ప్రవీణ్ కుమార్<br />27. శ్రీమతి శ్రీవల్లి, ఆనంద్<br />28. శ్రీ రామమోహన శర్మ<br />29. అపర్ణ స్టోర్స్, చంద్రపురి<br />30. శ్రీమతి పద్మ, ఏ.ఎస్.ఆర్.మూర్తి<br />31. శ్రీమతి లలిత, అశోక్ కుమార్<br />32. శ్రీమతి సుధ, జనార్ధన్<br />33. శ్రీమతి భార్గవి, నాగేంద్ర కృష్ణ మోహన్ <br />34. శ్రీమతి సూర్యకుమారి, ఆంజనేయులు<br />35. శ్రీ పి.లక్ష్మి నరసిహ్మ శాస్త్రి,తండ్రి:నాగేశ్వరరావు<br /><br /><br /><br /><br /><br />ఎ. మొత్తం విరాళాలు<br />బి.హుండి వసూళ్ళు<br />సి. మొత్తం <br /><br /><br />ఖర్చుల వివరములు <br />(28/9 నుండి 1/10/08 వరకు)<br /><br />మేదర సామానులు …<br />అలంకరణ వస్తువులు …<br />పూజ సామాగ్రి …<br />ఆటో చార్జీలు …<br />పూలదండలు …<br />పేపర్ ప్లేట్స్ …<br />బౌల్స్ …<br />తవల్స్ మరియు బ్లౌజులు …<br />కలశం, ప్రమిదలు, అరటి పళ్ళు …<br />తమలపాకులు, గుమ్మడికాయ,<br />పాలు, మిఠాయిలు, పూలు<br /><br />2/10: సిడిలు, మిఠాయి, పూలు, పళ్ళు<br />3/10: ½ కేజి. మిఠాయి, పూలు, పళ్ళు,<br /> నూనె, పంచదార<br />5/10: పూలు, నిమ్మకాయ, నూనె,<br /> పాలు, అరటి పళ్ళు, కొబ్బరికాయలు,<br /> ప్లాస్టిక్ కవర్లు, పూల దండలు,<br /> బ్యాటరీలు.<br /><br />9/10: కేటరింగ్<br /> వ్యాన్ …<br /> పూజారి …<br /> చంద్రయ్య …<br /> మునిసిపాలిటీ …<br /><br />ఖర్చును మించి రాబడి … రూ.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-27539302699861740492008-07-08T04:46:00.000-07:002008-07-09T03:03:55.350-07:00లోకం పోకడకాని పనులజేసి కపట మార్గంబున<br />తప్పించుకొన జూచు తెలివిమీరి <br />ప్రకృతి పగబట్టి పగదీర్చుకొంటది<br />తరచి చూడ నాగుబాము పగిది<br /><br />అమ్మవలన బుట్టి అమ్మవలన బెరిగి<br />ఆలి వచ్చిన క్షణమె అమ్మ చేదాయెను <br />ముందు చెవులకన్న వెనుక కొమ్ములు వాడన్నట్లు<br />లోకరీతిని పరికింప సత్యమిలను<br /><br />ఎదుటి వానియొక్క ఎదుగుదలను జూసి<br />కడుపునిండ విషము నింపుకొనియు <br />మనసులోన పెక్కు కుతంత్రాలు బన్ని<br />మాటలోన మిగుల ప్రేమొలుకబోతురు<br /><br />ఉన్నమాట జెప్ప ఉరిమురిమి జూతురు<br />కల్ల మాటలు జెప్ప ఉల్లముప్పొంగును <br />కపటవర్తన చేత కార్యంబు దీతురు<br />కలియుగాన జనులు కస్టాల కోర్వలేక<br /><br />పాంచభౌతిక దేహ పరిధిగానక నరులు<br />జల్సాలెన్నొజేసి షోకులెన్నొ వేసి<br />పుట్టి పెరిగినదిలను అనుభవించుట కంటు <br />శుష్క వేదాంతంబు తెగజెప్పుచుందురు<br /><br />పరులు జూచుటకొరకు పట్టెమంచము పరుపు<br />పవళించు సమయాన కటికనేలయె గతి<br />మాయ జబ్బులు వచ్చి మంచము కరువాయె <br />జనుల మార్చనెంచ నెవరి తరము !<br /><br />తమ సొమ్మనగానె తెగ పొదుపుజేతురు<br />మంది సొమ్ముగాంచ మంచినీళ్ళ పగిది<br />స్వపర భేదములేక వర్తించు వారలే <br />మానవోత్తములని మహిని తెలియవలయు<br /><br />మంచి మాటలు జెప్ప మాటాడకుందురు<br />చెడ్డమాటలంటె చెవిగోసుకొందురు<br />పరుల దోషమునెంచి బరగ దూషింతురు <br />మనసు మర్మము దెలియని మనుజులిలను<br /><br />ఇల్లు ఒళ్ళు రెంటి గుళ్ళ జేయునట్టి<br />మద్యపానంబును మానలేక జనులు<br />సంఘములో బహు చులకనైపోదురు<br />క్షణిక సుఖము కొరకు ప్రాకులాడిన నరులు<br /><br />కలిగియున్న వేళ కలతలెప్పుడు రావు<br />సన్నగిల్లు వేళ సణుగుడు మొదలౌను<br />కలిమి లేములందు సమముగా నుండుటే <br />సంఘ జీవికెపుడు సరియైన మార్గంబు<br /><br />పరిణయంబులకేమొ ఫంక్షను హాలులు<br />ఫలహారముల జూడ పదుల సంఖ్యలొ నుండు<br />లెక్కలేని పెక్కు భోజన పదార్ధాలు <br />అర్థ భాగము మిగుల వ్యర్ధమైపోవును<br /><br />శీలమొక్కటె స్త్రీలకాభరణమై యుండగా<br />మెడనిండ నగలేసి తెగ మురిసిపోదురు<br />పట్టుచీరల కొరకు పరుగులే దీతురు <br />ఆందచందాలకధిక ప్రాధాన్యమిత్తురు<br /><br /><br /><br /><br /><br />జ్ఞాన మార్గం<br /><br />నామరూప జగతి సత్యంబుగా దోచు <br />మాయ వలన మహిని మనుజునకును <br />నిత్యానిత్య వస్తు వివేచన సలుపంగ<br />మాయ తొలగిపోయి మర్మమెరుగు<br /><br />పెక్కు జనుల శవములు కనులార గాంచియు<br />తనకు మరణమిపుడు రాదటంచు<br />భౌతికమును బహుగ ప్రేమించుచుందురు <br />హంస ఎగిరిపోవు క్షణము దెలియలేక<br /><br />మంచి పనులు జేయ మాయ యడ్డగించి<br />విఘ్నంబులెన్నియో కల్పించుచుండును <br />ఆత్మ స్థైర్యముతోడ అడుగు ముందుకు వేయ<br />మాయ తొలగిపోయి దారి చూపించును<br /><br />సృష్టిలోన మానవ జన్మ ఉత్కృష్టంబు<br />విచక్షణ శక్తి యుండుటే దీని ఘనత <br />మంచి చెడ్డలుగని మసలుకుంటె మిగుల<br />మనిషి జన్మ యిలను బహుళ సార్ధకమగును<br /><br />నేను నేనటంచు తెగ విర్రవీగును<br />దేహ భావముతోడ జీవుడిలను <br />భారమైన వేళ భగవంతుడేడును<br />తన బలము చాలదనే అనుభవంబుతోడ<br /><br />భౌతికమందున బహుసుఖము గలదంటు<br />బాహ్య ప్రపంచాన తిరుగాడుచుందురు <br />అంతరంగమందు అమృత భాండమ్ము<br />గాంచలేరు జనులు సాధన సలుపరేని<br /><br />కామాతురతబొంద మనసు వశము దప్పు<br />ఉచితానుచితంబు మిగుల సన్నగిల్లు <br />బలహీన క్షణమొకటి బలిపశువుగా మార్చు<br />బంగారు భవిష్యత్తు భగ్గుమని మండును<br /><br />ఎంత సంపాదించి ఎన్నాళ్ళు బతికినా <br />తనువు శాశ్వతంబుగాదు తర్కించి చూడగా<br />తన్నుద్దరించుకొని విశ్వశ్రేయస్సు కాంక్షించి <br />పరితపించువాడె పరమ యోగీశ్వరుండు<br /><br />మలినరహిత మనసువలన మంచి దేహముండురా<br />ఇతరులభివృద్ధి గాంచి ఈర్ష్య చెందనేలరా <br />కుళ్ళుబోతు తనముబెంచ కూలిపోవు చూడరా<br />సర్వజనుల హితముగాంచి సద్గతి నువు బొందరా<br /><br />కర్మ జన్మలయొక్క మర్మంబు నెరుగక<br />భౌతిక ప్రపంచాన బాధలొచ్చినవేళ <br />తన కర్మమేమిటని తెగ బాధపడుదురు<br />భగవంతునేడుకొని పశ్చాత్తాపపడుదురు<br /><br />పరమాత్మ స్మరణయే పరమ లక్ష్యముకాగ<br />విషయ వాంఛలతోడ వహరించు చుందురు <br />దేహ సుఖములకొరకు దేబిరింతురు జనులు<br />ఆత్మ జ్ఞానములేక అల్లాడుచుందురు<br /><br />మంచి మనసుగలిగి మానవుడుండిన<br />విశ్వశక్తులన్ని మనసావహించును<br />మానసిక పరివర్తన మరి మరి కలుగును<br />ఆత్మ సిద్ధి బొంది ఆనందమందునుnaagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-87118296118669227822008-07-02T02:29:00.000-07:002008-07-02T02:31:31.334-07:00మేను - నేనుసచ్చిదానంద పర:బ్రహ్మ స్ధితిలో శిష్యుల మనస్సును లయింపజేయటమే సత్యోపదేశము. ఇది సహజ స్ధితి. ఈ స్ధితినుండి భ్రష్టమైన చిత్తము దిగజారి సంసారంలో ఒడుదుడుకులపాలైనది. దానిని పూర్వస్ధితికి చేర్చడమే నిజమైన ఉపదేశము. తన సహజస్ధితియైన శుద్ధత్వమునుండి విడిపోకుండ చూడటమే ఉపదేశ రహస్యము. నీవు సదా ఆత్మవే! ఆత్మకంటె భిన్నమైన వాడవుకావు. ఆత్మయే నీవని నిరూపించటమే గురూపదేశం. గురుశిష్యులు, జీవేశ్వరులు ఒకే మూలతత్త్వ పర్యాయ పదములు. ఇట్టి సర్వాది మూలతత్త్వ కేంద్రం నీది. ఈ నా, నేనే సమస్త నేనులకు దైవ నేను. ప్రతి నేనులోని నేనే సంపూర్ణ నేను. ఈ నేనుకు కుల మతములు లేవు. సర్వావృత నేనే నేను. అందరిలో సూత్రాత్మగ యున్న నేనును తెలుసుకోవాలి. నిన్ను ఎరుగక ఎన్ని ఎరింగినా లెక్క పూర్తి కాదు. విశ్వాది మూలకారణ కర్త నీలోనుండియే నేనున్నానని గుర్తుచేయుచున్నాడు. మిధ్యా నేనును నైవేద్యముగ ఆత్మార్పణ చేసుకోవాలి. అప్పుడు వెంటనే సత్య నేను బోధపడుతుంది. పిపీలికాది పరమేశ్వర పర్యంతం సమస్త ప్రాణికోటిలో యున్నది నీవే. ప్రతిజీవి వికసించి తన సహజ స్ధితికి చేరక తప్పదు. మిధ్యా నేను అదృశ్యమైనపుడే సత్య నేను స్ఫురిస్తుంది. ఈ నేను దేనిచే బంధింపబడునది కాదు. సర్వ స్వతంత్రమై నేనుంటుంది. సమస్త దేవతలకు, దేవుండ్లకు మూలం ఈ నేనే. ఆత్మలకు ఆత్మగ ప్రకాశిస్తుంది. నేను పరిజ్ఞానం లేకుండ ఎన్ని తెలుసుకున్నను వృధా శ్రమయే మిగులుతుంది. ఈ నా, నేను లోనే సమస్తం యిమిడియున్నదని తెలుసుకోవాలి. నిన్ను నీవు ఎరుంగుటయే సర్వజ్ఞత్వం. నిన్ను నేవెరింగి నిన్నే బోధించు. ముందుగ నిన్ను నీవు సాక్షాత్క రించుకోవాలి. అపుడే సర్వాత్మ దైవదర్శన ప్రాప్తి. సైతాన్ మాయను లేకుండ చేసి జీవించినపుడే మానవజన్మ సార్ధకమౌతుంది. మాయలక్షణములు మానినపుడే మాధవత్వం సిద్ధిస్తుంది.<br /><br />నేనులేని వ్యక్తిగాని, శక్తిగాని, దేశముగాని, దేవుడుగాని లేడు. నేనున్నాను గనుకనే సమస్తం నా ప్రభావంతో నిలిచియున్నది. సర్వాధార, సర్వాకర్షణ శక్తికేంద్రం నేను. ఇట్టి నేను సకల నేనులుగ ఉండగలదు. నేను నేనుగ కేవలమై ఉండగలను. ఏ స్ధితిలోనైనను నా నేనుకు భంగంలేదు. నేనులేకుండ దేనికి స్వత:స్సిద్ధ ఉనికిలేదు. సమస్త శక్తులకు ఆదిమూలం నేనే. నన్ను మించిన సత్తులేదు. నేనే సచ్చిదానంద నిలయం. సకల నేనులు<br />సాక్షాత్ నా స్వరూపమే. అందులకే ప్రతి నేను నన్నుబోలి నడుచుకొనుచు, నా స్వరూప ప్రజ్ఞతో భాషించవలయును. అట్టి బోధకు తిరుగులేదు. ఈ భూమండల నిధులన్నింటిని దర్శించినను నిన్ను నీవు దర్శించక నిజముక్తి లేదు. సమస్త తీర్ధములు, క్షేత్రములు నాలోనివనెటి భావం స్ధిరపడిననాడు నన్ను మించిన పవిత్ర ఆలయం ఉండబోదు. జన ధనాకర్షణలతో పనిలేదు. ఆత్మ అసంగం, అనంతం. ఆకర్షణ వికర్షణలు ఆత్మస్ధితిలో నిలువవు. నిన్ను నీవు నిండుగ ఎరింగిన చాలు. ఎవరికి వారు ఆత్మదృష్టి కలిగి ఉండటమే మోక్షాలయము. ప్రతిబంధకములులేని నిర్వాణ నిలయమే నేనైన దివ్యత్వము. ఈ స్ధితిని దేహ వియోగమునకు పూర్వమే పొందవలసియున్నది. ఇది సజీవన్ముక్తి. అఖిలాండకోటి బ్రహ్మాండ, అనంత విశ్వగర్భ, శాశ్వత పరమ సత్య మూలమును నేనైయున్నాను. మేను-నేనులకు చాలా వ్యత్యాసం గలదు. సర్వాకారమే ఉనికిగల నేనుకు శరీర ధర్మాలు లేవు. ఏ నొప్పులు, రోగాలు, తప్పులు, ముప్పులు నేనుకు లేవు. ఇహపర సర్వలోకాలు నాకభిన్నములు. నేనులేని లోకంగాని, జీవంగాని, దైవంగాని లేదు. జగజ్జీవేశ్వరిహ పర సర్వనిలయుడనై నేనున్నాను. ఈ స్ధితియే జన్మ రాహిత్యం. సర్వం నాతో ప్రారంభించబడుచున్నది. నేనులేని మతముగాని, మతగ్రంధముగాని లేదు. ఎవరు ఏభాషలో ఎన్ని చెప్పినను నాకు చెందని, నాతో సంబంధంలేని బోధగాని, గురువుగాని, అవతారుడుగాని లేడు. ఇట్టి నన్ను విస్మరించి ప్రయాసపడకుందురు గాక! నిన్ను నీవెరింగిన నీవు అతడివయ్యెదవు. నేనే అతడినై యున్నానని ధృవ పరచుకో, ధృఢపరచుకో. సమస్త సుప్రబోధల సారం ఈ అతీత మహా సూత్రవాక్యంలో గలదు. నేనులేని అతడుగాని, అతడులేని నేనుగాని ఏనాడులేడు. సార్వకాలం స్వత:స్సిద్ధమై తనకు తానుగ ఉన్నదంతయు ఒకే నేను. ఇదియే <br />కేవలఖండ అచల పరిపూర్ణ సర్వకేంద్ర పిత చిన్మయ దైవనేను. <br /><br />సృష్టిలో ప్రతిదానికి ప్రయోజనం గలదు. మానవ జన్మ ప్రయోజనమును ముఖ్యంగా గుర్తించాలి.