Saturday, January 5, 2008

రచయిత రచనలపై ప్రముఖుల ప్రశంసలు

* నాగులవంచ వసంతరావుగారు రచించిన ”సద్భావనా స్రవంతి” పుస్తకం చదివాను. వసంతరావుగారిలోని సదాలోచనలకు ఈ చిన్న పుస్తకం అద్దం పట్టింది. ‘విశ్వస్శక్తుల ఆవాహన' అనే శిర్శికలో వసంతరావు గారు ప్రకటించిన ఆశయాలు సార్వజనీన సత్యాలు. మానవుడు ఉత్తమ మానవుడుగా రూపొందడానికి కావలసిన వివిధాంశాలను ఈ గ్రంధములో పొందుపరిచారు వసంతరావుగారు. ఎవరికైనా కావలసింది చక్కని ఆలోచన, అందుకు తగ్గ ఆచరణ. ఈ రెండు పార్శ్వాలను ఈ గ్రంధములో పొందుపరిచారు వసంతరావు గారు. అందుకు వారిని నేను అభినంది స్తున్నాను.
-డా. సి. నారాయణరెడ్డి, సుప్రసిద్ధకవి, రచయిత, హైదరాబాద్.
* మీరు రచించిన “సద్భావనా స్రవంతి” పుస్తకం ఆమూలాగ్రం చదివాను. “సెల్ ఫోన్-విల్ ఫోన్” నుంచి మీ అంతిమ వాక్యాల వరకు బాగున్నాయి. “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” అన్న పుస్తకం పూర్తిగా చదివాను. విద్యార్ధులకు ఉపయోగపడేలా చాలా బాగుంది. అభినందనలు.
- యండమూరి వీరేంద్రనాధ్, సుప్రసిద్ధ రచయిత, హైదరాబాద్.

* మీరు పంపిన “సద్భావనా స్రవంతి” పుస్తకం చదివాను. ఇందులోని వ్యాసాలు చిన్నవిగాను, రమ్యముగాను ఉన్నాయి. “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” గ్రంధం లో విద్యార్ధులకు ఉపయోగపడే అనేక ‘టిప్స్’ గలవు. ఇది పాఠకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి, సుప్రసిద్ధ రచయిత, హైదరాబాదు.

*మీరు అభిమానంతో పమంపిన “సద్భావనా స్రవంతి” పుస్తకం పూర్తిగా చదివాను. ఒకసారి కాదు, రెండు సార్లు. ఛాలా బావుంది. పాజిటివ్ థింకింగ్ కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 50వ అంశం చాలా అవసరం. సృష్టిలో లేదు లోపం, అంతా దృష్టి లోపమే”
అనే సజెషన్ చాలా బావుంది. మీ కలం నుండి ఇలాంటివి వెలువడాలని
కోరుకుంటూ…
-డా.బి.వి. పట్టాభిరాం, ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త, హైదరాబాద్.

* దైవ దృష్టిలో మానవుడు అగ్రగణ్యుడు. అతడి ఆలోచనలే అతని వ్యక్తిత్వ వికాసానికి అధారముగా ఉంటాయి. సదాలో చన, సత్సాంగత్యం మానవుని మాధవునిగా మారుస్తాయి. సమాజం లో మనిషి ఎలా మెలగాలో, ఎటువంటి ఆలోచనలతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలో అట్టి సద్భావనలను సమాహారం గా సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధముగా అందజేసిన మీకు నా అభినందనలు. బాబా సర్వకేంద్రుల “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” పుస్తకం అత్యంత ఉపయుక్తమైన గ్రంధం. అన్ని గ్రంధాలయాలలో ఉంచదగిన మంచి పుస్తకం. “చైతన్య స్రవంతి” కవితా సంపుటి పేరుకు తగినట్లుగా జీవిత సత్యాల సంకలనం. నవయువకులకు ఉద్భొధ సముచితంగా ఉంది. “డబ్బు-జబ్బు” నుండి తేరుకొని ధర్మబద్ధముగా జీవించమన్నారు. ఒక్కొక్క కవిత జీవిత శ్రేయమును బోధిస్తున్నది. మీ కృషి అభినందనీయం.
- డా. జానమద్ది హనుమచ్చాస్త్రి, కడప.

* “సద్భావనా స్రవంతి” మా గడపదాటి మా యింటిని పావనం చేసింది. అందులో ఎన్నిసార్లు గ్రుంకులిడినను తనివితీరుట లేదు. ప్రభు సమ్మతములైన సూక్తులు కాంతా సమ్మతములవోలె మనోహరములు కావు. కానీ ఇది “సద్భావనా స్రవంతి”. ఏతజ్జల ధారలు నిర్మలములై, పవిత్రములై, లోతులేక సర్వులకు స్నాన యోగ్యములై, పాన యోగ్యములై, తృష్నా పనోదములై, అలతులైన తరంగాలతో తాపత్రయపుటెడారిలో సాక్షాత్కరించి, జీవనయాన పధికులను సేదదీర్చి తరింప జేయుచున్నవి. విశ్వశక్తుల ఆవాహన మొదలు స్తోత్రగీతం వరకు ఆధ్యాత్మిక తరంగమాలికలతో అలరారు మీ సద్భావనా స్రవంతి నన్ను ధన్యున్ని చేసింది. కృతజ్ఞుడను.
- ఎర్రాప్రగడ రామమూర్తి, పినపాక, ఖమ్మం జిల్లా.

