Saturday, June 23, 2007

రచయిత పరిచయం

కవి, రచయిత శ్రీ నాగులవంచ వసంతరావు గారు సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్నారు.

2004 ఫిబ్రవరి మాసంలో “సద్భావనా స్రవంతి” ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని రచించి ప్రచురింపజేయడం జరిగింది.60 ఆధ్యాత్మిక వ్యాసాలుగల ఈ పుస్తకం పలువురు ఆధ్యాత్మిక వేత్తల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది.

ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 12 ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. శ్రీ బిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న “ధ్యాన మాలిక“ అధ్యాత్మిక మాస పత్రికలో ప్రచురింపబడిన “దివ్యుడా కనువిప్పుకో!” అనే కవితకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషికం, ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక లభించాయి.

“చేతన” సచివాలయ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో వరుసగా 2006 మరియు 2007 సంవత్సరాలలో “పరానుకరణ” “జీవితం” అనే కవితలకు జ్ఞాపికలు మరియు శాలువాతో సత్కారం జరిగింది. చేతన కవితా సంకలనంలో ప్రచురింపబడ్డాయి.

“నవ్య సాహితీ సమితి” వారి ఉగాది కవి సమ్మేళనంలో చదివిన కవితకు శాలువాతో సత్కారం జరిగింది. “సాహితీ స్రవంతి” హైదరాబాదు శాఖ వారి “కలాలు- గళాలు” 2006 కవితా సంకలనంలో “కల్తీ-కాలుష్యం” కవిత ప్రచురింపబడింది.

2006 ఫిబ్రవరి మాసంలో బాబా సర్వకెంద్రుల “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” యనే గ్రంథం సంకలనం చేసి ప్రచురింపబడింది. ఫ్రముఖ విద్యావేత్తల, మేధావుల ప్రశంసలనందుకున్నది.

బాబా సర్వకెంద్రుల వారిచే రచింపబడి, నాచే సంకలనం చేయబడి, 2007 జనవరి 29వ తేదీన ఆవిష్కరింపబడిన “సుజ్ఞానోదయ సర్వాత్మ తత్త్వములు” గ్రంథం బహుళ ఆదరణ పొందినది.

“సుగంధ సాహిత్య సౌరభాలు” సంస్థ ఆధ్వర్యంలో 2007 మార్చి 19వ తేదీన నిర్వహింపబడిన ఉగాది కవి సమ్మేళనంలో “జీవితం” కవితకు సన్మానం, జ్ఞాపిక లభించాయి.

2007 సంవత్సరంలో రచించిన “చైతన్య స్రవంతి” (కవితా సంకలనం) మరియు “నిత్య సత్యాలు” (పద్య శతకం) పలువురి ఆధ్యాత్మిక వేత్తల, మేధావుల, సాహితీ ప్రముఖుల, రచయితల ప్రశంసలను అందుకొన్నది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home