నేను ఎవరు అని తెలుసుకొనుటకు సహకరించునదే నిజమైన విద్య. ఆలోచనా నిమగ్నుల గావించి, స్పందింపజేయునదే నిజమైన విద్య. ఎవరు సమస్త కోరికలను భస్మము గావించెదరో వారి హృదయమే శివుడు, శివాలయం, చితాభస్మం, లౌకిక జీవితం అనిత్యమనుటకు గుర్తు. నేడో, రేపో వెనుక ముందు అందరు చనిపోయి, శరీరాలు బూడిదగావలసిందే. నుదుట ధరించే తిర్యక్సుండ్రాలు త్రిగుణాతీతులు అనుటకు ప్రతీకలు. శివుడు ఏనుగు శరీరాన్ని కప్పుకొన్నాడనిన సమస్త పశు ప్రవృత్తులను నిగ్రహించినాడని అర్ధం. కుండలినీ స్వాధీనపరచు కొన్నవాడే పరమ శివుడు, మహా యోగీశ్వరుడు. త్రిశూలం శివుని ముఖ్యాయుధం. ఇది త్రిగుణాలకు ప్రతీక. త్రిగుణాతీతుడైన పరమశివుడు సృష్టి, స్ధితి, లయ సం హారములను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. వృషభం దురహంకారానికి గుర్తు. అహంకారమును అణచినవాడే వృషభవాహనుడు. గరుడవాహనం ఆత్మ సాక్షికి వర్తిస్తుంది. నెమలి వాహన యనగా పవిత్ర ప్రేమకు చిహ్నం. ఇలా ప్రతి వాహన విషయంలో అంతరార్ధములుండును.శుద్ధ నిర్గుణత్వమే మేఘా రూఢుడు. అందరిలోను విహరించగల ఆత్మసాక్షి పరాత్పరుడు నక్షత్రములకు ఆవల పాదుకొని లేడు. భక్తవరేణ్యుల హృదయాంతరాళములలో గలడు. కఠోర దీక్షలు మాని భక్తిమార్గము నాశ్రయించాలి.<br /><br />భగవన్నామం వినినంతనే ఎవని దేహ మనంబులు పులకాంకితమగునో అతడే సత్య భక్తుడు. యోగ్యుడైన నాస్తికునకు, నిజమైన వేదాంతికి బేధం లేదు. నాస్తికునకు నేను పరిజ్ఞానం బోధపడిన చాలు. జీవకోటిలో అత్యుత్తమ స్ధానం మానవ జన్మదే. తినటం, త్రాగటం, కనటం, ఉండటం, బ్రతకటం అన్ని ప్రాణులకు తెలుసు. వాటికి లక్ష్యం లేదు. ఇదియే సృష్టి రహస్యం. భుద్ధి బలంతో, ఆలోచనా శక్తితో, విచక్షణా జ్ఞానంతో ఆ రహస్యాన్ని అణ్వేషించు. అది నీయందే గలదు. నీ లక్ష్యం నీ ఆధీనమై యున్నది. లోతుగ వెళ్ళి తరచి చూడు. తత్త్వమసి. నీవే ఆ పర:బ్రహ్మవు. సన్మార్గ జీవితం ముఖ్యం. ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు. దీర్ఘ జీవితం కన్న దివ్య జీవితం మిన్న. నాకు బాహ్య మందిరములకన్న హృదయాలయములు అనిన ఎక్కువ ప్రీతి. ప్రతి వ్యక్తి ఒక మహోన్నత మందిరముగ నిలవాలి. సమస్త నేనులకు నిలయమై నేనున్నాను. హెచ్చు తగ్గులు, రాకడ పోకడలు, జనన మరణములు నా నేనుకు ఏనాడు లేవు. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులను పంచి ఇవ్వ వీలున్నది. కాని నీ కర్మను నీవే అనుభవించవలసి యున్నది. కర్మ శేషము ఉన్నంతకాలం జన్మ శేషము తప్పదు. సమస్త ఔషధముల మించినది ఆత్మజ్ఞాన జీవామృతము. ఆత్మస్ధైర్యమే దివ్యశక్తి. మీరు నాకు దూరముగా ఉండి ఎన్ని సమర్పించినా ఆత్మ నివేదనతో సరిపోవు. మీరెచ్చట యున్నను సరియే, మీలో నేను గుర్తుండిన అంతేచాలు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లు ఎవరికి వీలున్న పరిధిలో వారు తమ మత ధర్మానుసారం సర్వకేంద్ర బాబా భావ నిమగ్నులు కండి. దీనికి మించిన భగవదారాధన లేదు. ఎన్ని సమర్పించినను నిన్ను నీవు సమర్పించుకొనక త్యాగం అనిపించదు. స్వపరిత్యాగమే స్వనిష్టకు దారియని మరువరాదు. నన్ను తెలుసుకొనుటకు ముందుగ నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవెరుగుటే నా దర్శన మార్గం. ప్రతి నీవు నేనై యున్నాను. ఈ ఆంతర్యం గ్రహించిన సమస్త ఉపదేశములు ఇందేగలవు. <br /><br />చిల్లర బూటక నాటకాలకు పైది భగవత్ స్ధితియని మరువరాదు. ఎవరి ఆత్మస్ధితిని వారు అనుభూతి పొందాలి. సహజమైన ఆత్మజ్ఞానాన్ని సులువుగ పొంద వీలున్నది. చేప పిల్ల పుట్టగనే నీటిలో ఈదుతుంది. అది దాని సహజ స్ధితి. అలాగే ఆత్మజ్ఞానము సహజసిద్ధమై యున్నదని మరువరాదు. దేహధ్యాసను మరిపింప జేయునవే దేవాలయములు. శారీరక, మానసిక రుగ్మతలను నివారించే నిజమైన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలుగ దేవాలయములు వర్ధిల్లవలయును. ఇదియే దేవాలయాల స్ధాపనలోని కీలక ఉద్దేశ్యము. కేవలం విగ్రహ ప్రతిష్టలతోనే ఆగిపోరాదు. బాహ్యారాధనలతోపాటు అంతరాత్మ ఆరాధన ముఖ్యం. జీవితంలో ఎన్ని కోల్పోయినను ఆత్మ విశ్వాసమును మాత్రం కోల్పోరాదు. కష్టాలు, బాధలే ప్రేమకు గీటురాళ్ళు. బాధలను భరించటంలోనే ఆనందంగలదు. శక్తికి, విజ్ఞానానికి, ప్రేమకు బాధలే గీటురాళ్ళు. ఆత్మానుభవమే పరమ వైభవం. మానవుని సంకుచితత్త్వం వలననే విభజన ఏర్పడినది. విశాల దృష్టియే ఏకత్వ లక్ష్యం. దేహధ్యాసను, దేహాభిమానమును నిరసించి, జీవన పరిధినతిక్రమించి, కేవల ఆత్మౌపమ్య భావనిష్టకు మించిన బ్రాహ్మణత్వం, బ్రహ్మత్వం లేదు. లౌకిక జీవనపరిధి నుండి అలౌకిక ఆత్మజ్ఞాన స్ధితిలోకి పరిణతి చెందటమే నిజమైన పునరుత్తానం. శుభచిత్తమే స్వర్గద్వారం. పరిశుద్ధ మానసమే ఉత్తమ తీర్ధం. పునీత హృదయమును మించిన పుష్కర స్నానము, పవిత్ర మానసమును మించిన పాపనాశనం లేదు. మానవ చైతన్యం సార్ధకం కావలయుననిన దానికి మూలమైన ఈశ్వరత్వమును గ్రహించి, దానిని తన ద్వారా అభివ్యక్తం చేయాలి. అనంత విశ్వమును కర్మ బద్ధముగ ఏకత్వంలో నడిపిస్తున్న సర్వెశ్వరునితో తాదాత్మ్యం చెందటమే నిజముక్తి. ప్రతి మానవుని జీవితం ఒకే కేంద్రాన్ని ఆధారం చేసికొని ఉంటుంది. అదియే పవిత్ర ప్రేమ కేంద్రం. <br /> <br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-53530846761521878382008-06-26T23:36:00.000-07:002008-06-26T23:37:15.236-07:00వేదాంతంఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు “అజ్ఞానమే” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి. అనగా అన్ని ప్రాణులలో ఉన్నది నేనే అనే విషయాన్ని అర్ధంచేసుకుని, అనుభూతి చెందాలి. అన్నీ తానే ఐనప్పుడు, అన్నింటిలో ఉన్నది తానే అని తెలుసుకున్నప్పుడు మరొకర్ని ఎలా బాధపెట్టగలడు? ఇతరులను ఎలా మోసం చేయగలడు? నీవలెనే నీ ఎదుటివారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయని గ్రహించగలిగితే వారి ఆశలను అడియాశలు చేయలేవుగదా! అంతటి ఉన్నతమైన స్ధితికి మానవుని ఆలోచనా విధానం ఎదగాలి. ఈ విషయం బాగా అర్ధమై వంటబట్టాలంటే మనం ఎల్లప్పుడూ సాధన చేయాలి. అంటే, సదాచారము, మంచి మంచి పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం, సజ్జన సాంగత్యం లాంటివి చేయాలి. మంచి ఆలోచనలు చేస్తూ, పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి. <br /><br />వేదాంతం అనగానే కంగారుపడవలసిన అవసరంలేదు. నిన్ను నీవు తెలుసుకోవడమే వేదాంతం. నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్యలు విజ్ఞానాన్ని, ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తే ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదు. చివరకు అప్పుడైనా ఆత్మ విద్యను ఆశ్రయిం చక తప్పదు. కాబట్టి లౌకిక విద్యలతోపాటు ఆధ్యాత్మిక విద్యను, అంటే నీ అసలు స్వరూపాన్ని నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం. <br /><br />వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది.<br /><br />వేదాంతసారమును సంక్షిప్తముగ చెప్పాలనిన “అజ్ఞానిగ ఉండిన జీవుడు – సుజ్ఞానిగ నిలిచిన దేవుడు. భ్రమలో ఉండిన జీవుడు – భ్రమలుడిగిన దేవుడు. సాకారుడైన జీవుడు – నిరాకారుడైన దేవుడు. శరీరభావన గలవాడైన జీవుడు – అశరీరాత్మ భావన గలవాడైన భగవంతుడు. సంకుచిత పరిధిలో జీవుడు – సర్వాత్మ స్ధితిలో దేవుడు. వ్యష్టిగ ఆలోచించిన జీవుడు – సర్వ సమిష్టి భావముతో దేవుడు. పలికినంతసేపు జీవుడు – పలుకులేనివాడే దేవుడు. పూనక శిగములు ఊగినంతకాలం జీవుడు – ఊరకుండిన (అచలం) దేవుడు. చూచినంతకాలం జీవుడు – చూడబడేవాడు దేవుడు. చపల చిత్తుడు జీవుడు – స్ధితప్రజ్ఞుడు దేవుడు. మాయాలోలుడు జీవుడు-మాయాతీతుడు దేవుడు. ఖండ దృష్టిలో జీవుడు – అఖండ దృష్టిలో దేవుడు. ద్వైత దృష్టి లో జీవుడు – అద్వైత స్ధితిలో దేవుడు. కావున మనం ఏ అంతస్తులో ఉన్నామో తెలుసుకోవాలి. <br /><br />వేదములయొక్క అంతమును “వేదాంతము” అందురు. ఇది ఆధ్యాత్మిక రంగంలో జ్ఞాన కాండ. యజ్ఞ, యాగ, క్రతు కర్మలన్నియూ చిత్తశుద్ధికి తోడ్పడి, ఆధ్యాత్మిక స్ధితికి చేర్చే సోపానములు మాత్రమే. సమస్త యుగజగంబులు, సర్వలోకములు, సమస్త భక్తులు, సమస్త ముక్తులు, సమస్త శక్తులు, సమస్త ప్రాణులు, సమస్త దేవులు, సమస్త కాలములు, సృష్టి, స్ధితి, లయ, పరమాణువు మొదలు పరమేశ్వర పర్యంతం సర్వ సమిష్టిగ గాంచినపుడే “నేను” బోధపడగలదు. తెలుసుకో… తలుసుకో… కలుసుకో… ఆత్మ విషయంలో తెలుసుకోవటం, దర్శించటం ద్వైతం. ఆత్మ తానని గ్రహించటం అద్వైతం. తానైన ఆత్మయే సర్వ భూతాంతరాత్మ యనెటి ఆత్మౌపమ్య భావనిష్ట నొందుటయే కేవలాద్వైత పూర్ణ స్ధితి. ఇదియే వేదాంతసారం. <br /><br />ఒకనాడు వేదములు, ఉపనిషత్తులు, తత్త్వ శాస్త్రము, వాస్తు శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము మున్నగు విద్యలు అతి రహస్యంగా ఉంచబడినవి. కొద్దిమంది వేద పండితులు, విద్వాంసులు, సిద్ధాంతుల గుప్పిట్లో బంధింపబడి, వారు ఏది చెబితే అదే వేదంలా చెలామణి అయ్యేది. కాని నేటి కంప్యూటర్ యుగంలో ప్రతి శాస్త్రము బట్టబయలు గావింపబడినవి. ఒకనాడు మునీశ్వరులు ముక్కుమూసు కొని అడవులలో సంవత్సరాలకొద్ది తపస్సు చేసేవారు. కాని ప్రస్తుతం సమాజంలో చాలామంది ధ్యానం, యోగం, వ్యాయామం లాంటి శరీరక, మానసిక ఆరోగ్యప్రదాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, అనేక ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఆత్మోద్ధరణ నిమిత్తం పాటుపడుతున్నారు. మనమూ అదే మార్గంలో పయనించి మన నిజస్ధితిని గ్రహించాలి.<br /><br />ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గం కొంతమందికే అందుబాటులో ఉండేది. కాని నేడు అధికశాతం ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించి, ఫలితాలను సాధించాలని తాపత్రయపడుతున్నారు. దేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు. ఫ్రతినిత్యం ప్రాత:కాలంలో కొన్ని టి.