* “ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్య: పరమ్మన:
మనసస్తు పరాబుద్ధిర్యో బుద్ధే:పరసస్తుస:”

దేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకంటే మనస్సు, మనస్సుకంటేబుద్ధి, బుద్ధికంటే ఆత్మ ఒకదానికంటే ఒకటి శ్రేస్ఠమైనవని భగవద్గీత ఆత్మ ప్రాధాన్యతని వివరించింది. ఆత్మమధనమే జీవుని వేదన. శోకం నుంచి శ్లోకం వెలువడి మహోన్నత ఆదికావ్యం ఉద్భవించినట్లు రచయిత శ్రీ వసంతరావు గారి ఆత్మ తపించి వెలయించిన భావ తరంగాలు “సద్భావనా స్రవంతి”గా ప్రసరించాయి.ఇటువంటి గ్రంధరచన చేయాలంటే జీవనగమనం
లోని సంఘర్షణ మాత్రమే సరిపోదు - ఆత్మవివేచన పండాలి. అనుభవాలు చాలవు – అనుభూతులు అందాలి. తార్కిక దృష్టికి జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహ భిక్ష తోడుకావాలి.

‘విశ్వశక్తుల ఆవాహన’ చేసిన వసంతరావు గారు చెప్పిన రచనా సంకల్పం మహత్తరమైనది. ఆధునిక సమాజానికి వలసిన సర్వ శక్తులను సమీకరించి ప్రతి ఆత్మలో ఆవిష్కృతం చేసే దివ్యసంకల్పం ఇది. సంఘంలో, సంఘంలోని మనలో ఎన్నదగిన దోషాలున్నాయని అందరికీ తెలుసు. ఆ దోషాలను ఎలా నివారించుకోవాలో అరటిపండు ఒలిచి చేతిలో ఉంచినట్లు చెపారు రచయిత. “బలమే జీవనం – బలహీనతయే మరణం” అనే స్వామి వివేకానందుని ప్రబోధం నిజం కావాలంటే ఈ చిరుపొత్తం లోని ప్రతి అంశాన్నీ ఆచరణ యోగ్యముగా అనువర్తింప చేసుకోవాలి. “వాగ్భూషణం భూషణం” అనే హితోక్తిని గుర్తు చేస్తూ మాటే మంత్రం అంటూ మనో నిగ్రహంతో ఏకాగ్రతతో భాష, భావం ఏకీకృతం గా స్థిరమైన మనస్సుతో మాట్లాడే మాట ఎంత ప్రభావితం చేస్తుందో రచయిత వివరించిన తీరుచూస్తే మహనీయుల వాక్కుకు అంతటి శక్తి ఎలా లభించిందో అర్ధమవుతుంది. “సద్భావనా స్రవంతి’లోని ప్రతి భావన అత్యంత విలువైన రత్నం లాంటిది. ఒక్కొక్క భావనను త్రికరణ శుద్ధిగా ఆచరించటానికి, సాధన చేయటానికి జీవితమే చాలదేమో! కనీసం ఒక్కటి ఆచరించగలిగినా మానవుడు మాధవుడౌతాడు, చెడ్డ ఆలోచనలను దూరం చేసుకొని, ఏకాగ్రతతో సద్భావనలను పెంచుకొని, ఉత్తమ ఆదర్శం కోసం ఈర్ష్యా ద్వేషాలను వీడి, జ్ఞాన సరస్వతిని ఆవాహన చేసికొని, విశాల దృష్టితో, మృదు భాషతో, సద్గ్రంధ పఠనతో, సత్కార్యా చరణ చేయమని సన్మార్గ ప్రేరణ కల్గిస్తున్న తత్త్వరచన ఇది! శ్రీ గురు ఆశీర్వాదబలం ఇది.

ఆత్మ సౌందర్యం అనుభవైక వేద్యమేగాని చర్మ చక్షువులకు అందేది కాదు. “అందరిలోనూ ప్రకాశించే ఆ దివ్యాత్మ ఒకటే” అని గ్రహించ గలిగితే దు:ఖం ఉండదు. అంతా పరమానందమే!ఆనంత చైతన్య స్వరూపమే!
ఇటువంటి ఉదాత్త భావాలను ప్రోదిచేసుకొని అక్షర రూపం ఇచ్చిన వసంత రావుగారు సహోద్యోగిగా ఎందరికో చిరపరిచితులైనా ఈ గ్రంధపఠనం వల్ల వారిలోని వెలుగు కోణాన్ని దర్శించగలిగానని ఆనందిస్తున్నాను. స్వగతం వెలుగై వసంత రావుగారు వ్యాపించిన తీరును వివరించి స్పందింప జేసింది, కొన్ని సంస్కారాలు పూర్వజన్మ సుకృతులు. వివిధ వికృత పోకడలతో సమాజం తలలు దించుకుంటున్న వేళ ఇటువంటి సద్భావనా కిరణాలు ప్రసరించే జ్ఞాన స్రవంతిని పఠితల కందించిన శ్రీ నాగులవంచ వసంతరావును అభినందించ డం కాదు, జన్మ పరమార్ధాన్ని గుర్తు చేస్తున్నందుకు అభివందనాలు తెలుపు దాం. ఆత్మ సంస్కారాన్ని మేల్కొలుపుతున్నందుకు శుభాభివందన చందనాలతో పలకరిద్దాం!
-డా. చిల్లర భవానీదేవి, ప్రముఖ రచయిత్రి, సచివాలయం, హైదరాబాద్.