వి. చానళ్ళు, మరియు సంస్కృతి చానల్ రోజంతా ఆధ్యాత్మిక గురువుల, స్వామీజీల, ఆధ్యాత్మికవేత్తల బోధనలను, దివ్య సందేశములను ప్రసారం చేస్తున్నాయి. నేటికాలంలో దాదాపుగా అన్ని వార్తాపత్రికలు ఆధ్యాత్మిక విషయాలపై విస్తృతమైన సమాచారాన్ని, సమగ్రమైన సందేశాలను అందజేస్తు న్నాయి. <br /><br />ఆత్మపరిజ్ఞానముపై అభిరుచిగల చాలామంది జిజ్ఞాసువులు వివిధ సాధనా ప్రక్రియలద్వారా ఆత్మదర్శనం చేసుకొని నేను పాంచభౌతిక దేహమును కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడను అనే స్ధితికి రావడం నిజంగా సంతోషించదగ్గ శుభపరిణామం అని చెప్పవచ్చు. వ్యక్తులు, సంస్థలు ఎవరికి వీలున్నపరిధిలో వారు ఆధ్యాత్మిక శిక్షణలనిస్తున్నారు. తమ అధ్యాత్మిక సాధనానుభవాలను గ్రంధరూపంలో ప్రచురించి అనేకమంది జిజ్ఞాసులకు అందజేసి ఆత్మోధరణకై అహర్నిషలు కృషిచేస్తున్నారు. మనవంతు సాధన మనమూ చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మలో లీనమౌదాం. <br /><br />నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-34801398950270608202008-06-22T22:55:00.000-07:002008-06-22T22:57:27.711-07:00దైవ అనుభూతిసత్యాన్వేషణ బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. సత్యాణ్వేషణ నిమిత్తం అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అవసరంలేదు. ప్రతిదినము వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సలుపవలయును. ఇక కర్మ క్షేత్రంలో ఏ ఆటంకములు, విఘ్నములు ఏమి చేయలేవు. క్రమంగ సర్వత్ర ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఈ దశలో అంతయు యోగశక్తిగ మీ పనులు సాగిపో గలవు. అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు. మిధ్యా నేనును, సైతాన్ భ్రాంతిని వదలాలి. ఇది అసలైన సన్యాసం, పరివ్రాజక స్ధితి. ముందుగ నిన్ను నీవు సన్యసించుకో. నిన్ను విసర్జించిన అసలైన నేను శేషిస్తుంది. ఆ నేనే సర్వలోకములకు వెలుగు. ఇదియే విశ్వగర్భ దైవ నేను. సంకుచిత, పరిమిత నేను అంతర్ధానమైనపుడు ఆత్మ కేంద్రంలో నిజమైన సత్య దైవ నేను వెలుగును. అరణ్య మధ్యంలో యున్నను కల్లోలిగ మనసుకు శాంతిలేదు. ఎటు వ్యవహరించినా శిరస్సును ప్రశాంతంగ ఉంచినచోట ఏకాంతం మానసికా వస్ధ. సర్వకాలాలకు చెందిన సత్యాత్మ స్వరూప స్వభావమే నిజముక్తి. ఇది ఫలానా వారికనే నిబంధనలేదు. మనో పరిపక్వత ననుసరించి ఎవ్వరైనను పొందవీలున్నది. ప్రతివారి చరమ లక్ష్యం ఇది. మోక్షానికి అడ్డు నిలిచే మిధ్యా నేనును తొలగించాలి. మానసిక అభ్యంతరాలు రహితం కావాలి. పరిస్దితుల మార్పుకన్న మనో మార్పు ముఖ్యం. ఈ మారు మనసే ఆత్మదర్శనకారి. ఏ వ్యక్తిగాని బహిర్గతమైన ప్రవర్తనవల్ల హక్కులను పొందలేడు. అతనెంతవరకు సత్యస్వరూపుడో అంతవరకే అతని హక్కులు పరిమితమై యుండును. అతని సత్యానికి కొలబద్ద అతని చైతన్యమే. ఈ చైతన్య స్వాతంత్ర్యము పొందడానికి ప్రతివ్యక్తి తన క్షుధ్ర అహమును విసర్జించాలి. గీతాసారమంతయు ఇందులోనే గలదు. <br /><br />భారతీయులు భావించి, భాషించే అనంతం అనేది లోన సరకులేని శూన్యం కాదు. అనంతుని ఈ జీవితంలో తెలుసుకోవటమే ముక్తి. అన్నిట, అంతట ఆ విశ్వ విధాత స్వరూప స్వభావమును గుర్తించటమే నిజమైన దృష్టి. శైశవదశ లోని పిల్లలకు నడక నేర్పునట్లు యాత్రలన్నియును సదుద్దేశ్యముతో ఏర్పరుచ బడినవే. ఐనను అవియే సర్వస్వములు కావు. యాత్రలతో ఆగిపోరాదు. భూలొక యాత్రలన్నియును కర్మకాండలోనివే. ఆపై ఉపాసన, జ్ఞాన కాండలు గలవు. త్రికాండముల మీరినపుడే పరిపూర్ణ సిద్ధి. అంతొ ఇంతో గొప్పతనము, మహిమ, ప్రభావం లేనిదే లక్షలమంది యాత్రలు చేయటం ఎందుకని అనేవారుంటారు. అది నిజమేగాని “యద్భావం తద్భవతి” యన్నట్లు ఎవరి భావన ఎట్లుండునో బయట అలాగే కనిపిస్తుంది. అలాగే జరుగుతుంది. యాత్రలు చేయువారు దైవ భావనతో వెళ్ళెదరు. అదే ప్రభావం చూపుతుంది. ఆందరి వ్యక్తుల దైవభావం ఎక్కడ కేంద్రీకరించబడునో అక్కడ అమోఘ ప్రభావం గోచరించును. యాత్రలన్నియును ఒకింత ఆధ్యాత్మిక మార్గ సాధనలేగాని, జన్మ రాహిత్య సిద్ధి తన్ను తా తెలియక ఏ యాత్రలలో లేదు. అలాగని యాత్రలు నిరర్ధక ములు, చేయరాదని కాదు. అవి ప్రాధమిక దర్జాలని తెలియాలి. ఆ అంగడి గోలలు తగ్గించి మౌన ప్రకాశమును దర్శించవలయును. ఈ భూలోకంలోని సర్వమత సంబంధ క్షేత్రములు, యాత్రలన్నియును ‘నేను’ యనెటి కేవలఖండ ‘దైవ నేను’ ఉనికిలోనివేనని తెలియాలి. మీరు చేయు యాత్రలు మీలో పరివర్తన తేవాలి. దుష్ట తలంపులను విసర్జించి దివ్య భావ శక్తి ప్రేరణతో ఇల్లు చేరాలి. అంతేగాని తల నీలాలు ఇచ్చి రాగానే సరిపోదు. చివరకు సంచారముల బందుచేసి నిలుకడపొంది, తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే భారతీయుల విగ్రహారాధనలోని అమోఘ రహస్యము. ద్రోణాచార్యుని విగ్రహమును సజీవమూర్తియైన ఆచార్యునిగ నిలుపుకొని ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుని మించిపోయాడు. ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే విశ్వేశ్వరుడు బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరనెటి క్రీస్తువాణి సత్యము. విద్యార్ధులందరు పాఠశాలలో ఎవరి మేధాశక్తి ననుసరించి వారు చదివినా చివరకు ఐ.ఏ.ఎస్,, ఐ.పి.ఎస్., కోర్సులలో చేరుటకు ప్రతిభయే ప్రధానం కావున చాలామంది తప్పిపోయి ప్రవేశ పరీక్షలోనే ఆగిపోగలరు. అతి మేధా సంపన్నులే పై చదువులకు ఎంపిక కాబడునట్లు యాత్రలెన్ని చేసినను, అతిమానస భూమిక నధిరోహించి మోక్ష సిద్ధికి అర్హులైనవారి సంఖ్య స్వల్పాతి స్వల్పమని విజ్ఞులు గ్రహించాలి. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త భగవంతులు నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి అఖండ భావ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. జీవాత్మకు వినాశం లేదు. శక్తి పూరించబడునది తగ్గేది కాదు. శక్తి నశించదు, చావదు. హెచ్చు తగ్గులు దీనికి లేవు. <br /> <br />సప్త జ్ఞాన భూమికలను అధిరోహించటమే నిజమైన సప్తాహం. ఏడుకొండలపైనున్న సప్తగిరి వాసుడు తిరుమల వేంకటెశ్వర స్వామి దర్శనం. దీనికి మరియొక ఆంతర్యం సహస్రార ప్రవేశం. భేద భావము ఎంతమాత్రం కానరానిదే నిష్కళంక ప్రేమ. ఈ ప్రేమవల్ల ఆత్మ తన పరిధులను దాటి అనంతంవైపు పయనించి, పరిపూర్ణతను సిద్ధించుకుంటుంది. ఇట్టి మహత్తర ప్రేమశీలురకు శరీరధారులమనే దృష్టి అంతరించి, సర్వాంతర్యామితో తమకు అతి సన్నిహితమైన సంబంధముగలదని నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ స్ధితికి ఎదగాలి. ఐక్యత, ఏకత్వము అనెటి భావము మానవ ఆత్మలో సదా ప్రచురితమయ్యే యున్నది. ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ కుమారుడు నీ ఆత్మయే గనుక ప్రేమించుచున్నావు. మమాత్మా సర్వ భూతాంత రాత్మ. ఈ ప్రేమే కొత్త శక్తిని, అంతర్దృష్టిని, మానసిక సౌందర్యాన్నిస్తుంది. మనసు వ్యాకోచము చెందగలిగినంత మేర సౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే దోహదం చేస్తుంది. ఆత్మ జ్యోతియొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. శిశువు తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.<br /><br />మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుంది. అజ్ఞానియైన మానవుడు తన కోర్కెలలో కూరుకుపోయి అట్టి ఊబిలో నుండి బయటికి రాలేకపోవుచున్నాడు. ఇదియే కడు దౌర్భాగ్యము. ఈ దీన, హీన స్ధితినుండి బయటపడుటకే యిన్ని రకముల అర్చన, ఆరాధన, ప్రార్ధనాలయములు కావలసి వచ్చినది. ఎవరి మానసిక స్ధాయి, అభిరుచి ననుసరించి వారి ఆరాధన క్రియలుండును. మానవాత్మ దైవార్పితమైనపుడు తన ద్వారా దైవేచ్చ ధరణిపై క్రీస్తువలె నెరవేరుతుంది. శ్రీరామచంద్రుడు తాను బోధించిన ఆత్మజ్ఞానము ఆంజనేయునిలో ఎంతవరకు సఫలమైనదో గ్రహించనెంచి ప్రశ్నించినపుడు హన్మంతుని సమాధానము: 1. దేహ బుద్ధ్యా దాసోహం 2. జీవ బుద్ధ్యా త్వదంశకం 3. ఆత్మ బుద్ధ్యా త్వమేవాహం. ఇది విని రాముడు సంతసించి నీకిక చెప్పవలసినది ఇంకేమియును లేదనెను. మీలో ఎవరు ఏదశలో ఉన్నారో పరిశీలించుకొని ఆత్మ బుద్ధ్యావతరణ గావించుకో వాలి. సమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వెలుగు మనసుకు వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. ఈ వాక్యంలోని ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు ముక్కుసూటి దారి.<br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-12327998444165252862008-06-18T23:15:00.000-07:002008-06-18T23:18:32.909-07:00దైవ నేనుఆత్మే దేవుడు. నేనున్నాను అనేది భగవంతుడు. ఆత్మను తెలుసుకోవడానికి సులువైన మార్గం ఏమనగా, సకలేంద్రియముల సంచలనాన్ని నిలిపి తాను తానుగ ఉండడమే ఆత్మ విద్య. గాఢ నిద్రలో దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలో నీవు నిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే. <br /><br />తలంపులున్నంత కాలం ప్రయత్నం తప్పదు. ఇతర తలంపులను ఎగురజిమ్మిన నేను నేను అంటూ ఆత్మ భాసిల్లటం తధ్యం. దీనిని ఏ పేరుతో పిలిచినా తేడా రాదు. ఎల్లప్పుడు ఏ ప్రయత్నం లేకుండ అందేది జ్ఞానం. ప్రయత్నమే ఉపాసన. జ్ఞానమనునది లక్ష్యం. ఫ్రయత్నములన్నియును ఈ లక్ష్యం యొక్క స్వరూపాలే. ఆత్మ సదా నేను నేను అంటూ ఉంటుంది. అంతరింద్రియ పంచకముగాని, బాహ్యేంద్రియ పంచకముగాని, స్ధూలభూత పంచకముగాని ఆ మహా సత్తా కన్న భిన్నంగాదు. సముద్ర నామముగ సముద్ర జలము అంతట యున్నట్లు అలలుగ కొద్ది భాగము, నురుగుగ కొద్ది భాగము, బుడగగ త్వరలో లయించిపోవునట్లు గ విశ్వ విరాడ్రూప తేజోమయ చేతన సత్తా సదా ఉనికిని పొందును. దేవ, తిర్యగ్మనుష్య, పశు పక్ష్యాదులుగను, జనన మరణములుగను, పాప పుణ్యము లుగను, శుభాశుభములుగను, నామ రూపములుగను, గురు శిష్యులుగను, జీవేశ్వరులుగను, నిత్యానిత్యములుగను తోచుచు ఒకటి శాశ్వతమని, మరొకటి క్షణికమని చెప్పబడుచున్నది. <br /><br />ఆత్మలేని భగవంతుడుండడు. ఆత్మే దేవుడు. నేను ఆత్మనై యున్నాను. కృష్ణుడు అర్జునునికి జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను. శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర ధ్యాస వచ్చినచో నీవు వేరు, భగవంతుడు వేరు. ఆత్మ జ్ఞానంతో అతడే నీవు. చూచేవాణ్ణి చూడ నేర్వాలి. అప్పుడు సమస్యలన్ని మాయమగును. నాది అన్నపుడు నీవు, శరీరం వేరే అవుతుంది. అలాగే నా శరీరం అన్నపుడు నీవు శరీరం కాదు. నీవు వేరే, శరీరం వేరేయని అర్ధం. నా ఇల్లు అన్నపుడు నేను ఇల్లుకాదు. ఇల్లు నాకు వేరుగ యున్నది. అట్టి నీలో వైకుంఠం, కైలాసం, స్వర్గం, ముక్తి, మోక్షం, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు నీలోనివారే. సమస్త లోకాలు భావనలే. వాటికి కర్తవు నేవే. అన్నో కల్పిత సత్యాలు. బహురూపములుగ భాసిల్లుచున్నది ఒకే విశ్వరూపం. ఆ వైకుంఠపురం నీలోనిదే. <br /><br />చూచే నేనును చూచేవారు ధన్యులు. నేనును (శరీరం) చూస్తూ అసలు ‘నేను’ను విస్మరించరాదు. శరీర భ్రాంతిని వీడి నా ‘నేను’లో విశ్వసించి నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది. ‘ఆ నేనే’ సర్వమయం, సర్వప్రియం, సర్వలయం, సర్వాధారం, సర్వాధిష్టానం, సర్వోన్నతం, సర్వ స్వతంత్రం, నిష్క్రియం, నిష్కళంకం, నిత్యపూజ్యం, నిత్యశుద్ధం, నిర్గుణం, నిర్ద్వంద్వం, నిరామయం, నిర్వాణ నిలయం, నిష్ప్రపంచం, కేవలచల పరమాద్వైతం, పరాత్పరం, పరిపూర్ణ పరబ్రహ్మం. <br /><br />ఎంతటి పామర లౌకిక చిత్తులైనను ఏదో ఒకనాడు సంఘటన, సమస్యల ప్రభావంతో ఆధ్యాత్మిక జీవనమును కోరక తప్పదు. ప్రతి జీవి ఘనీభ వించిన మోక్ష స్వరూపమే. కాల పరిపాకమున ప్రతి పిందె కాయగ, పండుగ మారగలదు. పామర చిత్తులే పూత. ఫరిపక్వ హృదయులే ఫలములు. లేవండి! అలౌకిక దైవరాజ్యమును వెదకండి. అది బయట లేదు. మీలోనేగలదు. ఆత్మ విశ్వాసులై అఖండ దైవ సామ్రాజ్యమును మీలోనే స్వస్వరూపముగ దర్శించనేర్వండి.<br /><br />సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, సురులు అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, బాబాలను, స్వాములను, మాతలను, సమస్త దైవావ తారముల ఏకావస్ధలో, ఏకాత్మస్ధితిలో నిలిపి గాంచినపుడే నీ నిజస్వరూ పం బట్టబయలుగ గ్రాహ్యమై అనుభూతి కాగలదు. మనసు చైతన్యమై, పరిపూర్ణమైన బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మానసమే పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో సుషుప్తి అనుభవమే సమాధి. నేను అనే అహం మూలంలో అణగిపోయినపుడు ఎంతకాలమైనా ఆత్మయొక్క అవిచ్చిన్న పరిపూర్ణ ఆనందమును అనుభవించవచ్చు. ఆతడు ఏదశలోయున్నను లక్ష్యం నుండి వైదొలగడు. <br /><br />ఆత్మనుండి ఉద్భవించిన ప్రాణమును తిరిగి అందులో లయపర్చటమే ప్రాణా యామము. నిఘావేసి పరిశీలిస్తుంటే తలంపులన్ని ఎగిరిపోగలవు. పూర్ణశాంతి తప్పక లభ్యమౌతుంది. అదియే నీ స్వరూపం. మనస్సును నిస్సంకల్పముగా ఏకాగ్రపరచుటయే మనోలయ ధ్యానం. అనంత చైతన్య స్రవంతి నీ స్వరూపం. ఈ జ్ఞానం సమస్తం స్పష్టంకాగలదు. శాస్త్రాలను మించినది ప్రత్యక్షానుభవం. నీలో నిన్ను లోతుగ వెళ్ళి తరచి చూచుకో. ఇదియే అసలైన మార్గం. మిధ్యా నేనుతో ఏకత్వం విడనాడవలయును. సంకల్పాల సమూహమే మనస్సు. అన్నియును మిధ్యా నేను తలంపులపై ఆధారపడియున్నవి. అందులకే ఈ నేను యొక్క జన్మస్ధానం అన్వేషిస్తే మిధ్యా అహం తలంపు అంతరించి, అదృశ్యమై నిజమైన నేను నిర్విరామంగ స్వయంప్రకాశమై తేజరిల్లుతుంది. సమస్త ముక్తి మార్గములకు నిలయమిది. నిజమైన నేనే దైవం. ప్రతి నేను దైవ నేను స్వరూపమేనని గ్రహించవలయును. <br /><br />ఆనందం బయట విషయాలలో లేదు. ఉన్నదని తలంచినా అది క్షణికం. ఆత్మలో నిజమైన ఆనందం గలదు. అందులకే ఆత్మానందులు కండి. బాహ్య విషయాలను స్మరిస్తూ ఉన్నంతకాలం మనసుంటుంది. అందులకే అంతర్దృష్టిని అలవర్చుకొని ఆత్మదర్శనం పొందనేర్వాలి. మనో నిలకడ పొందగనే దీని ఆట ఆగుతుంది. ఇక పాడే పాట నేను నేనే నేనైన సత్య దైవ నేను. ఇది తగ్గేది కాదు. హెచ్చేది కాదు. ఆత్మే హృదయం. ఈ స్ఫురణతో మానవుడు ఉండాలి. హృదయమునుండి వెలుగు మెదడునకు ప్రసరిస్తుంది. ఇదే మనసుకు స్ధానం. ఈ వెలుగు సహాయంతో మనసు ప్రకాశించుచు ప్రపంచమును చూస్తుంది. ఆత్మ ప్రకాశ పరివర్తనతో మనసు పనిచేస్తుంది. మనసు అంతర్ము ఖం కాగానే ఆత్మ తేజం ప్రవాహంగ వెల్లువై ప్రవహిస్తుంది. నేను అనే ప్రధమ సంకల్పమునుండి మనసును వేరుచేసి, దాని మూలమైన ఆత్మలో లయపరచిన మిగిలేది ఆత్మే. అదియే సత్య నేను. బాహ్యాంతర చైతన్యంగ నిలచిన వెలుగే పర:బ్రహ్మం. <br /><br />విచక్షణ కలిగించే ఆలోచన మనసులోని దీపం. ఈ దీప దర్శనమే పాపనాశనం. పండుగల వెనుకగల కీలక రహస్యం తెలుసుకో. సత్యం సర్వత్ర నిండియున్నది. మానవుడు తన చైతన్యాన్ని విస్తృతపరచుకొని పరిసరాలతో తాదాత్మ్యం పొందుచు తన అంతరంగ శక్తులను విశ్వాంతరంగ శక్తులతో సమన్వయ పరచుకోవాలి. వ్యక్తి తన మనో తేజాన్ని తన కార్యకలాపముల వరకే కేంద్రీకరించు దశలో వ్యక్తికి, విశాల విశ్వానికి మధ్యన అగాధం ఏర్పడుతుంది. ఇది సరియైన ఆలోచనా విధానం కాదు. కేవలం అవగాహనా లోపం మాత్రమే. దీనివలన కృత్రిమమైన ఎడబాటు ఏర్పడుతుంది. విశ్వం లోని మానవుడు పరమ సత్యంగా ఆవిర్భవించాలి. వ్యక్తి శక్తి విశ్వావృత అనంత శక్తితో మిళితమైనపుడు సాధించలేనిది సృష్టిలో ఉండదు. కేవలం శాస్త్ర జ్ఞానంతో సృష్టిని కొలవాలని ప్రయత్నంచేసే మానవునకు, ఆధ్యాత్మిక దృష్టిగల మానవుడు గాంచగల దివ్యదర్శనం కాదు. విశ్వ గురుత్వము వహించిన భారతీయుని దృష్టిలో ఉదయించే సూర్యుడు, వీచే గాలి, పూసే పూలు, ప్రవహించే జలము, ఫలవంతమైన భూమి పవిత్ర అంశాలుగ భాసిల్లును. ఉప్పునీటిలో తేలికగ కరిగిపోవటానికి కారణం అది దాని సహజ స్వరూపము. అలాగే మనసు దాని సహజస్ధితియైన ఆత్మలో లయించగలదు.<br /><br />బాహ్యాకారమునుబట్టి కాదు విలువ. లోన సరుకు, సత్తా ఉండవలయును. మానవుడు తన అంతర్గత శక్తులను మరిచి పైకి కనిపించే శరీరంవరకే తనదని భావించి ఆ పరిధివరకే మురిసిపోతున్నాడు. అనంత స్వరూపంతో తన అనుబంధాన్ని ఎంతమాత్రం స్ఫురణకు తెచ్చుకోవడం లేదు. అందులకే సాగరమునుండి వేరైన జలబిందువు వలె క్రుళ్ళిపోవలసి వస్తుంది. ఇకనైనా సర్వాత్మ దైవ మహా సాగరంలో గ్రుంకులిడాలి. అదియే మీ సహజస్ధితి. అణువునుండి అనంత పర్యంతం చిన్మయ పరతత్త్వ అంశమే గనుక భిన్నదృష్టి ఏనాడు తగదు. ఏందరో స్ధితప్రజ్ఞులు, అవధూతలు, సర్వసంగ పరిత్యాగులు, సాధువులు, వివేకవంతులు, విజ్ఞానవంతులు, ఉత్సాహవంతులు, నీతికోవిదులు, రాజులు, రారాజులు, ఎంకెన్ని తరహాలవారున్నను మహర్షులకే భారతదేశంలో ప్రధమ పీఠం. ఆత్మానుభూతిపొంది, నిస్వార్ధ చిత్తులై అన్నింటితో తాదాత్మ్యం చెంది, విశ్వజీవనంలో ప్రవేశించినవారే మహర్షులు. సర్వవిధములైన చైతన్యముతో సంబంధముగలిగి ఉండటమే మానవత్వానికి పరమావధి. ఇదియే జీవన్ముక్తి మార్గమని భారతీయుల ప్రగాఢ విశ్వాసము. ఇది అక్షరాల సత్యము. <br /><br />సర్వ పరిపూర్ణ దైవజ్ఞానికి ప్రత్యేకించి యనకుండ సమస్త ప్రాణులపట్ల పవిత్ర ప్రేమానురాగములు గోచరిస్తాయి. కేవలం ఆలయాలలోనే గాకుండ విశాల విశ్వంలో ఎక్కడ చూచినా అక్కడ పూజార్హమైన వస్తువు గోచరిస్తుంది. పవిత్ర ప్రేమకు అసహ్యమనునది లేదు. నీ శక్తిని దైవ శక్తితో జోడించి చూడు. ఎవడు శాశ్వతుడో, సర్వ పరిపూర్ణుడో, సర్వోన్నతుడో, ఎవని శక్తిచే సూర్యుడు చైతన్యవంతుడై ప్రకాశించు చున్నాడో, ఎవని మూలమున పంచభూతములు, గ్రహమండలములు చలించుచున్నవో అట్టి సర్వకేంద్ర స్వామి నీలో అంతర్యామిగ ఉన్నాడు. ప్రాణవాయువు సర్వాంతర్యామి స్వరూపమే. అందులకే ఈ కాంతి, ఈ ప్రాణము, ఈ సర్వము మన ఆత్మలో అంతర్లీన మై ఉన్నవని ప్రతివారలు భావించవలయును. <br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-12459906600519490632008-06-17T01:38:00.000-07:002008-06-17T01:39:45.640-07:00పర్యావరణ పరిరక్షణమాట కల్తి మనసు కల్తి<br />నీరు కల్తి బీరు కల్తి<br />మానవ ప్రాణంబు నిలిపె <br />మందులలో మరీ కల్తి<br /><br />బియ్యంలో రాళ్ళాయె<br />పాలల్లో నీళ్ళాయె<br />అన్నంలో సున్నమాయె<br />అన్నిట అనుకరణలాయె<br /><br />నీడనిచ్చె చెట్టుగొట్టి<br />గోడకు దిగ్గొట్టినావు<br />అడవంతా నరికివేసి<br />కాలుష్యం బెంచినావు<br /><br />జనాలుండె ఇళ్ళల్లో<br />రసాయనాల పొగలాయె<br />భూగర్భ జలమందున<br />మందుల వ్వర్ధంబులాయె<br /><br />భూమాత గుండెల్లో<br />బోరులెన్నొ గుచ్చి గుచ్చి<br />జలమంతా లాగినావు<br />భూకంపం దెచ్చినావు<br /><br />లెక్కలేని వాహనాలు <br />ఒక్కసారి రోడ్డునెక్కి<br />గుప్పు గుప్పుమను పొగలతొ<br />కాలుష్యం చిమ్ముచుండె<br /><br />ఉత్తచేతులు ఊపుకుంటు<br />సరుకులకై సంతకెల్లి<br />పలు ప్లాస్టిక్ సంచులతో<br />పరుగులెత్తి ఇంటికొచ్చి<br />పర్యావరణం పాడుజేసి<br />పాపం మూటగట్టినావు<br /><br />నాగులవంచ వసంతరావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6968290648846252467.post-76090186157199275912008-06-16T00:07:00.000-07:002008-06-16T00:09:34.990-07:00స్వనిష్ఠఅష్తాదశ పురాణములను, సర్వమత శాస్త్రములను, రామాయణ, భారత, భాగవత గ్రంధములను, వేదోపనిషత్తులను కంఠస్ధం గావించినను స్వనిష్ఠనొందక శాంతిలేదు. తనను తాను తెలియని పఠనలు వ్యర్ధం. నిన్ను నీవు తెలుసుకో! అప్పుడే సమస్తం బోధపడగలదు. నీ నిజస్ధితి యే ఈశ్వరత్వము. వాచా పరిజ్ఞానముతో సరిపెట్టుకొనక దానికి తోడు అనుష్ఠాన వేదాంత భాస్కరులు కావాలి. ఆచరించి చెప్పడమే ఆచార్య ధర్మం. కనిపించే మురికిని సబ్బు నీటిచే శుద్ధిచేయ గలరు. బయటికి కనిపించని మనో మాలిన్య శుద్ధి నిమిత్తం జప, తప, ధ్యాన, నియమ నిష్ఠలు, సాధనలు, శాస్త్రములు వెలసినవి. ఆచరణ సాధ్యమైన శాస్త్ర పరిజ్ఞానము ధన్యము. సమస్త శాస్త్రముల సారాం శము స్వనిష్టయని తెలుసుకోండి. మస్తకశుద్ధికి మించిన పుస్తక పఠన లేదు. చిత్తశుద్ధిని కలిగించలేని శాస్త్రపఠనలు కాల యాపనలు – కంఠశోషణలు. భాహ్యార్చనలను క్రమముగా తగ్గించు కుంటూ మానసిక పూజలో నిలువనేర్వండి. హృదయమందిర ధ్యానము విశిష్టమైనది. చిత్తశుద్ధికి, ఆత్మనిగ్రహమునకు తోడ్పడు వేదవిదిత సత్కర్మలను చేయవలయును. డేహము, ఇంద్రియములు, మనసు ఒకదానికంటె మరియొకటి బలమైనవి మరియు ప్రమాదకారులు. కనిపించే దేహేంద్రియ కర్మలకు కనిపించని చోరుడు మనసు కర్తగ ఉంటుంది. ఇట్టి మనసు కల్మషముగ ఉండిన సర్వం నాశనం కాగలదు. <br /><br />స్ధితికుదురని ప్రారంభదశలో సాధకులు బాహ్య ప్రపంచమును బాహ్యంగానే ఉంచవలయును. శబ్ధ, స్పర్ష, రూప, రస, గంధ విషయాలను త్యజించగలగాలి. పడవ ఎంతకాలం నీటిలో యున్నను ప్రమాదం లేదు. నీళ్ళు పడవలోనికి ప్రవేశించిన నావ మునిగే ప్రమాదం గలదు. బాహ్య విషయాలను మనసులో నిలుపుకొనిన అంతే. మనోంతర్గత సూక్ష్మ ప్రపంచ వింతలు, అద్భుతములు విచిత్రముగ ఉండును. కాలపరిమితి తీరగనే అద్దె ఇంటిలోనివారిని ఇంటినుండి ఖాళీ చేయించు నట్లు, మనసులో నిలుపుకొనిన దుష్ట సంస్కారములను అలా బయటికి నెట్టాలి. వ్యష్టి మనసు బలం చాలనిచో విశ్వమనో సాగరుడైన విశ్వేశ్వర స్వామిని చేతులు జోడించి శరణుజొచ్చాలి. రాగ ద్వేషములు ఉండిన చిత్తంలో శాంతి నిలువదు కాబట్టి శత్రువును ఇంటినుండి మెడలుపట్టి బయటికి నెట్టునట్లు బాహ్య విషయాలను చిత్తంలోనుండి బయటికి పంపించవలయును. అందులకే సాధనలు, శాస్త్రములు, గురువులు కావలసి వచ్చినది. పరిపూర్ణ స్ధితిలో లోన, బయట అనెటి బాహ్యా భ్యంతరములు మచ్చుకు కూడ నిలువవు. ఈ స్ధితినొందిన వారికి సదా స్వనిష్ఠయే భాసిల్లును. సర్వం స్వస్వరూపముగ వీక్షించగలరు. ఇదియే దివ్యాత్మ దృష్టి. రండి. ఈ దృష్టిని అనుగ్రహించెదను అంటున్నారు బాబా సర్వకేంద్రులు. సమస్త బోధకులు, ప్రవక్తలు, పీఠాధిపతులు, అవతారులు నా మార్గజ్యోతులు, నా ఉద్యమ ప్రతినిధులు అనెటి సర్వకేంద్ర స్వరమును విని, అనుసరించి ధన్యులు కండి.<br /><br />నాలుగు గోడల మధ్యన ఏ గర్భగుడిలో నన్ను బంధించలేరు. 1. అచంచల ఆత్మవిశ్వాసము 2. పరాభక్తి 3. పవిత్ర ప్రేమ ఈ మూడు పురుల త్రాడుచే నేను అవలీలగ కట్టుబడగలను. ఆకాశములో ఎగురు గాలిపటము దారమును వెనుకకు లాగుచు చేజిక్కించు కొనునట్లు, పైన తెలిపిన త్రిపుటి ఆధారముతో నన్ను మీ హృదయ మందిరములోకి ఆహ్వానపరచుకోండి. దీనికి మించిన జ్ఞాన సాధన లేదు. మీరలు ఎవరు అనే ప్రశ్న నాకనవసరం. భక్తి విశ్వాసములు కోల్పోయి మీ మేధాశక్తి నంతంటిని ప్రయోగించినను నా కృపలేకుండ నేను సంపూర్తిగ గ్రాహ్యంకాను. స్ధూలదృష్టితో మీరు చూచినంతకాలం మీ మధ్యన నేను ఒక సామాన్య వ్యక్తిని. మీ అందరిలో ఒకడను. నాకు నేనుగ ఆలోచిస్తున్నపుడు సర్వాతీత పరాత్పరుడను. సర్వలోకేశ్వర పరమ ప్రభు సార్వభౌముడను. మీతో కలసి ముచ్చటిస్తున్నపుడు, భుజించునపుడు, భజించునపుడు సామాన్య మానవునిగ గోచరిస్తున్నాను. అది మీ అనుభూతి. కాని భువి, దివి, గ్రహరాసులను అధిగమించి, గగనాలను ఆవరించి సర్వ శక్తిర్మయ అనంత శోభతో భాసిల్లు నా రచనలు పఠించునపుడు గుండెలు అవిసిపోగలవు. వర్షించు మేఘ జలమువలె సర్వోన్నత స్ధితినుండి నా బోధామృతము వర్షించబడును. <br /><br />అనంత విశ్వంలో నన్నుమించిన స్వార్ధపరుడు లేడు. కేవలాద్వైత అచల పరిపూర్ణ సర్వకేంద్ర దైవస్ధితిలో నేనున్నాను. ప్రతి నేను సర్వకేంద్ర దైవ నేను స్వరూపముగ స్వనిష్ట నొందవలయునన్నదే నా స్వార్ధం. ఇట్టి నా స్వార్ధంలో సమస్త పరమార్ధములు ఇమిడియున్నవి. జై బాబా! ప్రతి నీవు నా వారస జ్యోతియే. ప్రతి నేను నా స్వరూప కాంతియే. నేనైన మీరే నా సర్వస్వం. అందులకే నా సర్వస్వమును మీకే అర్పిస్తున్నాను.