* మంచిగా ఆలోచించటం, మంచిగా స్పందించటం మానవ లక్షణం ఐతే సమాజం మహోన్నతంగా ఉంటుంది. మనిషి ఆలోచన మంచి
దైతే మంచి పనులే చేస్తాడు. మంచి ఫలితాలే సాధిస్తాడు. సమాజం చెడిపోవడం అంటే మానవ స్వభావం చెడిపోయినట్లే. మంచి భావ
నతో కుటుంబాన్ని చక్కదిద్దుకోగలిగితే దేశం అభ్యున్నతి సాధించినట్లే.
మనిషికి ఒక నిర్ధుష్టమైన ప్రణాళిక, లక్ష్యం, ఆదర్శం ఉండడం తప్పనిసరి. అప్పుడే మహోన్నత సమాజం రూపుదిద్దుకుంటుంది.

మనిషి ఉదాత్తమైన, ఉత్కృష్టమైన ఆలోచనలతో ఎలా ఆదర్శ జీవితాన్ని గడపవచ్చో, లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థితికి రావచ్చునో ఇందులో రచయిత సూచించారు. రచయిత వసంతరావుగారు ఈ చిన్న గ్రంధములో మానవ జీవితములోని భిన్న కోణాలను తార్కిక దృష్టితో విశ్లేషించడం ప్రశంసనీయం. సద్భావనలే జీవజగత్తు సుఖ శాంతులకు మూలమన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు.
-డా. ఫరుచూరి గోపాలకృష్ణ, సుప్రసిద్ధ సినిమా రచయిత, హైదరాబాద్.


* ఎంత అద్భుతంగా మకరందాన్ని సేకరించాడు వసంతరావు. ఎన్నో రకాల పూలలోని సుగంధాన్ని చిన్న పుస్తకములో పొందుపరిచారు. ఎంతో కస్టపడి తేనెటీగలు పుష్పాలలోని తియ్యటి తేనెను సంగ్రహించి, పరపరాగ సంపర్కానికి తోడ్పడి, ఫల పుష్ప జాతి అభివృద్ధి చెసేటట్లు చేస్తే, ఈగలు చెత్తకుప్పల మీద వ్రాలి మళ్ళీ వచ్చి మనం తినే వస్తువులమీద వ్రాలి వ్యాధులు కలుగజేస్తాయి. అలాగే మంచివాడికి, చెడ్డవాడికి అంత తేడా
ఉన్నది. సద్భావనా తరంగాలను మనస్సునిండా నింపుకుంటే అందరూ మంచి వాళ్ళు కావచ్చునని మిత్రుడు వసంతరావు ”సద్భావనా స్రవంతి”లో తెలియ జేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలనుంచి వసంతరావుతో పరిచయం ఉన్నది. ఆయనలోని భావతరంగాలను దర్శించే అవకాశం కలుగలేదు ఎప్పుడూ. “అంతర్యామి” శిర్శికలో ఆయన వ్రాసినది చదువగానే ఆశ్చర్యమేసినది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, పరుషంగా ఎప్పుడూ ఒక్కమాట మాట్లాడని ఈ వసంతరావుగారి అంతరంగం లో అద్భుత, అందమైన ప్రపంచం దాగివుందని తెలిసింది. నిశ్చలముగా ఉండే మనిషి ప్రపంచాన్ని జయిస్తాడన్న సూక్తి గుర్తుకొచ్చింది. ఇక్కడ ప్రపంచాన్ని జయించడమంటె బ్రతుకును ఆనందమయం చేసుకోవడం. ఎన్నో మార్గాలు ఆయన తన రచనలో చూపించాడు ఆనంద ముగ బ్రతుకమని బ్రతిమాలుతూ.

ఛితి నిర్జీవమైన శరీరాన్ని దహిస్తుంది. చింత సజీవమైన శరీరాన్ని క్రుంగదీస్తుంది, దహించివేస్తుంది. అందుకే అందమైన గులాబీని గుండెలో నాటు కుంటే ఆ పువ్వు సువాసనలు వెదజల్లి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. దేహ భావం నుండి దైవభావం లోకి ప్రవేశించడానికి కష్టపడాలిగాని, మాటల్లో, ప్రవర్తనలో ఉదాత్తముగా ఉంటేచాలు మానవజన్మ సార్ధకం ఐనట్లే.
-అలపర్తి రామకృష్ణ, ప్రముఖ,కధా, నవలా రచయిత, వనస్థలిపురం.

* నేటి ప్రజలకు కావలసిన చక్కని శాంతి సందేశములు “సద్భావనా స్రవంతి” లో దండిగా గలవు. మానవులకు చాలా ఉపయుక్త ముగా నున్నవి. ప్రతి తెలుగు సోదరీ సోదరులకు ఈ పుస్తకం అందవలెనని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఇంకా ఇటువంటి పుస్తకములు రచించి నూతన సమాజమునకు తోడ్పడగల రని ఎదురుచూస్తున్నాము. “చైతన్య స్రవంతి”, “నిత్య సత్యాలు” పుస్తకాలలో ఎ టు జెడ్ మీరు వ్రాసినవన్నీ చాలా చాలా బాగున్నవి. మీలోనున్న ఓంకారమే స్వయముగా వ్రాసి నవిగా ఉన్నవి. ఇది పొగడ్త కాదు. ఓంకారుల వారికి జోహార్లు. ఛెప్పరా నంత ఆనందముగా ఉన్నది. మీ కవితలు, పద్యాలు, అందరి హృదయాలలో దీపాలు వెల్గించినట్లుగా ఉన్నవి.
- స్వామి చిత్ శివానంద, శ్రీ శాంతి ఆశ్రమం, శంఖవరం, తూ.గో.జిల్లా.