అంకితం చేస్తున్నాను. ఆందులకై నా రచనల నన్నింటిని వెలుగులోకి తీసుకురండి. బిడ్డా! నానుండి కాదనెటి బెంగ వలదు. సాహసించి నిలువు. సమయం కలసివస్తుంది. భూ దిగంత సర్వలోక పర్యంతం మీ ద్వారా నా దివ్య భాష్యం భాసిల్లుతుంది. అనంతకాలం నాది. సమయము ఆసన్నమైనది. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నా స్వరూప ప్రజ్ఞతో నిలచి పరమపిత రుణం తీర్చుకోండి. ఇదియే నాయొక్క అనుగ్రహ ఆశీస్సులు. చరమ సూత్రం. మరల మరల చెప్పుచున్నాను.గుంపులు గుంపులుగా జనులను ప్రోగుచేసుకొని ప్రసంగములు చేయు అంతస్ధు నాది కాదు. సమస్త జ్ఞాన బోధకులకు సరిపడు అతీత బోధను సార్వకాలం సర్వలోక పర్యంతం చెందునట్లు భూ, జల, విహంగ, సర్వలయ యానములలో పరమ సూత్ర వాక్యములను మీ అందరి నిమిత్తం విరచితము గావించనైనది.<br /><br />మత్ ప్రియాత్మ జ్యోతులారా! అలనాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని నిమిత్త మాత్రునిగ చేసుకొని జగద్విఖ్యాత గీతోపదేశము జరిపినట్లుగ నిన్ను నిమిత్త మాత్రునిగ చేసికొని నా స్వహస్తలిఖిత అతీత దివ్య భాష్యమును అఖిలాండ కోటి బ్రహ్మాండ అనంత విశ్వపర్యంతం చెందునట్లు నా రచనల నన్నింటిని నీ స్వాధీనం చేస్తున్నాను. వంటకము నాది - వడ్డన నీది. ఇందునిమిత్తం నాచే నియమితులైన ప్రచారకులు సమయ సందర్భానుసారం నా పేరిట ప్రతినిధులుగ “సర్వకేంద్ర పీఠాధిపతులు” రాగలరు. అనిర్వాచ్య, అజేయశక్తి వారలకు అనుగ్రహించబడును. నన్ను చేరు మార్గం వయా నీవు కావాలి. గాఢంగా నమ్మి చూడు. ఈ స్ధితిలో ఓలలాడించెదను. నా సంకల్పమునకు తిరుగులేదు. నా ఆదేశమునకు ఎదురులేదు. ఉప్పుబొమ్మ నీటిలో లయించినట్లు కర్పూర హారతివలె క్షుద్రహం వీడి సర్వార్పణ యోగీశ్వరుడవు కమ్ము. అట్టి నీవు నీవు కాదు. నేనే ఆ స్ధితిలో ప్రకాశించెదను. సార్వకాలం కేవలం నేనుమాత్రమే ఉంటిని, ఉన్నాను, ఉండెదను.జై బాబా! నమో విశ్వగర్భా! ఫాహిమాం. త్రిమూర్తులు సైతం ఒక పరిధిలోని వారే. సృష్టి, స్ధితి, లయ కారకులైన త్రిమూర్తులు సర్వకేంద్ర, స్వపరాది శక్తిని పొంది వారి విధులను నిర్వహించెదరు. ప్రపంచమును గడగడలాడించు యముడు నా పాద దాసుడు. నన్ను స్మరించు చోట యమదర్శనం ఉండదు.<br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-27203871085926721312008-06-12T04:48:00.000-07:002008-06-12T04:50:21.593-07:00నేను విచారణఇతరుల గురించి ఆలోచించటం, తెలుసుకోవటం ఎంతైనా కష్టం. మీ గురించి మీరు ఆలోచించనేర్వండి. ఇది సులభ మార్గం. మొదటి ఆలోచన నేను. ప్రగాఢ విచారణచే ఈ నేను ఆత్మలో లీనమై ఆత్మ నేనే ప్రకాశిస్తుంది. ఇదియే జీవన్ముక్తి. నిర్వాణము, పరలోక స్వర్గ రాజ్యం మీలోనే గలదు. బయట వెదకటం భ్రమ మాత్రమే. తన నిజ స్వరూపమైన ఆత్మలో మేల్కొన్నవాడు సచ్చిదానందపూర్ణ మైన ఆత్మను స్వస్వరూపం గా అనుభవిస్తాడు. బాహ్య ఎరుకే మిధ్యా నేను. దీనిని పోగొట్టుకున్నపుడే అసలైన ఆత్మ దేవ నేను దక్కుతుంది. నిజాత్మను పరిపూర్ణముగ గ్రహించినపుడు ఆ మహా అఖండశక్తి తన ఉనికి సత్తానుండి ఆవిర్భవించి శాశ్వతముగ వర్ధిల్లు తుంది. దీనినే బట్టబయలు, ముక్తి, మోక్షం, వైకుంఠం, పరంధామం, పరలోక స్వర్గ రాజ్యం అని రకరకములుగ చెప్పుకొందురు. <br /><br />ఎవరెన్ని చెప్పినను ఆదిమూల తత్త్వం ఏకం, అవిభాజ్యం. ఆ దివ్య స్వర్గ రాజ్యం నీయందేగలదు. దీనిని నీలో దర్షించిననే తిరిగి బయట ప్రతిఫలిస్తుంది. తన్ను తానెరుంగుట ప్రతి మానవుని ప్రధమ కర్తవ్యం. తనను తాను తెలుసుకోకుండ ఎన్ని తెలుసుకున్నా లాభం లేదు. తాననే ఒక అంకె లేనిచో ప్రక్కనున్న సున్నాలకు విలువ సున్న. ఆ ఒక అంకెను తెలుసుకోవాలన్న రామకృష్ణ పరమహంస వాణి యధార్ధము. లౌకిక భ్రమ లోలురు ఆత్మ విచారణ నుండి ఎంతకాలం తప్పించుకు తిరిగినా చివరకు అదియే శరణ్యం కాక తప్పదు. ప్రతి జీవి ఘనీభవించిన మోక్ష స్వరూపమే. ఆత్మాన్వేషణలో మునుగనంతవరకు సమస్యలు, సందేహాల బాధలు తప్పవు. తనను తాను కనుగొన్నవారికి మహాశక్తులు హస్తగతం కాగలవు. ఈ శక్తులను సద్వినియోగ పరుచనియెడల భ్రష్టులయ్యెదరు. మీ ముందు మహామహులమని విర్రవీగే వారిలో కొందరు ఈ అధమ స్ధాయికి దిగజారి పోయారు. జనులచే దేవుడనిపించు కోవచ్చు. అది సరిపోదు. ఈ లోకంలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తరువాత క్షుధ్రహం లోలురై ఎవరెక్కడ పతనపడుచున్నారో సులభం గా గ్రహించవచ్చు. <br /><br />ఉన్నది అంతా ఒకే చిన్మయ చైతన్య అఖండ సత్తు. ఈ స్ధితిలో చూచేది ఎవరు ? చూడబడునది ఏమిటి ? అవి రెండు మిధ్య. ఉన్నదే ఉన్నది. ఉన్న దంతయు అదే తనకు తానైన స్వత:స్సిద్ధ దైవం. దేహేంద్రియ మనో బుద్ధులతో తాదాత్మ్యం చెందిన నేనుకు ఈ సర్వాంతర తత్త్వం తెలియదు. వ్యక్తి గత నేను సత్యాత్మ దైవమునుండి మరల మరల పుడుతూ అందులోనే లయిస్తుంది. ఎవరెటు తిరిగినా మరల నేను వద్దకు రావలసిందే. ఆ నేనెవరో నిశ్చయించి తెలుసుకో! ఈ లోకంలో అందరు అజ్ఞానాంధకార కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. కేవలం ఆత్మ జ్ఞానమే కారా గార విముక్తికి మార్గం. మనసు బహిర్ముఖమైన అజ్ఞానం. అంతర్ముఖమైన జ్ఞానం. లోచూపువల్లనే సహజాత్మ దర్శన భాగ్యం. నేనెవరో గ్రహించిన మాయసంగతి బయటపడుతుంది. కనిపించేదంతయు నేనులో అదృశ్యమై తీరుతుంది. అందులకే అది అశాశ్వతం. ఆత్మ కనబడునది కాదు. అదృశ్యమయ్యెడిది కాదు. అందులకే ఈ ఆత్మదర్శనాన్ని శాశ్వతం చేసుకోవాలి. నిజమైన దైవ నేను మిధ్యా నేనును తొలగించి ఆత్మనేనుగ మిగులుతుంది. విజ్ఞానమయ కోశం నుండి మిధ్యా నేను పుడుతుంది. ఈ నేనుతోనే నిజమైన నేను ఆత్మను గ్రహించాలి. ముల్లును మరియొక ముల్లుతో తీసి రెంటిని పారవేయునట్లుగ ఎరుకద్వారా శుద్ధ ఎరుకనెరింగి ఆ రెంటిని మానుటయే పరిపూర్ణ దైవత్వం. నేను అనే ప్రధమ తలంపు పైననే మనో సంకల్పములన్నియును నిలువగలవు. ఈ ప్రధమ తలంపే లేని పక్షంలో మిగతా సంకల్పములకు తావులేదు. నేను తెలిసిన తర్వాతనే ఇతరం తెలిసినది. ఈ నేను మూలమైన ఆత్మలో అదృశ్యమైనపుడు, లయించినపుడు సిద్ధించేదే ఆత్మ సాక్షాత్కారం. ఇదే నిజమైన నేను. మానసిక తలంపులకు ఆధారమైన బహిర్గత నేనును విసర్జించిన అంతర్గత నేను నిన్ను ఆవహిస్తుంది. ఈ నేనే నిజమైన ఆత్మ. ఇదే పరమాత్మ. ఆది మద్యాంతం లేనిదిది. ఏకాగ్రమైన దృష్టితో నేను శరీరంలో ఎక్కడ పుడుతుందో చూడు. హృదయావిష్టుడైన నీవు పరిపూర్ణ సచ్చిదానందమును నీ స్వరూపముగ అనుభవిస్తావు. <br /><br />ఉన్నదంతయు చిన్మయ సత్తు. ఇది ఆత్మ లక్షణము. నేనున్నాననెటి భావనయే సర్వేశ్వరుని మొదటి నామము. వాస్తవముగ చెప్పాలనిన భగవంతుడే ఆత్మ. నిశ్చలమైన ఏకాగ్రపూరిత అంతర్గత విచారణచే దప్ప ఎన్ని ప్రదేశాలు, దేశాలు తిరిగినా ఆత్మజ్ఞానము సిద్ధించదు. సర్వ శక్తులతో మనసును ఆత్మాభిముఖం చేయాలి. ఇదే ఆత్మ విచారణ. అంతటగల ఆత్మను అనుభవపూర్వకంగ గ్రహించాల్సిందేగాని ఉత్తమాటలు పొసగవు. ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదు. నాలుక ద్వారా తెలుస్తుంది. ఆత్మజ్ఞానము అంతే. నేనును విచారించటమనిన అహం వృత్తిని విచారించటం. ఈ విచారణను ముందుగ మనసుతోనే ఆరంభించాలి. మనసును అంతర్ముఖపరచి విపరీతంగ శతృసైన్యమువలె దూసుకువస్తున్న తలంపులను నిరోధిస్తూ హృదయస్ధానాన్ని గుర్తించాలి. మనసు హృదయంలో లీనంకాగానే నిశ్చలానందం కలుగుతుంది. ఈ ఏకావస్ధలో పరిపూర్ణ జ్ఞానం అవిచ్చిన్నంగా ప్రకాశిస్తుంది. నామ రూప జగతి ఎన్నిసార్లు వచ్చి పోయినను, విశ్వ ప్రకృతి ఎన్నిమార్పులు చెందుచున్నను తదధిష్ఠాన సత్తు మాత్రం మారదు. సర్వమునకు ఆధారభూతమైయున్న అఖండ చైతన్యం ఏనాడు నశించేది కాదు. అది సదా నిర్వికారం. సినిమా థేయేటర్ లో ఎన్ని ఆటలు మారినా అన్ని ఆటలు ప్రదర్శింపబడే వెండితెర మాత్రం మారదు. సర్వాధిష్ఠాన పర:బ్రహ్మ సూత్రము అంతేనని గ్రహించాలి. ఓ మానవా! నీకు అద్భుత శరీరం ప్రసాదించబడింది. జ్ఞాన సాధన సత్కర్మలకు వీలుపడునట్లు చూసుకో. ఈ శరీర కూర్పుకు ఎవరు కర్తయో చక్కగ తెలుసుకో. ఏ చేర్పులు, మార్పులు లేని చిన్మయ స్ధితిని చేరుకో. ఈ విశ్వంలో ఏ పదార్ధం కూడ దైవమునకు భిన్నంగ లేదు. సర్వేశ్వర స్వామి ఒక కాలానికి, ఒక ప్రదేశానికి కట్టుబడిలేడు. ఆయన అంతట, అన్నివేళలా ఏకరీతిగ యున్నాడు. ఇట్టి అక్షర పర:బ్రహ్మమునకు అన్యముగ ఏమియును లేదని రూఢిపరచుకోవటమే నిజమైన స్ధితప్రజ్ఞ పదవి.<br /><br />తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. మిధ్యా నేనును విసర్జించటమే తన్ను వదలటం. తత్త్వమసి. వ్యక్తుల మానసిక కర్మయే పుట్టుకలకు మూలం. ఆత్మ అజం, అమరం. చావు పుట్టుకలు పరమార్ధంలో లేవు. అందులకే పరమార్ధ కోర్సులో ప్రవేశించండి. అగ్ని సెగలో మూకుడులో వేపుడు చేయబడిన గింజలు భూమిలో విత్తి తగిన జల సదుపా యం కలిగించినను మొలకెత్తవు. కారణం ఏమనగా బీజాంకురములు నశించినవి. అలాగే జన్మ కారణోపాది కారణ శరీరము దగ్ధము కానంతవరకు పునరపి జననం, పునరపి మరణం తధ్యం. నేనులేని స్ధానంలేదు. నేనులేని వస్తువు లేదు. నేనులేని జగము లేదు. నేను లేని జీవము లేదు. నేనులేని దైవం లేదు. నేనులేని ఏ నేను లేదు. సమస్త నేనులకు నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఏకీభవించి నాయందే లీనమైయున్నది గాన నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము.<br />మనో అవగాహన లేకుండ ప్రపంచ అవగాహన కుదరదు. ఆత్మజ్ఞానం లేని ప్రపంచ జ్ఞానం వ్యర్ధం. నీవు ఎక్కడినుండి ఉద్భవిస్తున్నావో ప్రపంచం, వివిధ వస్తుజాలము అక్కడినుండే జనిస్తుంది. సర్వైక్య కూడలి కర్తను తెలుసుకో. నేను పుట్టాను అని భావించే ప్రతివారికి చనిపోయిన పిదప ఏమి జరుగుతుందో అనే సందేహం రాగలదు. నేను అను తలంపు ఎక్కడ పుడుతుందో తెలుసుకో. ఇది సర్వరోగ నివారక సంజీవి. జన్మకు మూలమైన “అహం”ను పోగొట్టుకొనిన శరీరమనెటి పునర్జన్మ రాదు. కారణోపాది దగ్ధం ఐనపుడే జన్మరాహిత్యం. ఇట్టివారే నిజమైన కారణము పొందినట్లు. స్ధితికుదురని గురువులు ఇచ్చట పడిపోవుచున్నారు.