* అద్వైతమును నమ్మినవారికి దేహాలు వేరుగా ఉన్నా ఆత్మ ఒక్కటే కదా! ఆందువలననే ఇద్దరి భావనలు, తాపత్రయం. తమవలె ఈ ప్రపంచ ములోని ఇతర దేహధారులు ఆస్వాదించి, ఆనందించవలెనని అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినట్లు అందించారు సద్భావనా స్రవంతిని. “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” (శ్రీశ్రీ) అన్నట్లు సంతృప్తితో ఉండండి. అంతకంటే చేయగలిగింది ఏముంది? అందించిన వానిని అందుకుని సుఖశాంతులు పొందటం వారి వారి పురుష ప్రయత్నం పై
ఆధారపడి ఉంటుంది. అందుకునే అర్హత ఉన్నవారికే అర్ధమౌతుంది దాని విలువ. “చైతన్య స్రవంతి”, “నిత్య సత్యాలు” పుస్తకం చదివాను. కవితలు చాలా బాగున్నాయి. చెప్పవలసినదంతా ఏమీ మిగల్చకుండ చెప్పారు.ఆస్వాదించి, అనుభవించి, ఆనందం గా జీవించగల అదృస్టవంతులు ఎవరో? మీ పని మీరు చేసినారు. ఆనుభవించి, పలువరించు వారి కోసం ఎదురుచూడండి.
-కోకా నాగేంద్ర రావు, ఆధ్యాత్మిక గ్రంధ రచయిత, తిరువణ్ణామలై, తమిళనాడు.

అహంకారం నశిస్తే ఆత్మజ్ఞానం కలుగును
దేవుడంటే ఆకాశం అవతల లేడు
నీ హృదయములో దాగివున్నాడు దేవుడు
మల్లెపూవు లాంటిది సజ్జన సాంగత్యం
మానవునిలో మాధవున్ని చూడు!
ఇవి శ్రీ రమణ మహర్షి హృదయములోనివి.
("సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి" గ్రంధ ముద్రణకొరకు రూ.10,000/-సహాయం చేసి, జ్ఞాన దానం చేయుటకు సహకరించిన దాత)
- ఓ. నాగేశ్వరరావు, (ప్రస్తుత నివాసం:తిరువణ్ణామలై, తమిళనాడు)
ఒంగోలు, ప్రకాశం జిల్లా.



* మీ రచన “సద్భావనా స్రవంతి” సంతృప్తిగా చదివాను. మహదానంద మైనది. మీ దివ్యానుభూతిలో పాలు పంచుకొనే అదృష్టానికి నోచుకున్నందుకు ధన్యున్ని. మీరు ధన్యజీవులు. బాబా సర్వకేంద్రుల “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” గ్రంధం చదివేకొలది మన ప్రాచీన ఆర్ష సంస్కృతి పున:స్మరణ గలుగుచున్నది. ప్రస్తుత కలుషిత సమాజం లో గత వైభవం పునరావృతం కాగలదాయను సందేహం కలుగక మానదు. జ్ఞాన దాతగా విశ్వవిఖ్యాతి గాంచిన భారతీయ ఋషి సంప్రదాయం నేడు దానవాధీనమైనది. త్యాగ నిరతిగల దేశం లో వంచన, లోభం విస్తృతంగా వ్యాప్తమైనవి. గతాన్ని స్మరించుచూ వర్తమానమును తిలకిస్తే దుర్భర భవిష్యత్తు ఊహాతీతంగా గోచరిస్తుంది.
- “విద్యాభాస్కర” “లలితకవి” తాటిమాను నారాయణ రెడ్డి, బేతంచెర్ల.

* “సద్భావనా స్రవంతి” లోని వ్యాసాలన్నీ విజ్ఞానదాయకంగా ఉన్నాయి. అభినందనలతో…
- బులుసు-జీ-ప్రకాష్, విజయనగరం.

* “సద్భావనా స్రవంతి” పుస్తకం లో జీవన సత్యాలను మీ మనస్సు చెప్పిన రీతిలో, మీ గురువుగారి ఆశీస్సులతో వ్రాసిన తీరు బావుంది. మీ కృషిని అభినందిస్తున్నాను. మరిన్ని మంచి రచనలు మీ కలం నుండి రావాలని ఆకాన్స్కిస్తున్నాను.
- కాటూరు రవీంద్ర త్రివిక్రం, విజయవాడ.
* మీరు ప్రేమతో పంపిన మీ “సద్భావనా స్రవంతి” గ్రంధం అందినది. ‘సూక్ష్మంలో మోక్షం’ అనే విధంగా చిన్న చిన్న అంశాలలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. ముఖ్యంగా ‘విపశ్యన’ ధ్యానాన్ని గూర్చి మీరు వ్రాసిన వ్యాసం నాకెంతో నచ్చింది. మీ రచన సరళం గానూ, సుబోధకం గానూ ఉంది. ఆత్మోన్నతికై సాధనచేసే వారికి మీ గ్రంధం అత్యంత ఉపయోగ మని నా భావన. ఆధ్యాత్మికతలో విశేషానుభవాన్ని గడించిన మిమ్మల్ని అభినందిస్తున్నాను.
-డా.అయాచితం నటేశ్వరశర్మ, రీడర్, సంస్కృత శాఖ, కామారెడ్డి.