<br /><br />నీ శరీరం నిద్రించిన పడకపై ఉంటుంది. కాని స్వప్నంలో అదే శరీరంతో ఒకచోట సంభాషించు చున్నట్లు, మరియొక చోట విందులో పాల్గొనినట్లు వారి వారి చిత్త ప్రవృత్తి ననుసరించి స్వప్నములుండు. స్ధూల శరీరం నీదైన, నీవైన స్వప్నావస్ధలోని సూక్ష్మ శరీరం ప్రమాదకారి. దానిని నశింపజేయాలి. పైపై తతంగములచే ఇది అసాధ్యం. ఇక్కడే చాలామంది తికమక పడిపోవుచున్నారు. నేను అనే తలంపు లేకుండ శరీరం నశించగానే సరిపోదు. పూర్వ సంస్కారములతో, వాసనలతో వాయువు పుష్పముల వాసనను దూరముగ తీసికొని పోవునట్లుగ మిధ్యా నేను మరల జన్మిస్తుంది. సంకల్పానికి మూలమైన ఆత్మలో చేర్చి, నేనెవడను అనెటి ప్రగాఢ విచారణచేత ఇది సాధ్యమగును. నేను చేస్తున్నాననెటి కర్తృత్వభావన వీడి సర్వేశ్వరుని చేతిలోని ఉపకరణముగ తనను భావించి, ఉచ్చ, నీచముల పాటించక , అందరిలొ ఉన్న ఈశ్వరుని దర్శించువారు, ఈశ్వరారాధకులు, సంఘసేవ చేయువారు ధన్యులు. ఆత్మ జ్ఞానమును మించిన సంఘసేవ లేదు. వసుదైక కుటుంబ భావమే ఆత్మ జ్ఞానార్హత. <br /><br />మత సిద్ధాంతములన్నియును ఆత్మదర్శనంతో ముగిసిపోగలవు. ఈ దేహంతో ఉన్నపుడే సత్యాత్మ దృష్టిని స్ధిరపరచుకోవాలి. దేహాభిమానం ఉన్నంతకాలం మృత్యుభయం వెంటాడుతుంది. నిద్రను హాయిగ కోరుకొనునట్లు మృత్యువును ఆహ్వానించాలి. సర్వ స్వతంత్రమైన సత్యాత్మ జ్ఞాని దేహ మరణానంతరం సైతం స్వత:స్సిద్ధముగ ఉంటాడు. ఇదియే సరియైన స్ధితి.<br />నీ లోపలికి లోతుగ మినిగి తరచి చూడు. నీలో నిక్షిప్తముగ దాగియున్న అతి రహస్యమైన, మనోహరమైన, శుభప్రదమైన, ఆనంద దాయకమైన, అనశ్వరమైన ఆత్మజ్ఞాన నిధులను గుర్తించి స్వంతం చేసుకో. హృదయ కవాటాన్ని తెరచుకో. మనోనేత్రంతో ప్రపంచాన్ని గాంచు. మాయ తెరను చేధించు. ఆత్మను దర్శించు. ఇదియే సత్య భగవన్ మార్గము. శక్తునికన్యధా శక్తిలేదు. అద్వైతులు చెప్పే మాయను విశిష్టాద్వైతులు మారే స్వభావంగలది అన్నారు. ఏమార్పులు, చేర్పులు లేకుండ సర్వాధారముగ, సర్వాకారముగనున్న శాశ్వత సత్యమును గ్రహించాలి. ఇదియే పరమార్ధం. ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైత సమస్త పీఠ సాంప్రదాయములు, మూల సిద్ధాంతములు చిన్మయ పరమార్ధ సాగరంలో నదులుగ కలిసిపోగలవు. <br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-31468334502022763792008-06-08T22:42:00.000-07:002008-06-08T23:27:17.019-07:00స్వస్వరూపంఅజ్ఞాని, ఆత్మజ్ఞాని ఉభయులు సృష్టిని చూస్తున్నారు. అజ్ఞాని దృష్టిలో తనకు భిన్నముగ ప్రపంచము కనిపిస్తుంది. ఆత్మజ్ఞాని దృష్టిలో ప్రపంచము తనకు వేరుగ గోచరించదు. దీనినిబట్టి తేడాలు దృష్టిలో గలవేగాని సృష్టిలో మాత్రం కాదని తెలుస్తుంది. దృష్టిని బట్టియే సృష్టి గోచరిస్తుంది. దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే విశాల విశ్వం ఆత్మ స్వరూపముగా విరాజిల్లుతుంది. చూచేవానికే సృష్టి. ఆ చూచేవానిని చూడనేర్చుకోవాలి. ప్రపంచం ఆత్మగ సత్యం. ఈ విశ్వమంతయు మహా వెలుగునుండి, శబ్ధమునుండి జనిస్తుందని భౌతిక శాస్త్రజ్ఞుల సిద్ధాంతము. ఈ విశ్వంలో ఏపదార్ధము కూడ చిన్మయ చైతన్య శక్తికి భిన్నంగా లేదు. <br /><br />దివ్య ప్రకాశమే వెలుగు. దేవుడు లోకమునకు వెలుగై యున్నాడు. వెలుగు సంబంధులై మెలగనేర్వాలి. ఆదియందుగల శబ్ధమే ప్రణవం. త్రిమూర్త్యాత్మక ప్రణవ స్వరూపమే ప్రపంచం. కొందరు ఆదియందు వాక్యము పుట్టెను అంటారు. శబ్ధ సముదాయమే వాక్యం. వాక్య సముదాయమే వ్యాసం. వ్యాసముల సమాహారమే విశ్వం. అజ్ఞాన బంధితులై మిధ్యా నేనుతో వ్యవహరించిన దయ్యాలు కాగలరు. సుజ్ఞాన పరిధిలో సత్య నేనుతో వ్యవహరించిన దైవాలు ఔతారు. ప్రతి ప్రాణి సహజ పరిపూర్ణ దివ్యస్ధితిని పొందు పర్యంతం, సాగరైక్యంగోరు నదిని అనుసరించవలయును. మనమందరం అఖండ సచ్చిదానంద సర్వేశ్వర స్వామి స్వరూపులమేగాని వేరు ఎంతమాత్రం కాదు. <br /><br />సృష్టిలో అణువునుండి ఆకాశ నక్షత్ర పర్యంతం, జీవాణువునుండి పరమాత్మ వరకు, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక లోకాలకు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి మూడు అవస్ధలలోను ఉన్న వస్తువులు ఆయా లోకాల్లోని, ఆయా స్ధితులలోని ద్రవ్యంలో నిర్మాణం ఐనవి. ఈ వివిధ ద్రవ్య రూపాలన్నింటికి మూలమైన నియతి ఒకే ఒకటి. అదియే “సత్”. ఉండేది ఈ ఒక్కటే. నామ రూపాలు మిధ్య. సర్వ పరిపూర్ణముగ ఉన్నది ఒక్కటే. రెండవది లేదుగాన సామ్యం పొసగదు. పోల్చటం కుదరదు. ఏకైక చిన్మయ చైతన్య “సత్” అప్రమేయమై, అమోఘమై, అనంతమై, సమస్త నామ రూపాలకు ఆధారమై, మణులందు సూత్రమువలె సర్వత్ర, సర్వసాక్షి రూపమున సూత్రాత్మగా భాసిల్లుచున్నది. ఇదే భగవంతం. అన్నింటికి ఐక్యతను పొందజేసే అంశమే ఈ అఖండ “సత్”. అందరూ సత్ స్వరూపులే. ఈ సత్తే పరమ శివం. <br /><br />సృష్టిలో సర్వత్ర ఏకత్వమే గోచరిస్తుందనిన అన్ని వస్తువులు ఒక్కటియని కాదు. ఒకే పదార్ధ నిర్మితములని భావం. మట్టితో వివిధ రకముల పాత్రలు, బంగారంతో వివిధ రకములౌ ఆభరణములు తయారు చేసినను మన్ను, బంగారం ఒక్కటే కదా! అలాగే నామ, రూప సృష్టి గతించినను మూలమైన సత్ ఏనాడు నశించదని తెలుసుకోవాలి. మానవుడు, దేవుడు, అణువు, మహత్తు ఇవి వ్యవహారంలో భిన్నంగా కంపించినా తత్వత: అవి పూర్ణములే. పరిపూర్ణతయే వీటి లక్షణము. ఉన్నదంతా కేవల సచ్చిదానంద పర:బ్రహ్మ పదార్ధమే. ఈ స్ధితిలో చిన్నా, పెద్దా తారతమ్యం లేదు. అంతా, అన్నీ పర:బ్రహ్మమే. ఇతరం ఎంతమాత్రం లేదు. <br /><br />ఈ సృష్టిలో నిర్జీవ పదార్ధం ఏదియునులేదు. ప్రతి పరమాణువు కూడా జీవకళతో ఉట్టిపడుతుంది. ఇలాగే సూక్ష్మ లోకాల్లో, అన్ని అంతస్తుల్లో ఉండే ప్రతి సూక్ష్మ అణువు జీవంతో నిండియున్నది. సర్వం సజీవమయం ప్రోక్తం. విద్యుత్ శక్తి ఒకటే ఐనను ధనము, రుణము, పాజిటివ్, నెగెటివ్ అని రెండుగా వ్యక్తమౌతుంది. అలాగే ఉన్నదంతా ఒకే పదార్ధమైన సర్వ్వాది మూలకారణ చైతన్య సత్. చైతన్యం, పదార్ధం అని రెండుగా వ్యక్తమౌతుంది. చిన్మయ పర:బ్రహ్మ సత్ అద్వితీయం, అప్రమేయం, అనంతం. అన్ని రూపాలలో ఇది పూర్ణంగా వెలసియున్నది. అన్ని రూపాలు దీని రూపాలే. ఒక్కమాటలో చెప్పాలనిన ద్వైతం అనేది లేనేలేదు. ఉన్నదంతా కేవలద్వైత, అచల, పరిపూర్ణ పర:బ్రహ్మమే. ఈ నామ, రూపాలతో కనిపించే సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే ఒకటి. ఇది అనంతం. సర్వాది మూలకారణం. కారణం వేరు. మూల కారణం వేరు. ఈ అఖండ మూల తత్వమే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మూలం. ఇది నిత్య శుద్ధం. నిర్గుణం, నిర్వికారం, నిర్విచేష్టం. దీనికి, కనిపించే ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేదు. దీనినే సత్, అస్తి అనవచ్చు. <br /><br />ప్రతి ప్రాణి పరిణామ దశనుండి నిర్వికార శాశ్వత దైవస్ధితిలో ఎన్ని మన్వంతర కాలాలకైనను స్వస్వరూప ప్రజ్ఞతో స్వచైతన్యమెరింగి సర్వేశ్వర స్వామి స్వరూపంగా నిలువక తప్పదు. ఇది నిశ్చయం. ప్రతివారలు ఎంతకాలానికైనను దివ్య మానవ స్ధితిని పొందక తప్పదు. మహాగ్నిగుండం నుండి వెలువడిన అగ్నికణముల వంటివారు జీవులు. విశ్వాత్మలోగల అన్ని లక్షణాలు విస్ఫులింగమైన జీవునిలో గలవు. ఈ జీవాత్మలన్నియును క్రమముగా పరిణామదశ నొందుచు ఏదొ ఒకనాడు శాశ్వత ఆత్మ స్ధితిలో విలీనం కాకతప్పదు. మానవుడు తన నిజస్ధితిని పొందు పర్యంతం విశ్రమించరాదు. ఇది సకల ధర్మముల సారాంశము. సృష్టి సర్వస్వం పరమ సత్యముయొక్క బాహ్య స్వరూపమే ఐనను దాని వ్యక్త రూపం తాత్కాలికము కావున భ్రమ, భ్రాంతి, మాయ, సైతాన్, ఎరుక అన్నారు. అంతరంగ పరిణామ ప్రక్రియలను హస్తగతం చేసుకొనిన వారలే గుప్త సంకేతాలను గుర్తించి బహిర్గతం చేయగల సమర్ధులు. భౌతిక శాస్త్రజ్ఞులకు అంతుచిక్కనంత మాత్రాన సనాతన శాశ్వత పరమార్ధ సిద్ధాంతం మారదు, మరుగుపడదు. కేవలం తపోసంపన్నులైన, జ్ఞాన నిష్టులైన మహర్షులు తమ స్ధూల, సూక్ష్మ, కారణ, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలను శక్తివంచన లేకుండ పరిశుద్ధపరచు కొనినందుననే అట్టివారలకు మాత్రమే బ్రహ్మాండ జగన్నిర్మాణ రహస్యములు బోధపడగలవు. యోగవిద్యా సంపన్నులకే సృష్టి రహస్యం గ్రాహ్యం కాగలదు. <br /><br />ఏది ఈ సమస్తమును తనయందు ఇముడ్చుకొని సర్వోన్నతముగ ఉన్నదో అదియే సర్వకేంద్రం అని గ్రహించాలి. ఇది విశ్వమంతట ప్రతి అణువులోను నిక్షిప్తమై యున్నది. జీవరాసులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ దానికి గలదు. మానవ మేధస్సు అతిమానస భూమిక నధిరోహించిననే చిన్మయ పరతత్వం బోధపడుతుంది. టేప్ రికార్డ్ చేయు క్యాసెట్ లో మాటలు, పాటలు, వివిధ రాగాలు, ద్వనులు నిక్షిప్తమై ఉన్నట్లుగ, జరిగిపోయిన, జరుగుచున్న విషయాలన్ని సూక్ష్మాకాశ క్యాసెట్ లో టేప్ చేయబడి ఉండును. సూక్ష్మాకాశ పత్రముపై ముద్రింపబడి యుండును. ఇవి విశ్వంలో సూక్ష్మాతి సూక్ష్మంగ చోటుచేసుకొని యుండును. యోగ విద్యలో నిష్ణాతులైన ప్రసిద్ధ పురుషులు వారి ఆధ్యాత్మిక శక్తిచే సూక్ష్మాకాశంలో ముద్రితమైన విషయాలను గ్రహించి శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివలె కాలజ్ఞాన చరిత్రలను రచించగలరు. యోగ విద్యా ప్రావీణ్యులు తలంచినంతనే శరీర ధ్యాసను వీడి తురీయ స్ధితికి చేరగలరు. స్వశక్తితో సమాధి అవస్ధను పొందగలరు. యోగ విద్యాభ్యా సముచే ప్రకృతిని సులభముగా స్వాధీన పరచుకొనవచ్చును. దీనిచే సర్వ వ్యాపి, సర్వశక్తి సమన్వితుడైన అనంతాత్మను తెలుసుకోవచ్చు. <br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-43037202243578816412008-06-08T22:38:00.000-07:002008-06-08T22:40:55.596-07:00అమృత సిద్ధిమానవుడు త్రిమూర్తులుగ ఉండును. 1.స్ధూల శరీరము. 2. సూక్ష్మ శరీరము 3. అమృతత్వ స్ధితి (మోక్ష శరీరము). ప్రకృతి సైతం ఇలాగే మూడు రూపాలతో ప్రకటితమగును. 1. ఇంద్రియములకు గోచరమయ్యేది స్ధూల ప్రకృతి 2. ఇంద్రియాలకు అతీతమైనది సూక్ష్మ ప్రకృతి (అంతర్గతం, అత్యంత శక్తివంతం 3. స్ధూల, సూక్ష్మ ప్రకృతులకు అతీతమైనది మూల పరా ప్రకృతి. ఇది నిత్యం, శాశ్వతం, అచలం, స్ధిరం, సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం. దీనికి మార్పుగాని, నాశనంగాని ఏనాడులేదు. దీనినే ఆది పరాశక్తి యందురు. <br /><br />భగవత్ సన్నిధిలో భక్తులుగ, సద్గురు సన్నిధిలో శిష్యులుగ, పెద్దల సన్నిధిలో సేవకులుగ నిలువగలిగే అభ్యాసకులు అమృతత్వ సిద్ధిని ఈ జన్మలోనే పొందగలరు. జడమును ప్రేమించే మనసును జయించిన చైతన్య భావం స్ఫురించును. ఇంద్రియ గోచర సంబంధమైనదంతయు జడమేనని తెలియవలయును. ముందుగ మనసును జయించాలి. దానికి ప్రతి క్షణం పని కల్పించాలి. సోహంభావ నిష్ఠలో లయింపజేయాలి. పర్వతం కణమయం, సింధువు బిందుమయం, అనంతకాలం క్షణమయం ఐనట్లు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు వర్తించునదంతయు ఏకత్వము యొక్క మూడు రూపాలు. ఇదంతా సత్ యొక్క మహా మాయ. ఈ జగత్తు లోని సముదాయమంతయు మాయయే. ఎందులకనగా వస్తు సముదాయమంతయు తాత్కాలికమైనది. సూక్ష్మజీవి నుండి సూర్యమండల పర్యంతం తాత్కాలికమే. సుస్ధిరం, పరిణామ రహితమైన ఏకత్వముతో పోల్చి చూచిన సృష్టి సర్వస్వం బ్రహ్మజ్ఞానికి మృగతృష్ణ జలమువలె గోచరిస్తుంది. <br /><br />లౌకిక జీవి కేవలం బాహ్య దృష్టితో ప్రకృతిబ్ద్ధమైన జీవన విధానము నకు ఆకర్షితుడై తత్సంబంధమైన జీవనమును కోరుకున్నందున తనలో నిండియున్న అంత:శ్శక్తిని అమూలాగ్రం గ్రహించలేక పోవుచున్నాడు. ఫ్రతి పరమాణువులో అనన్య సామాన్య శక్తి ఉన్నపుడు మనలో ఎందుకు లేదను కోవాలి. కోట్లకొలది భౌతిక మరియు జీవాణువుల పరంపరలచే శోభిల్లుచున్న మానవునిలో సృష్టి, స్ధితి, లయ సంబంధిత శక్తితోపాటు అతనికి తెలియని అనిర్వచనీయ, మహత్తర శక్తిపూరితమైన దివ్య తత్వం ఇమిడి యున్నది. ఇట్టి అజ్ఞాతమును తెలుసుకొనుట ప్రతివారి విధి, ధర్మము, బాధ్యత. <br /><br />స్వాత్మ స్వరూప భావనను కోల్పోవుటయే సమస్త దోషములకు మూలం. అత్మకు ఇతరముగ భావించునదంతయు మిధ్య. ఇట్లు మిధ్యగ నిశ్చయించు కొనుటయే నిజమైన వివేకముతొ కూడిన విచారణ. ఈ భావన మనసులో స్ధిరపడాలి. పరమాత్మ రాళ్ళయందు నిద్రావస్ధలోను, వృక్షములలో శ్వాస రూపమున, పశుపక్ష్యాది క్రిమికీటకాలలో చలన రూపములోను, కేవలం మానవునియందు మాత్రమే జ్ఞానముతో ఉన్నదని తెలుసుకోవాలి. కావున వివేకవంతుడైన మానవుడు జ్ఞాన దశనుండి దిగజారరాదు. గొర్రెలమందలో చిక్కిన సిం హపు పిల్లవలె దాని స్వరమును మరీచి గొర్రెల అరుపు అరచునట్లు మానవుడు ఈ నామ, రూప ఇంద్రజాలంలో చిక్కి తన నిజ స్వరమును మరీచి సైతాన్ స్వరముతో మెలగుచున్నడు. కావున మానవుడు తన నిజ స్ధితిని తెలుసుకొని సదా ఆత్మ జ్ఞాన శోభితుడై వర్ధిల్లాలి. అమృత సిద్ధిని సాధించి అమరత్వం పొందాలి.<br /><br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-50516952685289979002008-06-07T03:50:00.000-07:002008-06-07T03:53:24.483-07:00ఆత్మ విచారణజన్మించిన ప్రతి మనిషియొక్క శుభాశుభములన్నియు ముందుగానే నిర్ణ యించబడి కపాలముపై లిఖితమై ఉంటాయని, దానిని బ్రహ్మ వ్రాసిన వ్రాతయని అంటారు. ఈ దశలో దైవారాధనలు, పూజలు, వ్రతముల ప్రయోజనం ఏమిటని సందేహించరాదు. ప్రతి కర్మ చిత్తశుద్ధికి దారి తీస్తుంది. చిత్తశుద్ధి ఆత్మనిష్ఠకు తోడ్పడుతుంది. నిన్ను నీవు తెలుసు కొను స్ధితిలో ఏ బ్రహ్మరాతలు నిన్ను అడ్డగించలేవు. దేనికైనను దైవా నుగ్రహం సహకరించవలయునని సమస్త భక్తులు మరువరాదు. నీవు ఒక వ్యక్తివద్ద బాకీ తెచ్చుకున్నావనుకో. ఆ బాకీని అడుగను అని రుణపత్రం చింపివేసిన పిదప బాకీ వసూలుచేసే వారెవరు ఉండరు. <br /><br />నీ నిజాత్మ స్ధితిలో నీవు నిలుకడ చెందనంతవరకు చిల్లర ఆరాట భ్రమలు నిన్ను వీడవు. ఓ నా ప్రియమైన సాధక భక్తుడా! జాగ్రత్తగా వినుము. ఈ భూమిపై వెలసిన సమస్త దేవతా దేవుండ్లను పూజించి, ధ్యానింతువుగాక. అంతటితో సరిపోదు. నీవనగా ఎవరో అట్టి నీ నిజాత్మ స్ధితిలో నిలుకడపొందాలి. స్వనిష్ఠలో స్ధిరత్వమొందాలి. అపుడే దైవ ధ్యాన సిద్ధి ఐనట్లు నిదర్శనము. నీవు నిద్రలో యున్నను, మేల్కొని యున్నను, సర్వకాల సర్వావస్ధల యందును సాక్షీభూతమై యున్నది ఏదో అదియే ఆత్మ. ఆ ఆత్మ నేనేనని రూఢిపరచుకో! నీవెంత కాదనుకున్నను నీవు అదియే ఐవున్నావు.<br /><br />శరీరం, దాని ధర్మాలు, పదవులు, ఆస్తి అంతస్తులు, దేశకాల స్ధితిగతులు, మనోబుద్ధులు నీవుకాదు. వాటన్నింటికి సర్వలక్షణ విలక్షణమైన సర్వాత్మ స్వరూపుడవు నీవు. ఇదియే ఆత్మ విచారణ. దీనినే ఆధ్యాత్మికత యందురు. నీటిబుడగ నీటిలో పుట్టి, దానిపై తేలాడి చివరకు ఆ నీటిలోనే కలసిపోవునట్లుగ నామ, రూప సృష్టి సర్వం ఆదినారాయణ పరమేశ్వర దైవమునందు జనించి, చివరకు అందులోనే లయం అవుతుంది. నారాయణుడే నీరు. నామ రూపాలు అందలి బుడగలు. <br /><br />నిర్మల మేఘ జలమువంటిది నా బోధ. స్వాతికార్తెలోని తొలకరి మేఘ జలమును ఆశించు చాతక పక్షివలె సర్వకేంద్రుల సుప్రబోధామృత మేఘజల పానశీలురు కండి. తనను తాను ఉన్నది ఉన్నట్లుగా సుస్ధిరాత్మ సత్యదైవ నేను స్వరూపముగ తెలుసుకోవటమే సమస్త సమస్యల పరిస్కారానికి ఏకైక దివ్య మార్గం. సమస్త జ్ఞానోపదేశముల మూల సూత్రమిది. గ్రంధరాశుల వెనుక జ్ఞానలక్ష్మి గలదు. హృదయగ్రంధి పెద్ద ముడి. దీనిని బేధించిన అంతర్ స్వర స్ఫురణ జాగృతమై, హృదయ గ్రంధమే దైవగ్రంధముగ ఆవిష్కరింప బడుతుంది. సర్వమత సంబంధ బోధలు, వేదోపనిషత్తుల సూత్రములు నీ హృదయ గ్రంధములోనే దర్శనమిస్తాయి. అదియే విశ్వమత దర్పిణి. <br /><br />ఇదిగో! మీ చిత్ క్షేత్ర సస్యములపై పరతత్త్వ సుజ్ఞాన బోధామృతమును కుంభవృష్టిగ కురిపించు చున్నాను. ఈ అవకాశమును వినియోగించుకొని మీ చిత్ క్షేత్రములను సస్యశ్యామలం చేసుకోండి. సర్వేంద్రియములను సం యమన పరచి, మనో దృశ్శక్తిని త్రికూట స్ధానమున కేంద్రీకరించి, వాక్శుద్ధితో ఏది అనిన అది జరిగి తీరుతుంది. ఈ స్ధితినొందిన వారలు అత్యరుదు. <br /><br />కృష్=అపరిమితమైన, ణ=ఆనందము గలవాడు. కృష్ణయనగా అపరిమిత మైన ఆనందమే స్వభావముగ గలవాడని అర్ధము. అపరిమితానందమే ఆతని గుణము, లక్షణము. తనను ఆశ్రియించినవారికి ఆనందప్రాప్తిని కలుగజేయువాడని మరియొక అర్ధము. అపరిమిత ఆనందమే మోక్షం. మోక్ష స్వరూపుడే కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. ఈ లోకం లో ఎందరు జగద్గురు నామధేయులున్నను ఆ పదవికి పూర్ణార్హమైనది కృష్ణావతారమని మహర్షుల అభిమతము. జగద్గురు విషయం లో సర్వావతార నిలయులు బాబా సర్వకేంద్రులు ఇలా వివరిస్తున్నారు. చరాచర సమస్త ప్రాణికోట్లయందు తానే విరాజిల్లు చున్నానని, పిపీలికాది పర మేశ్వర పర్యంతం అందరిలో తనను, తనలో అందరిని దర్శించుచు, జగదా త్మను స్వస్వరూపముగ వీక్షించు వారెవ్వరైనను జగద్గురు పదవికి అర్హులే కాగలరు. విశ్వాత్మను స్వస్వరూపముగ వీక్షించువాడే విశ్వ భగవన్. <br /><br />‘రా’ యనగా జీవాత్మ, ‘మ’ యనగా పరమాత్మ. జీవాత్మ, పరమాత్మల సమైక్య తత్త్వమే రామ తత్త్వం. శవము గానిదే శివం, సత్. పవిత్రాత్మ యే గోవిందం. అరిషడ్వర్గముల కవ్వలి అనంతాత్మ నారాయణుడు, సర్వము ను ఆకర్షించువాడే హరి. స్వస్వరూప సంధాన స్ధితిలో అభిషిక్తతయే క్రీస్తు తత్త్వం. జితేంద్రియత్వమే శబరిమల వాసం. ఆత్మానందమే హాయి. అదియే సాయి. నేను ఎవరియందు ఆవేశించెదనో వారు నా పరమార్ధ తత్త్వమును విశదీకరించెదరు. అట్టివారలందరిని నా ప్రతినిధులుగ నేనె ఎన్నుకోనైనది. నాచే గుర్తింపబడిన యోగ్యులు ధన్యులు. <br /><br />జ్ఞానోదయం కానంతవరకు అజ్ఞాన దెబ్బలు తప్పవు. సమస్త జీవజగ త్తులు ఉప్పునీటిలో వలె ఎచ్చట లయిస్తున్నాయో, ఎచ్చట మానవ హృదయాలు ఐక్యతా భావంతో వర్ధిల్లుచున్నవో, ఎచ్చట సమస్త దేవతా దేవుండ్లు సర్వైక్య పరిపూర్ణ స్ధితిలో ప్రకాశిస్తున్నారో అదియే నా ప్రార్ధనా మందిరము. ఈ నా దేవాలయమును భూలోక సిరిసంపదల మొత్తం ధారవోసినను నిర్మించలేరు. కేవలం ఆత్మౌపమ్య భావ నిష్ట నొందిన యోగీశ్వరులకే నా ఆలయ ప్రవేశార్హత పరమ భాగ్యం. నామ, రూప, దృశ్య నాటకం, చూపు, రూపుల వ్యవహారం లేదు. సర్వాత్మ అనంత దివ్య భావ ప్రకటన సమస్త యుగముల ఆరాధన మూల సూత్రమిది. విశ్వ మతములన్ని ఇచ్చట సంగమించి తీరగలవు. ఇదియే సర్వకేంద్ర దైవపదవి. మీరందరు ఈ పదవిని పొందు నిమిత్తం వారస జ్యోతులై నిలువాలి. జై బాబా!<br /><br />మీరు తరించి ఉద్ధరించబడుటకు ఇందులో మీకు నచ్చి, వీలున్న ఏ ఒక్క అతీత వాక్యమైనను చాలు. ఎవరికి వీలున్నంతవరకు వారి మేధాశక్తి ననుసరించి స్వీకరించండి. మీకవసరము లేనిది మరియొకరికి అవసర ముంటుంది. ఈ భూతలమున అవతరించిన ప్రతివారికి ఉపయుక్త ‘బోధామృత నిధి’ ఇదియని గ్రహించువారు ధన్యులు. జై సర్వకేంద్రా! ఇదిగో! నాయొక్క అతీత వాక్య వివరణ అనగా నా ఈ పరమాద్భుత ప్రసంగ బోధ జరుగు చోట విద్యుత్ తేజమును మించిన ఘన చిన్మయ ప్రకాశము ఆవరిస్తుంది. ఇది సూక్ష్మ దృష్టికి మాత్రమే గ్రాహ్యం. ప్రతి శ్రోత దేహధ్యాసను మరిచి చిన్మయ నిష్ఠలో తన్మయులై స్వస్వరూప సంధాన స్ధితిలో నిమగ్నులయ్యెదరు. అధికారులు శ్రవణమాత్రం చేతనే ఆత్మసిద్ధి నొందగలరు. <br /><br />సర్వలోక పర్యంతం సమస్త భూనివాసులారా! చక్కని సదవకాశమును వ్యర్ధపరచుకోరాదు. మిమ్ముల మీరు తెలుసుకొని మీ నిజాత్మ స్ధితిలో అభిషిక్తులు కండి. ఇంతకు మించిన నా అనుగ్రహ ఆశీస్సులు లేవు. అప్పుడే మీరు మీకప్పగించిన కార్యం లో కృతకృత్యులై నా రుణం తీర్చుకున్నవారు కాగలరు. ఇంతకుమించిన తృప్తి నాకు లేదు. ఇదిగో! చెవిగల ప్రతివారు విందురుగాక! ఒక్కమాటలో అసలు విషయం బట్టబయలు చేయుచున్నాను. ఇది నర గురు రచన కాదు. మరియు గురు శుశ్రూషాలబ్ధ భాష్యం అంతకన్నా కాదు. ఇయ్యది సాక్షాత్ స్వత:స్సిద్ధ సర్వేశ భగవన్ శ్రీమన్నారాయణ పరమశివ హరి బోధ కావున ఏ ఇతర రచనలతో పోల్చ వీలులేదని గ్రహించుదురు గాక!<br /><br /> (బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-63098342503683630282008-06-04T02:20:00.000-07:002008-06-04T02:22:18.582-07:00నేనెవరు ?తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి. బాహ్య కర్మకాండ తతంగమంతయు మన తృప్తి కొరకే. మనసు జోడించని, హృదయశుద్ధిలేని కేవల బాహ్యాడంబర ములు నిజదైవమును మెప్పించలేవు. సర్వధరిత, సర్వభరిత, సర్వాధార, సర్వాకర్షణ చిన్మయ చైతన్య సర్వశక్తి కేంద్రుడైన విశ్వగర్భుని నుండియే సమస్త దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచల, అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు. <br /><br />విశ్వాంతరాళములోని నక్షత్రములను, గెలాక్సీలను చూడవలయుననిన సుదూరమునకు దృష్టిని సారించగలిగిన దూరదర్శిని అవసరము. సుజ్ఞాన దృష్టి దీనికి పైది. దూరదర్శినులకందని నక్షత్రములు గలవు. పదిహేనువందల కోట్ల సంవత్సరములవరకు ఇవి వ్యాపించి యున్నవని శాస్త్రజ్ఞుల అంచనా. ఆపై అత్యద్భుత నక్షత్ర మండలములు గలవు. ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యమిది. నక్షత్రములను, గ్రహమండలములను ఒక్కొక్కచోట వాటి పరిమిత కక్ష్యలో నిలిపి పరిభ్రమింపజేసే శక్తి ఏమిటి? అదియే అనిర్వచనీయ చిన్మయ చైతన్య సర్వశక్తి దైవం. <br /><br />సూర్యునిమీద కోటి డిగ్రీల వేడిమిగలదు. సూర్యుడు భూమికంటె పరిమాణంలో పదమూడు లక్షల రెట్లు పెద్ద. బరువులో మూడులక్షల రెట్లు ఎక్కువ. ఐదువందల కోట్ల సంవత్సరములుగ సూర్యుడు వెలుగు చున్నాడు. ఇంకను కోట్ల సంవత్సరములు సూర్యుడు ప్రకాశించును. వేల సూర్యగోళములు ఒకేసారి వెలిగితే విడుదలయ్యే శక్తి ఒక విస్పోటనం. ఇవి సెకనులో వెలిగిపోతాయి. అనంత సృష్టికి మూలకారణం ఏమిటి? ఇది శాస్త్రవేత్తలకు సవాల్! మిలియన్ లక్షల కోట్ల కాంతి సంవత్సరములు ప్రయాణంచేసి విశ్వాంతం ముగిసినది. ఇకపై ఏమియును లేదని భావించినను, ఆ ఏమిలేని కాళీ ప్రదేశం శూన్యం మాత్రం కాదు. ఇది చిన్మయ చైతన్య ప్రభావమేగాని ఇంకేమియును కాదు. <br /><br />దేహాభిమాన ప్రాణభయం ఉన్నంతవరకు పరతత్త్వ జ్ఞానసిద్ధి కలుగదు. విద్యుత్ బల్బులోని విద్యుత్తు అంతర్ముఖముగ వెళ్ళిపోయినచో చివరకు విద్యుత్కేంద్రమే తానగును. అలాగే దేహమనెటి బల్బులోని దేహియనెటి బాహ్య స్ఫురణ వీడి, దేహేంద్రియ మనో పరిమితుల నతిక్ర మించి సర్వాంతర్ముఖముగ పయనించెనేని సర్వాత్మ మహాసాగర స్వరూపంగా వర్ధిల్లగలదు. సమస్త మత గ్రంధముల సారమిదియే. తనకు తానుగ సన్మార్గ ప్రవేశితుడు కావాలి. ఎవరికి వారే ప్రేరణ పొంది ఉద్ధరించుకోవాలి. <br /><br />చిల్లర మంత్ర తంత్రములు మనుష్యులను భ్రమింపజేస్తాయి. స్ధితికుదురని వారలు రసాయనాలతో మాయా వాతావరణమును సృష్టించి ప్రజలను భ్రమింప జేయుదురు. అమాయక ప్రజలు వాటిని నిజమని నమ్మి వారికి దైవత్వమును ఆపాదించుదురు. నిజ దైవస్ధితి వీటికి అతీతం. మనలో అవతారులు కానివారు ఎవరూ లేరు. ప్రతి ప్రాణి ఒక అవతారమే. మనందరిలో అవిభాజ్య దైవాంశ దాగియున్నది. దీనిని వెలికి తీసి ప్రదర్శించాలి. <br /><br />చేతిక్రింద ప్రచారకుల గుంపు వుండిన సాయంత్రం వరకు సామాన్య వ్యక్తిని సత్పురుషునిగ, జగద్గురువుగ, అవతారమూర్తిగ నమ్మించవచ్చు. కాని పిదప అయోమయ దు:ఖ స్ధితి తధ్యం. వేర్లులేని కొమ్మలవంటివి స్ధితికుదురని చేష్టలు. తన్ను తానెరింగి ఆత్మార్చన శీలియైన ఘనుడు భగవంతుని నిండా అర్చించిన వాడగును. అందులకే నిన్ను నీవెరింగి నీ నిజాత్మ స్ధితిలో స్వస్వరూప ప్రజ్ఞతో వర్ధిల్లాలి. ఇదియే సమస్త మత ధర్మముల సారం. సమస్త పూజల సారాంశం.