* “సద్భావనా స్రవంతి” పుస్తకం చదివాను. పదిమందిలో మంచిని పెంచే ప్రయత్నం చేశారు. సంతోషం.
- ‘మహా సహస్రావధాని’ డా.గరికిపాటి నరసిం హారావు, హనుమకొండ.

* భావితరాలకు, ఒక సాత్త్విక సమాజ స్థాపనకు మీ పుస్తకాలు ఉపయుక్తమవుతాయి. మీ ధార్మిక భావుకతకు అభినందనలు. మీ కృషి నిరంతరం సాగాలని ఆశిస్తున్నాను.
- డా.టి.శ్రీరంగస్వామి, ఎడిటర్, “ప్రసారిక” మాస పత్రిక, హసన్ పర్తి.

* మానవజాతికి దిక్సూచిగా నిర్దేశించే మంచి పుస్తకం “సద్భావనా స్రవంతి”. మానవజాతి సంస్కృతిని సంస్కరించే మార్గాన్ని చూపే జ్ఞాన ప్రసూన మాలిక “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి”. జాతికి కావలసిన వెలుగు దీపాలుగా వెలువరించిన సాహితీ సేద్యకారులుగా అభినందిస్తూ, ఇలాంటి సధావనా స్రవంతులు మీ కలం నుండి మరిన్ని జాలువారాలని మనసారా కోరుకుంటున్నాను.
- బొబ్బిలి జోసెఫ్, ప్రముఖ రచయిత, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

* మీ సద్భావనలు వర్తమాన సమాజాన్ని జాగృతం చేసేవి. ఫ్రతి మనిషికీ కర్తవ్య బోధచేసేవి. మానవుణ్ణి మానవోత్తముణ్ణి చేసే ఆలోచనలు మీవి. మానవాళికి ఉపకరించే చక్కని గ్రంధాన్ని రచించిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. “కలాలు-గళాలు” లో మీ కవిత చదివాను. బాగుంది. మీకు ఉజ్జ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ…
- ‘భారత్ భాషా భూషణ్’, ‘కవితిలక’ డా. తిరునగరి.

* అన్నిరకాల, అన్ని మతాల వారికి సర్వదా ఆచరణీయమైన ప్రవచనాలను మీ పుస్తకములో చూశాను. ఒకసారి కాకుండా మళ్ళీ మళ్ళీ చదువవలసిన, మననం చేసుకోవలసిన అంశాలు పుస్తకం నిండా ఉన్నాయి. మీరు పె ట్టిన సబ్ హెడింగ్స్, వానిలో ఒక్కొక్క అంశమును విశదీకరించిన విధానము అతి రమణీయముగా నున్నది.
ఏ జాతికి, ఏ మతానికి ప్రత్యేకించి ప్ర్రతినిధ్యం వహించని విశాల భావాలుగల ప్రవక్త చెప్పే మాటల్లా ఉన్నాయి మీ వాక్యాలు. నా చిరునామా ఎలా సంపాదించారోగాని నా చేత మంచి, ప్రయోజనకర మైన పుస్తకాన్ని చదివించారు. ఆందుకు మీకు నా అభినందనలు. మనసు వ్రాలిన ప్రతిచోట నిఘావేసి చూడు, చేదు నాలుకలో ఉంది, పదార్ధం లో కాదు, ముక్కోటి దేవతల మీద నమ్మకమున్న మీమీద మీకు నమ్మకం లేనిచో ముక్తి శూన్యం, మనిషి తినటానికే దేవుడు ఇతర జీవుల్ని పుట్టించాడనటం తప్పు, పులికి ఆహారం గా మనిషిని దేవుడు పుట్టించాడంటే నమ్ముతారా? ఇలాంటివి అలోచన రేకెత్తించేవి గా ఉన్నాయి. నాకు మీ పుస్తకం బాగా నచ్చింది. ధన్యవాదములతో…
- గాదేపల్లి సీతారామమూర్తి, రచయిత, అద్దంకి.

* “సద్భావనా స్రవంతి” యనే పుస్తకం ఇంత చిన్న వయసులోనే రచించి, ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన మిమ్ములను అభినందిస్తున్నాను. ఆషామాషీగా చదివి ‘పుస్తకం చదివాం’ అనిపించుకొనే పుస్తకం కాదిది. సద్భావనతో చదివి, జీర్ణించుకొని, ఏ కొంచెమైనా ఆచరణ వైపు ప్రయత్నిస్తే మానవ జన్మ ధన్యమై నట్లేనని చెప్పక తప్పదు.
- కొట్టి రామారావు, రచయిత, మచిలీపట్నం.

* “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” యనే గ్రంధం ఇంటింటా, గ్రంధాలయములయందు ఆవశ్యకముగ నుంచదగి ఉన్నది. వివిధ శీర్షికలతో విద్యాలయములలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గ్రహిచవలసిన ప్రధానాంశములన్నింటిని విపులీకరించి సర్వులకు అవగతమగు లాగున తయారుచేసి అందజేసిన మీకృషిని అభినందిస్తున్నాను.
-కె.ఎస్.ఆర్.కె.వి.వి.ప్రసాద్,రచయిత, నల్ల జెర్ల, ప.గో. జిల్లా.

* మీరు ప్రేమతో పంపిన “సద్భావనా స్రవంతి” పుస్తకం చదివి ఆనందించాను. మానవుడు సర్వోన్నతుడూ, సమగ్రమైన వ్యక్తిత్త్వంతో వికసించడానికి మీరు సూచించిన మార్గం ఉత్కృష్టమైనది. ఈనాటి సమాజం ఈ సన్మార్గం నుండి వైదొలగినందుకే ఇన్ని వైపరీత్యాలు, అశాంతి, అలజడులు పొడసూపినాయి. ప్రతి మనిషి ఆచరించవలసిన సూత్రాలను బోధించినారు. మీకు నా అభినందనలు. మీ కలం నుండి ఇలాంటి సదుపదేశాలు వెల్లివిరిసే గ్రంధాలు వెలువడుతాయని ఆశిస్తున్నాను.
- ప్రొ. పేర్వారం జగన్నాధం, హనుమకొండ.

* మీరు ప్రేమతో పంపిన “సద్భావనా స్రవంతి” “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” యనే ఆధ్యాత్మిక భావనలతో పరిపుష్టి కలిగిన గ్రంధములు అందుకుని చాలా సంతోషించాను. దివ్యమణులు దొరికినంత సంతసము కలిగినది. మీలాంటి పుణ్యపురుషులు నూటికి పదిమంది ఉన్నా భారతావని పూర్వపు స్థాయికి రాగలదని నా భావన. మీ కృషిని అభినందిస్తున్నాను.
- యం. లక్ష్మీకాంతరావు, రచయిత, ఒంగోలు, ప్రకాశం జిల్లా.

* సత్య చైతన్య ధార:
ఏదో అద్భుతం జరగాలి … ఈ దుర్మార్గాలన్నీ అంతరించాలి. ఈ దేశం బాగుపడాలి అని దేశం పట్ల ఆత్మీయత, ప్రేమ, గౌరవ భావం, బాధ్యత గలవాళ్ళంతా మూగగా ప్రార్ధిస్తున్న ఈ సమయములో శ్రీ నేతి విజయదేవ్ ఆధ్యాత్మిక నామంగా కలిగిన ధన్యజీవి శ్రీ నాగులవంచ వసంతరావు. ‘చైతన్య స్రవంతి’, ‘నిత్య సత్యాలు’ పేరిట లోకవృత్త పరిశీలనతో కవితా సంకలనం వెలువరించటం చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా చిరు దివ్వెను వెలిగించటం లాంటిది. శ్రీ వసంతరావు ఆధ్యాత్మిక సాధనలో అక్షరాన్ని కూడా జ్ఞాన మార్గ సాధనంగా భావించటం అభినంద నీయం. కవి ఈ కావ్యం లో మనిషి కోసం పరితపిస్తున్నాడు. మనిషి కోసం ఆలోచిస్తున్నాడు. ఆ తపన, ఆలోచనల ఫలితం ఈ కావ్యం. ‘నానృషి: కురుతే కావ్యం’ కదా! ఇందులోని కవితలన్నీ నేటి సమాజం లో మనుషుల మనస్తత్త్వాలను పరిశీలించి వారిని మరోసారి ఆలోచింప జేసేవి. వివిధ పత్రికల్లో ప్రచురితాలు కూడా. విద్యార్ధి, ఉద్యోగి, అమ్మ, దేశం, మాతృభాష, డబ్బు, భక్తి ఇలా పలు అంశాలు కవికి వస్తువులైనాయి.

ఏ కవి ఐనా ఎందుకు రాస్తాడు? ఒక సంఘటనను చూసినా, విన్నా, దాని గురించి తాను విశ్లేషించుకొని పదిమందిని ఆలోచింప జేస్తాడు. రాయకుండా ఉండలేక రాస్తాడు. వసంతరావూ అంతే! అంతర్మధనం లోంచి అమృతాన్ని పంచాలనుకోవటం సుకవి లక్షణం. ఫరతత్త్వం పై పై నటనలతో తెలియదనీ, బాహ్యాడంబరాలను నిరసించి, మానసిక పరిణతిని ప్రభోధిస్తారు. బ్రహ్మ సత్యం-జగన్మిధ్య అనీ, మాయను జయించాలనీ, దృస్టినిబట్టి సృష్టి అనీ, దేహం అనిత్యమనీ తరతరాలుగా గురుపరంపర బొధించిన సత్య సూత్రాలను కవితాత్మతతో కవి అందించారు. సుజ్ఞానోదయాన్ని కలిగించే ప్రయత్నం చేయాలనుకొవ టమే చైతన్యం.