<br /><br />నీ నిజస్ధితిని విస్మరించిన పరిజ్ఞానమెంతైనా దైవస్ధానమున శోభిల్లనేరదు.అందులకే నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి అవిభాజ్యం, అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై నిలువనేర్చుకో. ఎవరిని మందలించినా నేను అంటారు. ఆ నేను ఎవరు? ఆ నేను స్త్రీయా, పురుషుడా? ఆ నేనుకు వయస్సెంత? శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ స్ధితిలో సైతం ఈ నేను అవిచ్చిన్నముగ భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ నేనుకు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం నేను అని తెలుసుకో. నీవు లేకుండ, నీవు పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో. <br /><br />ఆకాశము శబ్ధగుణ రూపమైనది. ఆకాశమునకావల పరమ నిశ్శబ్ధము, కేవల పరమశివ అచలాద్వైతం నిండి భాసిల్లుచున్నది. ఇట్టి శివస్వరూప శక్తివలన పంచభూతములు ఆవిర్భవించినవి. పంచమూతముల సం యోగమే జగత్తు. సంసారము, పంచభూతములు అన్నియును భగవంతుని శక్తిలోనే ఇమిడియున్నవి. కావుననే దానికి విభూతి యోగమని పేరు వచ్చినది. అనంతుడు, అవ్యక్తుడు, సర్వవ్యాపియైన దేవదేవుడు దేహధారియైనపుడు జీవుడని పిలువబడు ను. జీవుడు అల్పజ్ఞుడు. భగవంతుడు అన్నింటికి కర్తయై జీవుల యంత్రముగ గిరగిర త్రిప్పుచున్నాడు.<br /><br />ఈశ్వరునివలె జీవుడుకూడ శుద్ధ చిన్మాత్రుడేగాన బేధంలేదు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య భావనిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ జ్ఞానమును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి. గుణముల లో మార్పురాకుండ గుడ్డలు మార్చుకోగానే సరిపోదు. వస్త్రాలంకార ములు బాహ్య దంబాచారమును సూచించును. శక్తికిమించిన వేషధారణ హానికరము. సబ్బు బిళ్ళలపైనున్న కాగితములు ఎంత సొగసుగ కనిపించినను ఎందుకు కొరగావు. స్ధితికుదురని కేవల వేషధారులు సబ్బు బిళ్ళలపైగల కాగితములవంటి వారు. ఓ వివేకి! ఎంతకాలము గంటలు మ్రోగించి మంత్రాలు వల్లిస్తావు. ఈ పూజా పునస్కారములు ఎంత వరకు నిలువగలవు. దూప, దీప, నైవేద్యాలు నీ తృప్తికొరకే. అవి భగ వంతుని ఎంతమాత్రం స్పృశించలేవు. నిన్ను, నీ నిజాత్మ స్ధితిని గుర్తించక కాలయాపన చేయరాదు. సత్యదేవునకు ప్రతేక స్ధలంలేదు. ఉన్నదంతా తనకు తానైన నేనే. ఈ నేను తప్పిస్తే ఇంకేమియునులేదు. మణుల లో దారమువలె సర్వాంతర్యామిగ ఉన్నదంతా నేనని నిశ్చయించుకో. ఇదియే సమస్త సాధనల ఫలితాల ప్రత్యక్ష మార్గం. దేహమనంబులు తానని భావించుటయే దు:ఖహేతువు. ఈ భ్రమ తొలగటమే బ్రహ్మత్వం.<br /><br />జాగ్రత్స్వప్న సుషుప్త్యావస్ధలలో నీవున్నావుగాని జాగ్రత్ లో తోచేవి సుషుప్తిలో లేవు. ఆ సమయంలోకూడ నీవున్నావు. మనో సంకల్పాలే ప్రపంచ భావనకు ఆధారం. ఆత్మలోనే మనసు పుట్టి లయిస్తుందిగాన ఆత్మే అన్నింటికి మూలం. నీవు నీలో యున్నావు. శరీరంలో సూదిమొన వంటి కేంద్రం వుంది. దానినుండి నేను నేననే సోహం స్ఫురిస్తుంది. ఇది అజ్ఞానిలో మూతబడి ఉంటుంది. నిర్వికల్ప సమాధి స్ధితిలో శాశ్వతముగ తెరువబడి ఉంటుంది. అరుణాచల రమణుడు ఈ నేను భావమును స్పష్టంగ గ్రహించగలిగారు. ప్రతి మానవుడు ఈ నేను సాక్షాత్కారం పొందనేర్వా లి. ప్రశాంతమైన మనసుతో నిరంతరం నేనెవరు? అని ప్రశ్నించుకుంటూ ఉండిన క్రమముగ హృదయ కేంద్రానికి చేరుకోవచ్చు. ఇలా చేరగానే ఆత్మ స్ఫూర్తి కలుగును. తలంపు, భ్రమలులేని నిత్య ప్రత్యక్షానుభవ మైన ఆత్మ స్ఫూర్తిలో నేను పరిశుద్ధమై అవిచ్చిన్నంగా ప్రకా శిస్తుంది. <br /><br />సమస్త నాడులకు హృదయమునుండే శక్తి వస్తుంది. హృదయమే శక్తి స్ధానం. గుదస్ధానమునుండి వెన్నెముకలోని వెన్నుపూసలద్వారా సుషుమ్న నాడి సహస్రారపర్యంతం అంతమౌతుంది. సిద్ధుల నిమిత్తం యోగులు ఈ నాడిని సాధించుటకై ధ్యానించెదరు. దీనిని ఆత్మ నాడి, పరా నాడి, అమృత నాడి అనెదరు. ఇది శక్తి కేంద్రమైన హృదయంలో పుట్టి సహస్రారంలో కలుస్తుంది. సుషుమ్న నాడికి సైతం ఆత్మ నాడియే శక్తినిస్తుంది. యోగ శాస్త్రం సహస్రారం అంతటికి మూలమంటుంది. పురుష సూక్తం హృదయమంటుంది. ఎట్టి సందేహములకు తావులేని ప్రత్యక్షాను భవమైన నేనుపై దృష్టి నిలిపిన ఆ నేనే ఆత్మలోకి తీసుకెళుతుంది. “నేను” విచారణను మించిన ధ్యానంగాని, సమాధిగాని లేదు. హృదయమే జీవునికి మూలస్ధానం. ఇది ఆత్మయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో. అసలైన ‘నేను’ స్ఫురణతో సదా విహరించ నేర్చుకో.<br /><br />(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)<br />సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6968290648846252467.post-49508100838936569722008-05-30T01:04:00.000-07:002008-05-30T01:06:07.829-07:00గృహస్ధాశ్రమ ప్రాశస్ధ్యంనిత్యజీవితమును పవిత్రపరచునదే పరమార్ధ వేద విద్య. ఇది గృహస్ధులకు చాలా ముఖ్యం. ఆశ్రమములన్నింటిలో గృహస్ధాశ్రమము సర్వ శ్రేష్టమైనది. ఎందులకనగా గృహస్ధాశ్రమము లేనిచో మిగతా ఆశ్రమాలకు స్ధానం లేదు. సర్వాశ్రమ కూడలి గృహస్ధాశ్రమము. చక్కని గృహస్ధాశ్రమము నుండియే సమస్త మహనీయాత్ములు, అవతారులు ఉద్భవించగలరు.<br /><br />వివాహము పరమార్ధ జీవనమునకు ఆటంకము కాదని మహా సాధ్వీమణి, ఆదర్శ గృహిణి శ్రీమతి శారదా దేవి నిరూపించినది. భార్యా భర్తలిద్దరు పరస్పరం అవగాహన చేసికొని, శారీరక దృష్టి నతిక్రమించి, మానసికంగా, భౌద్ధికంగా అనంతకాల పర్యంతం విశ్వం కోసం బాహ్యాభ్యంతర బేధం వీడి భగవన్మతులై మెలగు దంపతులు<br />ధన్యాతి ధన్యులు.<br /><br />సంసారంలో తొలిఘట్టం వివాహము. అది సార్ధకం, విజయవంతం కావాలనిన ఆ బాధ్యత స్త్రీ పురుషులిరువురిపై ఆధారఫడి ఉంటుంది. అనుస్ఠాన వేదాంతి స్వామి రామతీర్ధ అన్నట్లు “కళ్ళజోడు కంటి చూపునకు అవరోధం కాకుండునట్లు దంపతులిరువురు ఒకరికొకరు భారంగ, భయంకరంగ గోచరించకుండునట్లు చూచుకోవలయును.<br /><br />హిందువులకు కృత్యాకృత్య విదాయక ప్రమాణ గ్రంధము వేదము. అట్టి వేద ప్రతిపాదిత విధానములన్నియును నివృత్తి బోధకములే. వేదములు మానవులను పాప తాపములనుండి విముక్తులను చేయునిమిత్తమే అవత రించాయి. “వేదో నారాయణ: సాక్షాత్” అనెటి భాగవతోక్తి ప్రకారం వేదం సాక్షాత్ నారాయణ స్వరూపమే. <br /><br />వివాహ ఆంతర్యం గ్రహించలేనివారు మాత్రమే వివాహాన్ని కామ మయంగా, భోగ విలాస మరియు సంతానోత్పత్తి సాధనంగా భావిస్తారు. కేవలం శారీరక ఆశయములతో, ఇంద్రియ చాపల్య పశువాంచా ప్రవృత్తుల తీర్చుకొను నిమిత్తమేగల దాంపత్యములు హృదయైక్యం కానందున నిప్పులోపడిన ఉప్పువలె చిటపటలతో చివరకు దావాగ్ని వలె చిచ్చున ముంచుట తధ్యం.<br /><br />ఈ లోకంలో భార్య ఎవరు? భర్త ఎవరు? అవి అస్ధిర శరీర సంబంధములు. ఆత్మకు అవిలేవు. ఆత్మ ఏ లింగబేధంలేని చైతన్య స్ధితి. భర్తయనగా భరించువాడని అర్ధము. “గతిర్భర్తా ప్రభుసాక్షి” యనెటి గీతా శ్లోకానుసారం సమస్త చరాచర జగత్తును ధరించి, యావద్విశ్వమును భరించువాడొక్కడే పరాత్పరమ ప్రభుస్వామియని గ్రహించాలి.<br /><br />ఉదయాస్తమానము సమస్యలతో సతమతమయ్యే గృహస్ధులు మోక్షమును సాధించుట దుస్తరము, వీలు చిక్కదని కొందరు భావిస్తుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఉదా: జనక మహారాజు చక్రవర్తి పదవి నలంకరించియు తన రాచకార్యములతో పాటు వీలు కలుగజేసుకొని వసిష్ఠ మహర్షి సన్నిధిలో స్ధిరచిత్తుడై కూర్చుండి ఆత్మబోధ విని తరించాడు. అట్టిచో గృహస్ధులకు రాచకార్యములకు మించిన కార్య కలాపములుండవు గదా! ఆలోచించండి! విధిగా తీరిక చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. <br /><br />వివాహ సంబంధం శారీరక పరిధుల నతిక్రమించి, నిత్యం పవిత్ర ప్రేమానురాగ బద్ధమై, సౌజన్యంతో, సౌశీల్యంతో, ఆదర్శ కుటుంబముగ, దివ్య గోపురముగ వర్ధిల్లాలి. అప్పుడే చల్లని సంసారం లో చక్కని సంతానం ఉద్భవించగలరు. వారు సీతారాములవలె. రాధాకృష్ణులవలె, పార్వతీ పరమేశ్వరులవలె మెలగి తమ దాంపత్య జీవితాన్ని ధన్యం చేసుకోగలరు.<br /><br />దంపతులిరువురు సమర్ధులైనచో గృహస్ధాశ్రమ బ్రహ్మచర్యం పాటించవచ్చు. అట్టి కుటుంబములు నిజముగ రాజయోగ మఠములన వచ్చు. గృహస్ధాశ్రమ బ్రహ్మచర్యమనగా కేవలం రుతుకాల సంపర్కమును మాత్రమే కోరుకోవడం. రుతుకాల నిర్ణయము: స్త్రీలకు స్వాభావికముగ పదహారు దినములు రుతుకాలమని శాస్త్రములు చెప్పుచున్నవి. అందులో మొదటి నాలుగు దినములు మంచివికావు. అలాగే పదకొండు, పదమూడవ రాత్రి నిషిద్ధములు. తక్కిన పది రాత్రులు ప్రశస్ధములు. ఏకాదశి, శివరాత్రి మొదలగు పర్వదినములు సజ్జన వర్జితములని శాస్త్ర వచనము. గృహస్ధులు ఈపాటి బ్రహ్మచర్య వ్రతదీక్ష కలిగియున్నను వారు సాధువులే యనవచ్చు. సిం హము మూడు సంవత్రములవరకు బ్రహ్మచర్యం కాపాడుకొని కలువగలదు. ఆందుకే దానికంత పరాక్రమము.<br /><br />గృహస్ధాశ్రమ బ్రహ్మచర్య రాజయోగ దీక్ష విషయంలో దంపతుల ఒప్పందం ముఖ్యం. పద్మినిజాతి స్త్రీ ఎన్నోరకముల ఉపమానములతో భర్తకు నచ్చజెప్పి తన మార్గంలోకి మార్చుకోగలదు. అలాగే సౌశీల్యంగల పురుషుడు చక్కని శిక్షణచే తన భార్యను ప్రగతిపధంలో నడిపించును. ఏ వంశంలో స్త్రీలు పవిత్రంగ ఆదరింపబడుదురో ఆ వంశమున ఉత్తమ సంతతి జనించును.<br /><br />“నివృత్త రాగస్య గృహం తపోవనం.” రాగరహితమైన గృహమే పవిత్ర పుణ్యక్షేత్రము. పడవ సముద్రంలో ఉండవచ్చుగాని, సముద్రము పడవలోనికి ప్రవేశించకూడదు. అటులే సంసారంలో మానవుడుండ వచ్చుగాని, మనిషి మనసులో సంసారం ఉండకూడదు. తామర పత్రం నీటిపై, కుమ్మరి పురుగు బురదలో తిరుగునట్లు నిర్లిప్తులై నిలవాలి. నిత్య జీవితంలో గృహస్ధాశ్రమ ధర్మాలను చక్కగా పాటిస్తూ దంపతులు జగతికి ఆదర్శప్రాయులై నిలిచి జీవిత పరమార్ధాన్ని సాధించాలి.<br /><br />నాగులవంచ వసంతరావు, సచివాలయం.naagulavancha vasantha raohttp://www.blogger.com/profile/12839502219740329704noreply@blogger.com0