ఆధ్యాత్మిక మార్గములో పయనిస్తున్నా మనం సమాజాన్ని అంటకుండా వీలుకాదు. బురదలోని పద్మం బురద అంటకుండా ప్రకాశించినట్లు మనిషి సమాజం అనే బురదలోంచి మంచి మాత్రమే గ్రహించి పద్మ కాంతులతో ప్రకాశించగలగాలి. అందుకే వసంతరావు గురువు అనుగ్రహంతో సామాజిక స్పృహతో “చైతన్య స్రవంతి” “నిత్య సత్యాలు” లో సమాజం తలుపులు తీసి అంతరార్ధాలను అందించారు. ఇటువంటి నీతిసూక్తులు ఇప్పటి సమాజం ఎంత గ్రహిస్తుంది అని కవి ఆలోచించరు. తన కర్తవ్యాన్ని నెరవేర్చటమే వీరి ధ్యేయం. రాసే వరకే కవిత్వం కవిది. రాశాక ప్రజలది. అందుకనే విజ్ఞత ప్రజలదే మరి. ఆనేక దురలవాట్ల గురించి, అవినీతి గురించి, విదేశీ వ్యామోహం గురించి, డబ్బుకోసం పరుగెత్తే మనిషి గురించి ఆవేదనతో రాసిన ప్రతి కవిత నిత్య పారాయణ యుక్తం. ‘పాలించట్లేదన్న మాటేగాని పచార్లు మాత్రం వాళ్ళచుట్టే! (పరానుకరణ) కొరడాతో చెళ్ళుమనిపించినంత! ‘పనియందే పరమాత్మను నిండా దర్శించు’ (ఉద్యోగి-ఉద్బోధ) అన్నప్పుడు ‘వర్క్ ఈజ్
వర్షిప్’ అనే స్వామి వివేకానంద వాణి స్ఫురిస్తుంది. శౌర్య ధైర్య ప్రతాపాలతో నూతన దివ్య శక్తిగా భారతమాతను చూడాలనె కవి ఆకాంక్ష కావ్యం నిండా పరుచుకుని పులకరింప జేస్తుంది. సహకారం ఊపిరిగా పాడిన ఈ మేలుకొలుపులో ఆత్మ శక్తి ఉంది. నిజాయితీ ఉంది. మనిషిగా పుట్టినందుకు కన్నతల్లి, ఉన్నవూరు, మాతృదేశ గౌరవం నిలబెట్టాలనే పిలుపునిచ్చిన శ్రీ నేతి విజయ దేవ్ కలం నుండి మరిన్ని ఆణిముత్యాలు రావాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తున్నాను.
- డా.చిల్లర భవానీదేవి, ప్రముఖ రచయిత్రి, సచివాలయం.

* ఉదాత్తమైన ఆశయాలు స్పందించే మనసు ఉన్నకవి తన రచనలో వాటిని ప్రతిబింబిస్తాడు. తద్వారా మనకు ఆదర్శవంతమైన జీవితం గడపడానికి ప్రేరణ దొరుకుతుంది. సాహిత్యం పరమార్ధం మనిషిని మనీషిగా మార్చటమేగా! ఆ దిశగా సాగినాయి శ్రీ వసంతరావు గారి చైతన్య స్రవంతిలోని కవితా సంకలనం లోని కవితలు. వర్తమాన భారతదేశ నిరుద్యోగ చిత్రపటాన్ని కనులముందు ఆవిష్కరింపజేసిన
కవిత ‘భరతమాత కన్నీటి భాష్యం.’ డబ్బులకోసం జీవితమంతా పరుగులు తీస్తే వచ్చే జబ్బులు గ్గించుకోవటానికి ‘ప్రాత:కాల నడకలు తప్పవు సుమా అని ‘డబ్బు-జబ్బు’ కవితలో హెచ్చరిస్తారు. సహ ఉద్యోగుల మధ్య చిచ్చు రగిల్చే సీనియార్టీ, కోర్టు విభేదాల గురించి మనసుకి హత్తుకునే విధముగా ‘ఉద్యోగి-ఉద్బోధ’లో వివరిస్తారు. ప్రపంచములో ఏ అణు విస్పోటనం జరగాలన్నా ఏదో ఒక హృదయం లో బీజం పడాల్సిందేగా! అందుకే హృదయం మహోన్నత దేవాలయం లా ఉండాలని స్పష్టముగా చెప్పిన కవిత “హృదయశుద్ది.” ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని కవితల్లో కవి పడే ఆరాటం, ఆవేదన మనల్ని ఆలోచింప జేస్తాయి. విస్తృత గ్రంధపఠనం, సాహితీ మిత్రుల సాంగత్యం, ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులతో మున్ముందు ఇంకా చక్కటి కవితలు ఎన్నో వ్రాయాలని ఆకాంక్షిస్తూ… అభినందనలతో!
- శ్రీమతి ఎస్. రమాదేవి, ఉపకార్యదర్శి, సచివాలయం.

* ప్రేమ, దయ, విద్య, అన్నీ రెండక్షరాలే. వసంతరావు కవితలన్నీ
ఈ రెండక్షరాల చుట్టూ తిరుగుతూ అనంతమైన సృష్టి రహస్యాలను, జీవిత సత్యాలను తెలియజేస్తాయి. డబ్బు, కల్తీ, మాయ, ఇవీ రెండక్షరాలే! మనిషిని మత్తులో పడేసి చిత్తు చేసే సత్తాగలవి. వీటి మాయలో పడొద్దని వసంతరావు కవితలు బ్రతిమాలతాయి, ప్రభోదిస్తాయి.
- అలపర్తి రామకృష్ణ,ప్రముక కధా నవలా రచయిత,వనస్ధలిపురం.


* మిత్రుడు “నేతి విజయదేవ్” (నాగులవంచ వసంతరావు) ఆధ్యాత్మిక లోతుల్ని తరచి, మధించి, వెలికితీసిన విజ్ఞాన గుళికలు ఇందులో ఉన్న కవితలు. విద్యార్ధులకు, మేధావులకు, సంపన్నులకు, సామాన్యులకు, సాధకులకు - ఇలా ప్రతి ఒక్క వర్గానికి దిశా నిర్దేశం చేసే చక్కటి కవితలు ఇందులో ఉన్నాయి. సంస్కారం, ఆత్మవికాసం కలిగించే కవితలే ఇందులో ఉన్నవన్నీను. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కవితలు వెలుగు కిరణాలు…కాంతి పుంజాలు…
-అవధానుల సుధాకరరావు, ప్రముఖ కధా రచయిత, సచివాలయం.

* శ్రీ నేతి విజయదేవ్ గురుప్రసాదిత నామధేయంతో పరిచయం కాబోతున్న శ్రీ నాగులవంచ వసంతరావుగారి కవితా సంకలనం నేటి ప్రపంచానికొక వెలుగుబాట. విద్యార్ధులను నిద్రలేపుతూ, భరతమాత రోదనను వినిపించుకొనక డిగ్రీలనే భిక్షా పాత్రలు చేకొని విదేశా లకు డాలర్ల మోజులో డబ్బు డబ్బు అనుకుంటూ డబ్బులోనే విలువను చూస్తూ పరుగులు పెట్టే యువతకు కనువిప్పు కలిగిస్తూ, స్వధర్మాన్ని మరచిన ఉద్యోగులకు మంచి ఫలితాలవైపు పయనింపజేసే మార్గదర్శిగా, మాతృదేశాన్ని మరచిన మేధావులకు కనువిప్పుగా, మూఢ నమ్మకాలతో మానవత్వాన్ని మంటగలిపే వారికి ఒక హెచ్చ రికగా సాగి, తృప్తి కలిగిన మనిషిగా, మంచి మాట, హృదయశుద్ధితో మానవుని మాధవత్వంవైపు నడిపించి, నీవు సామాన్యుడవు కాదు – మహాత్ముడివని తెలియజేస్తూ, విషయవాసనలను విసర్జించి, పరిపూర్ణ మైన మానవునిగా దైవత్వంవైపు నడిపించే ఒక చక్కని మార్గదర్శకంగ నిలిచి, మానవుని దివ్య జీవనంవైపు నడిపించే చైతన్య స్రవంతి కవితా సంకలనం మనందరికి అనుసరణీయం కావాలి.
- పి. రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి, సచివాలయం.

* “చైతన్య స్రవంతి”లోని వసంతరావు కవితా గుళికలు - అభినవ యువతకు తేనె పలుకులు, జీవితానికవి మూలాధారాలు - చదవాలి తప్పక నేటి యువతరం, అనుసరిచాలి వాటి భావం - అనుభవించాలి తత్ ఫలం, అదే భావి భారత బలం.
-ఎన్.పి.సిహెచ్. భాస్కరరావు, సచివాలయ నగర్, వనస్ధలిపురం.

* Dear Sri Vasantha Rao, I have read your well written book ‘Sadbhavana Sravanti’ which you gave me in the meeting. I have enjoyed and profited by reading.

You have briefly presented the qualities of an ideal person and a road map for human perfection. In these days of drastic decline in values and culture when fair is foul and foul is fair, the significance and usefulmenss of your book can hardly be exaggerated. It points the spiritual path. I am circulating your book among a few young men.
26-11-2006
Dear Sri Vasantha Rao, The two books ‘Sadupadesa Vidyalaya Pradeepti’ and ‘Chaitanya Sravanth/Nitya Satyalu’ are excellent books which I read with great interest and found them unputdownable.

Theformer is an unvaluable guide to every one connected with education – teacher, student, parent and the management of Schools. It is a store house of knowledge, wisdom and constructive criticism. It should find pride of place in the libraries of all educational institutions and public libraries too.

The latter contains capsules of wisdom and counsel useful in daily life. After Independence, we are hizacked from India’s pristine culture and value system into a new culture which may be called, Five-Star Hotel Culture, which consists in the pursuit of filthy lucre. Fair is foul, and found is fair.

Pranams to Baba who has done so much to revive our ancient glory, making use of your good self as an instrument. Hearty congratulations to you for your dedication and commitment to values.

Prof. I.V. Chalapati Rao, Editor, Triveni, Gandhi Nagar, Hyderabad.


* Blessed Immortal Self Sri Vasantha Rao. Trust this letter find you in best of health and high spiritis. Received your copy of “Sadhavana Sravanthi” written in Telugu. The topics imbibed in the book are to heart’s content. The work of spiritual enlightenment through this small book is a key to knowledge to many who go through it and is indeed appreciable. May Lord Shiridi Saibaba bestow his divine grace upon you to continue such divine works at large.
- H.H.Sadguru Dr. Sai Kumar, Founder, Sai Geetha Ashram, Sec-bad.

* My Dear Vasantha Rao, I congratulate you in authoring and compiling the two books, which are really eye openers. I wish that these books should be available to the masses, who will be benefited by inculcating the habit of following the truths to live in peace and nearer to the creator and to finally reach Him.
- D.L.N.M. Patnaik, Dy. Director (Retd.), Local Fund, Vanasthalipuram.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home